BRS Meeting: నేడే జగిత్యాల బీఆర్ఎస్ మీటింగ్.. పాల్గొననున్న ఎమ్మెల్సీ కవిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS Meeting: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు జగిత్యాలకు రానున్నారు. చల్ గల్ మామిడి మార్కెట్ లో ఏర్పాటు చేసిన జగిత్యాల నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి ఆమె హాజరై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే వేదికపై కాంగ్రెస్ నుంచి కీలక నేతలు గులాబీ పార్టీలో చేరి వారికి కండువాలు కప్పి ఆహ్వానించనున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన అనంతరం తొలిసారిగా జిల్లాకు వస్తున్న కల్వకుంట్ల కవితకు ఘనస్వాగతం పలికేందుకు పార్టీ నేతలు సర్వం సిద్ధం చేశారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఏర్పాట్లను పరిశీలించి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో బుధవారం జరిగే బీఆర్ఎస్ కార్యకర్తల నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత హాజరుకానున్నారు. ఎమ్మెల్సీ కవిత జగిత్యాల అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత తొలిసారిగా జగిత్యాలకు వస్తున్నారని, జగిత్యాల ఎమ్మెల్యే బీఆర్ఎస్ అసెంబ్లీ సంజయ్ కుమార్ భారీ ఎత్తున సభను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎమ్మెల్సీ కవిత లోకాల్లో ప్రత్యేక దృష్టి సారించారు..
Also Read
- Off The Record : మంత్రుల వైఖరి తో నారాజ్ గా ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ కేడర్
- Ghost SIM Scam: 'ఘోస్ట్ సిమ్’ గ్యాంగ్ గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్.!
- Off The Record : కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యటనలు అంటేనే భయపడుతున్న రాష్ట్ర అధికారులు
- TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
2014 నుంచి నిజామాబాద్ లోక్ సభ పరిధిలోని జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంపై ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక దృష్టి సారించిన సంగతి అందరికీ తెలిసిందే. 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసిన కవిత.. జగిత్యాల నియోజకవర్గం నుంచి బీఆర్ ఎస్ అభ్యర్థిగా డాక్టర్ సంజయ్ కుమార్ ను ఎంపిక చేసి బరిలోకి దింపారు. పార్టీలో చేరిన నెల రోజులకే ఎన్నికల రంగంలోకి దిగిన సంజయ్ ను గెలిపించేందుకు కవిత సర్వశక్తులు ఒడ్డారు. కానీ సంజయ్ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే సంజయ్ ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ప్రకటించిన కవితకే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధిలో పాలుపంచుకున్నారు. నియోజకవర్గానికి కోరిన ప్రతి అభివృద్ధి పనులను మంజూరు చేయడమే కాకుండా జగిత్యాలలో సంక్షేమ పథకాలు అమలయ్యేలా ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా రూ.300 కోట్లతో 4,500 డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరయ్యాయి.
కవిత నేతృత్వంలో సంజయ్ కుమార్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు నాలుగేళ్ల కాలంలోనే సత్ఫలితాలనిచ్చాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సంజయ్ కుమార్ 60 వేలకు పైగా మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కవిత జగిత్యాల నుంచి జైత్రయాత్ర ప్రారంభించినట్లే బీఆర్ఎస్ విజయ పరంపర కూడా జగిత్యాల నుంచి ప్రారంభం కావడం విశేషం. ఈసారి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో అదే తరహాలో జగిత్యాల నుంచి జైత్రయాత్ర ప్రారంభించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం జగిత్యాల నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తల సమావేశం జరుగుతోంది. చల్ గల్ గ్రామ శివారులోని మామిడి మార్కెట్ ఆవరణలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. జగిత్యాల పట్టణంతోపాటు జగిత్యాల అర్బన్, రూరల్, సారంగాపూర్, బీర్పూర్, రాయికల్ మండలాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కార్మికులకు ఆహార సదుపాయాలు కల్పిస్తున్నారు. సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కార్యకర్తలు తీసుకోవాల్సిన చర్యలు, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, తప్పుడు ప్రచారాలను ఎదుర్కోవడానికి వ్యూహాలు, ప్రచార సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సోషల్ మీడియా ప్రచారం విషయంలో కార్యకర్తల పాత్ర, అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించి వ్యూహం రచించనున్నారు.
Chandrababu Case: చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని పిటిషన్.. ఏసీబీ కోర్టులో నేడు విచారణ
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!