MLC Kavitha: మహిళా రిజర్వేషన్ పోరాటానికి సన్నద్ధం కావాలి.. కవిత పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha Speech In Malla Reddy College On Women Day: మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కల్పనకు కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలన్న పోరాటానికి సన్నద్ధం కావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. మంగళవారం మల్లారెడ్డి విద్యాసంస్థల్లో నిర్వహించిన మహిళా దినోత్సవం కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సాటి మహిళలకు ఏదైనా చేయడాన్ని బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. తనకన్నా ముందు తరం మహిళలు స్వాతంత్రం కోసం పోరాడారని, తన తరంలోని మహిళలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని, ఇప్పుడు మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కోసం పోరాటం చేసేందుకు సన్నద్ధం అవ్వాలని చెప్పారు. ఈ మహిళా రిజర్వేషన్ పోరాటాన్ని తాను ముందుకు తీసుకెళ్లానని, భవిష్యత్తు మహిళా తరానికి మీరేం చేస్తారో ఆలోచించుకోవాలని అన్నారు.
Police Torture: దారుణం.. పోలీసుల వేధింపులు తాళలేక యువకుడు ఆత్మహత్య
Also Read
- Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Devji : లాసెట్లో మెరిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ..
- OTR : మంత్రి శ్రీధర్బాబుతో ఎంపీ వంశీకి సెట్ అయిందా?
లింగ సమానత్వంతో పాటు మహిళలకు, పురుషులకు సమానమైన వేతనాలు, పని గంటలు ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ మహిళా దినోత్సవం వచ్చిందని కవిత వివరించారు. కానీ.. మన దేశంలో అసమానతలు ఇంకా అలాగే ఉన్నాయని, సమానత్వం ఇంకా రాలేదని చెప్పారు. సమానమైన వేతనాల కోసం ఆడపిల్లలు డిమాండ్ చేయాలన్నారు. మహిళా విద్యార్థులందరూ ఆయా కంపెనీలు ఇచ్చే జీతాలను అధ్యయనం చేయాలని, పురుషులకు ఇచ్చే జీతాలతో సమానంగా తమకు ఇవ్వాలని డిమాండ్ చేయాలని సూచించారు. ఇక్కడి నుంచే మార్పు మొదలు కావాలన్నారు. చదువుకోవడం, ఉద్యోగం చేయడం అనే పద్ధతి ఇప్పుడు పాతగా అయిపోయిందని.. ఉద్యోగం చేసి, అనుభవం గడించి మనమే ఒక పరిశ్రమ స్థాపించి వేలాది మందికి ఉద్యోగాలు కల్పించాలన్న పద్ధతి రావాలని అభిప్రాయపడ్డారు. బహుళజాతి సంస్థల్లో ఉద్యోగం చేద్దామన్న ఆలోచన కాకుండా.. మనమే ఒక బహుళ జాతి సంస్థను ఎందుకు పెట్టకూడదన్న ఆలోచన చేయాలని దిశానిర్దేశం చేశారు.
Tragedy In Holi Festival: హోలీ సంబరాల్లో విషాదం.. ఓ వ్యక్తిపై పెట్రోల్ పోసి..
ఈరోజు ఉన్న సాంకేతికత, అవకాశాల నేపథ్యంలో.. పట్టుదల ఉంటే చాలని, డబ్బులు వాటంతట అవే వస్తాయని కవిత పేర్కొన్నారు. ఐడియాలుంటే.. సహాయం చేసేందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాయన్నారు. ఒక ఐడియాతో వస్తే.. మార్గ నిర్దేశం చేయడానికి, వనరులు సమకూర్చడానికి టీ-వర్క్స్, టీ-హబ్ వంటివి అన్ని రకాల మద్దతు అందిస్తాయన్నారు. ఆడపిల్లలు స్మార్ట్గా ఉండడమే కాదు, స్మార్ట్ ఫోన్లా ఉండాలన్నారు. జీవితంలోకి ఎవరు కావాలో వాళ్ళని మాత్రమే రానివ్వాలని, నెగెటివ్ వ్యక్తులను రానివ్వకూడదని తెలిపారు. మన మనసు ఏది చెప్తే అదే చేయాలని అన్నారు. ఎవరైనా కామెంట్ చేస్తే, నవ్వి వాళ్లను విస్మరించాలని.. సోషల్ మీడియాలో ఎవరైనా వేధిస్తే, వారి ఖాతాలను తొలగించే విధానం రావాలని ఎమ్మెల్సీ కవిత ఆకాంక్షించారు.
Kishan Reddy: కేసీఆర్కు జవాబిచ్చే సంస్కారం లేదు.. కిషన్ రెడ్డి ఫైర్
తాజావార్తలు
-
KL Rahul: కేఎల్ రాహుల్కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
-
East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
-
Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
-
K Annamalai: “కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా”.. అన్నామలై సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..