Police Torture: దారుణం.. పోలీసుల వేధింపులు తాళలేక యువకుడు ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
A Boy Commits Suicide In Warangal For Torturing Him In Police Station: వరంగల్ జిల్లాలో ఓ దారుణం చోటు చేసుకుంది. పోలీసుల వేధింపులు తాళలేక.. ఓ యువకుడు పోలీస్ స్టేషన్ ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతడ్ని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. చేయని దొంగతనాన్ని తనపై మోపి, నేరాన్ని అంగీకరించాలంటూ పోలీసులు ఒత్తిడి చేయడం వల్లే.. ఆ యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్టు తేలింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. గీసుగొండ మండలం వంచనగిరిలో ఉంటోన్న వంశీ (21) అనే యువకుడి బంధువులు, తమ ఇంట్లో ఉన్న 5 తులాల బంగారాన్ని వంశీ దొంగతనం చేశాడంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో.. విచారణ నిమిత్తం పోలీసులు వంశీని పోలీస్ స్టేషన్కి పిలిపించారు.
Tragedy In Holi Festival: హోలీ సంబరాల్లో విషాదం.. ఓ వ్యక్తిపై పెట్రోల్ పోసి..
Also Read
- Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
- Nayeem Mu*rder: నాగోల్లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
తాను ఈ దొంగతనం చేయలేదని, తనపై తప్పుడు కేసు పెట్టారని వంశీ పేర్కొన్నాడు. కానీ.. పోలీసులు అతని మాటల్ని పట్టించుకోలేదు. నువ్వే దొంగతనం చేశాడంటూ వేధించడం మొదలుపెట్టారు. తాను చోరీ చేయలేదని ఎన్నిసార్లు మొత్తుకున్నా వినలేదు. ఇలా ఐదు రోజులపాటు వంశీని పీఎస్కి పిలిచి విచారించారు. ఈ చోరీతో తనకు సంబంధం లేదని తెలిపినా సరే.. ‘‘దొంగతనం చేసింది నువ్వే, నేరాన్ని ఒప్పుకొని తీరాల్సిందే’’ అంటూ టార్చర్ పెట్టారు. అంతేకాదు.. తీవ్రంగా కొట్టారు కూడా! దీంతో చేయని నేరానికి తనను కొట్టారన్న మనస్తాపంతో.. పోలీసుల ముందే వంశీ పురుగుల మందు తాగేశాడు. దాంతో.. పోలీసులు హుటాహుటిన అతడ్ని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకున్నప్పుడు వంశీ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. చికిత్స అందిస్తుండగా.. ప్రాణాలు కోల్పోయాడు.
Kishan Reddy: కేసీఆర్కు జవాబిచ్చే సంస్కారం లేదు.. కిషన్ రెడ్డి ఫైర్
చేతికి అందివచ్చిన అబ్బాయి ఇలా చనిపోవడంతో.. వంశీ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు. పోలీసులు పెట్టిన వేధింపుల వల్లే వంశీ మృతి చెందడంతో.. వాళ్లు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరిగేంతవరకు ఆందోళన విరమించుకునేదే లేదని తేల్చి చెప్పారు. ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. చేయని తప్పుకి వంశీని బలి తీసుకున్న పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?