Tragedy In Holi Festival: హోలీ సంబరాల్లో విషాదం.. ఓ వ్యక్తిపై పెట్రోల్ పోసి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy In Holi Festival In Telangana: మన భారతదేశంలో హోలీ సంబరాలను ఎంత ఘనంగా జరుపుకుంటారో అందరికీ తెలుసు. చిన్న, పెద్ద, వర్గ బేధాలేమీ లేకుండా.. ప్రతిఒక్కరూ ఈ వేడుకను జరుపుకుంటారు. అందరూ రోడ్లమీదకొచ్చి.. రంగులు పూసుకుంటారు. చివరికి శతృవులు కూడా తమ మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టేసి.. ఈ వేడుకల్లో ఎంజాయ్ చేస్తారు. అలాంటి ఈ హోలీ సంబరాల్లో.. ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది. కేవలం రంగు పూసిన పాపానికి.. ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా చంపేశారు. పెట్రోల్ పోసి మరీ నిప్పంటించారు. తెలంగాణలోని మెదక్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..
Kishan Reddy: కేసీఆర్కు జవాబిచ్చే సంస్కారం లేదు.. కిషన్ రెడ్డి ఫైర్
Also Read
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
రేగోడ్ మండలం మర్పల్లిల్లో అందరూ హోలీ సంబరాలు జరుపుకుంటున్నారు. ప్రతిఒక్కరూ సరదాగా హోలీ ఆడుతూ.. ఆ క్షణాలను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అంజయ్య, షబ్బీర్ ధమ్య ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగింది. షబ్బీర్ మీద రంగు పూసేందుకు అజయ్య ప్రయత్నించాడు. తన మీద రంగు పూయొద్దని చెప్పినా.. అంజయ్య వినకుండా రంగు పూశాడు. దీంతో కోపాద్రిక్తుడైన షబ్బీర్.. ఆ వ్యక్తితో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరిగి, వివాదం ముదిరింది. అప్పుడు షబ్బీర్ పెట్రోల్ తీసుకొచ్చి, అంజయ్యపై పోసి, నిప్పంటించాడు. ఈ నిప్పుల్లో అంజయ్య శరీరం చాలా వరకు కాలింది. స్థానికులు వెంటనే స్పందించి.. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అనంతరం అతడ్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అంజయ్య పరిస్థితి విషమంగానే ఉంది.
Puri- Charmi: ఏయ్.. ఏయ్.. ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు కెమెరా కంటికి చిక్కారు
మరోవైపు.. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు, వెంటనే రంగంలోకి దిగారు. సంఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. అంజయ్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన షబ్బీర్ని అదుపులోకి తీసుకున్నారు. కేవలం రంగు పూసిన కోపంలోనే షబ్బీర్ ఈ దారుణానికి పాల్పడ్డాడా? లేకపోతే గతంలో వీరి మధ్య గొడవలేమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అటు.. అంజయ్య తీవ్ర గాయాలతో ఆసుపత్రిపాలవ్వడంతో, అతని కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
MLA Ravi Shankar: రవిశంకర్ సవాల్.. రేవంత్రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలి
తాజావార్తలు
-
AAA Cinemas Vizag: ఈసారి పుష్పరాజ్ని కలవడం కష్టమే.. వైజాగ్ AAA ఓపెనింగ్కు ఫ్యాన్స్కు నో ఎంట్రీ!
-
Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
-
Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
-
Plastic Chair Cleaning Tips: తెల్లటి ప్లాస్టిక్ కుర్చీలపై మొండి మరకలా? వంటింట్లో ఉన్న పదార్థాలతోనే ఈజీ క్లీనింగ్
-
Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!