Kishan Reddy: కేసీఆర్కు జవాబిచ్చే సంస్కారం లేదు.. కిషన్ రెడ్డి ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy Fires On CM KCR: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై ధ్వజమెత్తారు. వివిధ ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వంతో తాము చర్చలు జరుపుతున్నామని, లేఖలు కూడా రాస్తున్నామని అన్నారు. సీఎం కేసీఆర్కు తాను పదే పదే ఉత్తరాలు రాస్తున్నానని, అయితే ఏ ఒక్క దానికి కూడా సీఎం నుండి జవాబు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని లేఖలు రాసినా.. తెలంగాణకు ప్రధాని మోడీ, కిషన్ రెడ్డి ఏం చేశారని కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ అడుగుతున్నారని మండిపడ్డారు. కేంద్రమంత్రులకు ప్రజాప్రతినిధుల నుండి వచ్చే లేఖలను ప్రాసెస్ చేసేందుకు ఒక ప్రత్యేక వ్యవస్థ ఉంటుందన్నారు. కేసీఆర్కు జవాబు ఇచ్చే సంస్కారం లేదు కాబట్టి, కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కూడా లేదని తేల్చి చెప్పారు. ట్రైబల్ మ్యూజియం కోసం భూమి ఇవ్వాలని కేంద్రం అడిగితే.. ఇప్పటివరకూ ఇవ్వలేదన్నారు. అయితే.. కేంద్రం మాత్రం అందుకు ఇప్పటికే రూ.1 కోటి ఇచ్చిందని పేర్కొన్నారు.
Puri- Charmi: ఏయ్.. ప్రేమ జంట చాన్నాళ్లకు కెమెరా కంటికి చిక్కారే
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
అంతకుముందు కూడా.. దేశ ఆర్థిక పరిస్థితిపై చర్చించేందుకు తాను సిద్ధమేనని, కేసీఆర్ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. కేంద్రంపై బురదజల్లేందుకు కేసీఆర్ అసెంబ్లీని వాడుకున్నారని.. అసెంబ్లీలో దేశ ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడిన కేసీఆర్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. దేశ ఆర్థిక పరిస్థితిపై కేసీఆర్కు అవగాహన లేదని విమర్శించిన ఆయన.. అసెంబ్లీ సమావేశాల్లో మోదీని ద్వేషించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయిందంటూ.. ప్రపంచానికి తప్పుడు సంకేతం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గత బడ్జెట్లో ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చలేదని, ప్రాజెక్టుల పేర్లతో వేలకోట్ల దోపిడీ రాష్ట్రంలో జరుగుతోందని ఆరోపించారు. మరొకొన్ని నెలల్లో కేసీఆర్ సీఎం గద్దె నుంచి దిగిపోతారని, అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజ్భవన్లో రాజీనామా లేఖ ఇవ్వకతప్పదని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Raja Singh: నకిలీ సర్టిఫికెట్ల వెనుక MIM కుట్ర ఉంది.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!