MLA Rajaiah: కడియం శ్రీహరి ఎన్కౌంటర్ల సృష్టికర్త.. పార్టీ నుండి సస్పెండ్ చేయాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Rajaiah Controversial Comments On Kadiyam Srihari: ఎమ్మెల్యే టీ.రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య అధిపత్యపోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు నాయకుల మధ్య హోరాహోరీగా మాటల యుద్ధం కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రాజయ్య మరోసారి కడియం శ్రీహరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి దేవాదుల సృష్టికర్త కాదని, ఎన్కౌంటర్ల సృష్టికర్త అని, ఆయన్ను వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కుండబద్దలు కొట్టారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం తాటికొండలో నిర్వహించిన మాదిగల ఆత్మీయ సమ్మేళనంలో రాజయ్య మాట్లాడుతూ.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కడియం శ్రీహరిని వెంటనే బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు.
Flipkart: గుడ్న్యూస్ చెప్పిన ఫ్లిప్కార్ట్.. 30 సెకన్లలోనే పర్సనల్ లోన్..
Also Read
- Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
- Kishan Reddy : అసదుద్దీన్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్
- SIR Survey : మాది ఏ రాష్ట్రమో తేల్చండి.. తెలంగాణలోని ఆ గ్రామాల్లో ‘సర్’ ప్రక్రియకు బ్రేక్..
- Kishan Reddy vs Asaduddin Owaisi: అసదుద్దీన్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్.. ప్రజలను తప్పుదారి పట్టించొద్దు..!
ఎంపీలు గానీ, ఎమ్మెల్సీలు గానీ.. స్థానిక ఎమ్మెల్యే చెప్పిన తర్వాతే నియోజకవర్గంలోకి రావాలని.. కానీ కడియం శ్రీహరి మాత్రం 2014 నుండి ఇప్పటివరకు ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని రాజయ్య మండిపడ్డారు. 2014 -18 ఎన్నికల సమయంలో తాను తన ఆస్తులు మొత్తం అమ్ముకున్నానన్నారు. కడియం శ్రీహరి ఎమ్మెల్యే కాకముందు అతని ఆస్తులు ఎంతో, ఇప్పుడు ఎంతో చూడాలని అన్నారు. తెలంగాణలోనే కాదు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కడియం శ్రీహరి మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎన్కౌంటర్లు జరిగాయని ఆరోపించారు. 14 ఏళ్లు మంత్రిగా ఉండి కూడా, ఏనాడు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాన్ని కడియం శ్రీహరి పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. నియోజకవర్గంలో నిర్వహించే అభివృద్ధి కార్యక్రమాలకు, పార్టీ కార్యక్రమాలకు.. కడియం శ్రీహరితో పాటు ఆయన అనుచరులు సైతం ఏనాడూ హాజరు కారని చెప్పారు.
Madhu Yaskhi Goud: తెలంగాణలో త్యాగం కాంగ్రెస్ పార్టీది.. భోగం బిఆర్ఎస్ పార్టీది
స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు బాగా జరిగాయని.. నియోజకవర్గ ప్రజలు తన వెంటే ఉన్నారని ఎమ్మెల్యే రాజయ్య చెప్పారు. దళితులందరూ చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈరోజు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడటం తన బాధ్యత అని, నియోజకవర్గంలో గొప్పగా పని చేస్తున్న తాను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. అన్ని గ్రామాల్లోనూ.. ఇంటింటికీ తిరుగుతానన్నారు. కేసీఆర్ తనని తప్పకుండా పిలిపించుకుంటారని, గ్లోబెల్స్ ప్రచారం చేసేవాళ్ల మాటలు నమ్మొద్దని రాజయ్య చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!