Raghunandan Rao: అసెంబ్లీని కేసీఆర్ రాజకీయ వేదికగా మార్చుకున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Raghunandan Rao Fires On CM KCR: అసెంబ్లీని సీఎం కేసీఆర్ తన రాజకీయానికి వేదికగా మార్చుకున్నారని.. ఇది దురదృష్టకరమని ఎమ్మెల్యే రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. భవిష్యత్లో దేశ రాజకీయాల్లోకి వెళ్ళాలని భావిస్తున్న కేసీఆర్.. తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో మాట్లాడారని అన్నారు. పరోక్ష మిత్రుడు కాంగ్రెస్, ప్రత్యక్ష మిత్రుడు ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీలు కూడబలికి.. వాళ్లకు వాళ్లే అసెంబ్లీలో మాట్లాడారని వాపోయారు. విద్యుత్ విషయంలో కేంద్రంపై మాట్లాడిన భట్టి విక్రమార్క.. రాష్ట్రం విషయం గురించి మాట్లాడలేదన్నారు. 2020లో విద్యుత్తు సంస్కరణ బిల్లు తెచ్చి, 2022లో పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపారన్నారు. అసలు పాస్ కాని బిల్లు కోసం అసెంబ్లీలో చర్చించారన్నారు.
‘‘జాతీయ పార్టీ పెట్టొద్దని ఎవరన్నారు? బీఆర్ఎస్ పెట్టుకోండి, వీఆర్ఎస్ తీసుకోండి, ఫాంహౌస్కు పరిమితం అవ్వండి.. మాకేం అభ్యంతరం లేదు’’ అని రఘునందన్ రావు మండిపడ్డారు. మూడు తోకలు ఎలా అధికారంలోకి వస్తాయని ప్రశ్నించారు. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, ప్రతి పక్షాలను గౌరవించటం నేర్చుకోవాల్సింది మీరేనని హితవు పలికారు. తమకు రేపు మాట్లాడే అవకాశం ఇవ్వాలని, అప్పుడు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇస్తామని పేర్కొన్నారు. మోటర్లకు మీటర్లు పెట్టాలని విద్యుత్ బిల్లులో ఎక్కడా పేర్కొనబడలేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం టార్గెట్గానే ఈరోజు, రేపు అసెంబ్లీ సమావేశాల ఎజెండా ఖరారు చేశారన్నారు. సభలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని అభిప్రాయపడ్డారు.
Also Read
- OTR: మూతపడ్డ CCI ఫ్యాక్టరీపై మళ్లీ రాజకీయ రగడ... బీఆర్ఎస్ భారీ స్కెచ్?
- CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
- KTR : గ్లోబరీనా వివాదం.. రేవంత్కు కేటీఆర్ డిఫమేషన్ నోటీసు
- Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
తాజావార్తలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
-
OTR: మూతపడ్డ CCI ఫ్యాక్టరీపై మళ్లీ రాజకీయ రగడ… బీఆర్ఎస్ భారీ స్కెచ్?
-
Pawan Kalyan : ఎర్రచందనం మాఫియాకు పవన్ వార్నింగ్.. మూలాలతో సహా నిర్మూలించాలి..
-
Off The Record: చేవెళ్ల కాంగ్రెస్లో తీవ్ర స్థాయికి పాత, కొత్త వివాదం
-
Swarnagiri Gold Mine : జొన్నగిరి గోల్డ్ మైన్ ఇకపై ‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?