ఇంద్రవెల్లి సభ ను రేవంత్ తన నోటి దురుసుతనం ప్రదర్శించేందుకు పెట్టుకున్నారు. అది దళిత, గిరిజనుల కోసం పెట్టిన సభ కాదు అని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. రేవంత్ దొడ్డి దారిన పీసీసీ అధ్యక్షుడు అయ్యారు. రేవంత్ భాషను చూస్తే ఆయన ముఖం మీద ఉమ్మి వేయాలని కోట్లాది ప్రజలకు ఉంది. కుక్క కాటుకు చెప్పు అనే రీతిలో రేవంత్ కు తగిన శాస్తి చేయాలి. సీఎం కేసీఆర్ పై రేవంత్ వాడిన భాష ను చూసి కాంగ్రెస్ నేతలే సిగ్గుపడుతున్నారు. రేవంత్ డబ్బు సంచులతో రాజకీయం చేయాలని చూస్తున్నారు. దళితులను రేవంత్ చిన్న చూవు చూస్తారు -రేవంత్ లాంటి దుర్మార్గుడిని తెలంగాణ సమాజం సహించదు. తెలంగాణ లో దళిత ,బీసీ ,మైనారిటీ లకు అమలవుతున్న కార్యక్రమాలు చూసి రేవంత్ జీర్ణించుకోలేక పోతున్నారు అన్నారు.
దళిత బంధు అంటే రేవంత్ కు ఎందుకు కడుపు మంట. రేవంత్ చంద్రబాబు ను మోసగించారు ,రేపు సోనియా ను మోసగిస్తారు. కాంగ్రెస్ లో దళిత నేతలు చాలా మంది ఉన్నారు ..రేవంత్ వారి కంటే గొప్పోడు ఏమీ కాదు. ఓటుకు నోటు దొంగను తెలంగాణ సమాజం ఆదరించదు. ఎంపీ గా పార్లమెంటరీ భాష వాడు రేవంత్. చెడ్డ భాష మాట్లాడితే పెద్దోడివి అయిపోవు అని తెలిపారు.ప్రవీణ్ కుమార్ సీఎం కెసిఆర్ ప్రోత్సాహం తో గురుకులాలకు సేవలందించారు. సీఎం కెసిఆర్ పైనే ప్రవీణ్ విమర్శలా అని ప్రశ్నించారు. ప్రవీణ్ కూడా రాజకీయంగా మరో జయప్రకాశ్ నారాయన్ అవుతారు. ప్రతిష్టాత్మకంగా దళిత బంధు తెస్తే దాన్ని కూడా విమర్శిస్తారా… ప్రగతి భవన్ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం ..ఆ భవనాన్ని కూడా తప్పు పడతారా… వై ఎస్ ఎక్కడ్నుంచి పాలించారు… భవనం కట్టుకోలేదా అని అడిగారు. ఇక సీఎం కేసీఆర్ పై పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తే సహించం అని పేర్కొన్నారు.