KTR: మోదీజీ.. దేశాన్ని ఎన్నిసార్లు మోసం చేస్తారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో అగ్రనేతలు భాగ్యనగరానికి రానున్న సంగతి తెలిసిందే. బీజేపీ అగ్రనేతల హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. ఇప్పటికే బీజేపీ, తెరాసల మధ్య ఫ్లెక్లీవార్ నడుస్తూనే ఉంది. తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శిస్తూ కాషాయ నేతలు, మోదీ బైబై అంటూ తెరాస పార్టీ నేతలు ఫ్లెక్సీలతో భాగ్యనగరంలో హోరెత్తిస్తున్నారు. తాజాగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. అబద్ధాల్లో కమళం పార్టీ నేతలను మించినవారు లేరని ఎద్దేవా చేశారు.
అవకాశం దొరికిన ప్రతిసారి బీజేపీపై, ప్రధాని మోదీపై విమర్శలు చేసే మంత్రి కేటీఆర్ మరోసారి ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశాన్ని ఎన్నిసార్లు మోసం చేస్తారని ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. 2018, ఏప్రిల్లో ఓ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశంలోని అన్ని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించామని అన్నారు. మరోవైపు ఎన్పీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము గ్రామానికి జూన్ 25న కరెంట్ వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము సొంత గ్రామానికి విద్యుత్ సదుపాయం కల్పించిన వార్తా కథనాన్ని జోడిస్తూ ట్విట్టర్లో కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. ఇలా ఎన్నిసార్లు దేశప్రజలను మోసం చేస్తారు మోదీజీ అంటూ కేటీఆర్ ట్విటర్లో పేర్కొన్నారు. కాగా ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పోటీలో ఉన్న సంగతి తెలిసిందే.
Also Read
- CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
- Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
- Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
- Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
Lies, Damn Lies & then there are the BJP mark Lies
❇️ In April, 2018 Modi Ji claims that all villages in India are electrified
❇️ On 25th June, 2022 NPA Presidential candidate Draupadi Murmu Ji’s village finally gets electricity
How many times will you fool the nation Modi Ji? pic.twitter.com/NnaXua2iKB
— KTR (@KTRBRS) June 29, 2022
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!