Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Ministers Jagadish Reddy And Errabelli Dayakar Rao Fires On Governor Tamilisai Soundararajan

Ministers on Governor: గవర్నర్‌ తమిళిసైపై మంత్రులు జగదీశ్ రెడ్డి, దయాకర్‌ రావు ఫైర్..

Published Date :September 8, 2022 , 6:31 pm
By Mahesh Jakki
Ministers on Governor: గవర్నర్‌ తమిళిసైపై మంత్రులు జగదీశ్ రెడ్డి, దయాకర్‌ రావు ఫైర్..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Ministers on Governor: గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌పై మంత్రులు జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ గవర్నర్‌గా మూడేళ్ల పదవీ కాలాన్ని ముగించుకున్న నేపథ్యంలో గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ తెలంగాణ ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో మంత్రులు గవర్నర్‌పై మండిపడ్డారు.

ముఖ్యమంత్రిపై, ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం గవర్నర్‌కు ఫ్యాషన్‌గా మారిందని మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. ఇది సరైనది కాదన్న ఆయన.. నిత్యం వార్తల్లో ఉండేందుకే గవర్నర్ ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాజ్‌భవన్‌ను ఉపయోగించుకుని గవర్నర్ బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజ్యాంగబద్ధ సంస్థలను గౌరవించడంలో కేసీఆర్ వంటి పరిణతి చెందిన నాయకుడు మరొకరు లేరన్నారు. గౌరవంగా రాజ్‌భవన్‌ను నడపాల్సిన గవర్నర్ రాజకీయాలు చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. దేశంలో ప్రధాని, రాష్టపతి తరహాలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా పాలన సాగుతుందన్నారు.

Also Read

  • Karimnagar: హృదయ విదారక ఘటన.. తోపుడు బండిపై కుమారుడి శవాన్ని తీసుకెళ్లిన తండ్రి..
  • Rich Girls Trap Case: రిచ్ కిడ్స్ ట్రాప్ అండ్ రే*ప్ కేస్ లో సంచలన అంశాలు.. 25 మంది రిచ్ మైనర్ బాలికలను ట్రాప్ చేసి..
  • CM Revanth Reddy: మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి.. ఈ సారి ఎందుకో తెలుసా?
  • Mancherial: మంచిర్యాల జిల్లాలో విషాదం.. ఈదురుగాలులకు ముగ్గురు రైతుల మృతి..
Add as a preferred
source on google

మరోవైరు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గవర్నర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గవర్నర్ తమిళిసై హూందా తనాన్ని కోల్పోతున్నారని ఆయన అన్నారు. గౌర‌వ‌నీయ‌మైన గవర్నర్ వ్యవస్థను చెడగొడుతున్నారని ఆయన అన్నారు. గవర్నర్‌గా ఆమె చేష్టలు ప్రజలను బాధపెడుతున్నాయన్నారు. తమిళిసై రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలా వ్యవహరిస్తూ, బీజేపీ నాయకులతో సమావేశాలు, చర్చలు జరుపుతున్నారని ఆరోపించారు. గవర్నర్ వ్యవస్థను కించపరుస్తుండ‌టం వల్లనే తమిళిసైకి త‌గిన‌ గౌరవం దక్కడం లేదన్నారు. గవర్నర్ తమిళిసైని తెలంగాణ ఆడపడుచులా చూసుకున్నామన్నారు. కానీ ఆమె బీజేపీ డైరెక్షన్‌లో పని చేస్తున్నారని మండిపడ్డారు.

MLC Kalvakuntla Kavitha: రాష్ట్రాన్ని ఇబ్బందులు పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు..

సమస్యలపై ఆదేశాలు ఇవ్వాల్సిన గవర్నర్ రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని కించపరుస్తూ తిరగడం దేనికని మంత్రి ఎర్రబెల్లి ప్రశ్నించారు. మేడారం వచ్చే సమాచారం స్థానిక మంత్రులుగా కనీసం మాకు ఇవ్వలేదని ఈ సందర్భంగా వెల్లడించారు.రాష్ట్రంలో పర్యటిస్తూ బీజేపీ నాయకులు, కార్యకర్తలను వెంటేసుకు తిరగడం దేనికి సంకేతమన్నారు. ప్రభుత్వ వైద్యశాల‌లపై గవర్నర్ ఉద్దేశపూర్వకంగానే మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రజ‌ల‌కు తెలంగాణలో ఇస్తున్నంత మెరుగైన వైద్యం దేశంలో ఎక్కడా లేదన్నారు. గవర్నర్ తమిళిసై తెలంగాణ రాష్ట్రాన్ని కించపరుస్తున్నారని ఎర్రబెల్లి ధ్వజమెత్తారు. ప్రజలకు తప్పుడు సంకేతాలిచ్చి తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఇచ్చేది లేదు పుచ్చుకునేది లేదు ప్రధాని సమావేశాలకు గ‌వ‌ర్నర్ ఎందుకు వెళ్లాలని ఆయన ప్రశ్నించారు. ద‌యచేసి మీరు హూందాగా ప్రవ‌ర్తించాల‌ని గ‌వ‌ర్నర్‌కు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. గ‌వ‌ర్నర్ ప‌ద‌వికి వ‌న్నె తెచ్చేలా ప్రవ‌ర్తించాల‌ని చేతులెత్తి మొక్కుతున్నామన్నారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • errabelli dayakar rao
  • Governor Tamilisai Soundararajan
  • Minister Jagadish Reddy
  • Ministers comments on Governor
  • telangana news

తాజావార్తలు

  • Vijay-Governor: కాసేపట్లో గవర్నర్‌ను కలవనున్న విజయ్

  • Bangladesh: బెంగాల్‌లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..

  • Congress TVK Alliance: మారిపోయిన తమిళ అధికార పక్షం మ్యాప్.. టీవీకే క్లీన్ స్వీప్.. డీఎంకే-కాంగ్రెస్ దోస్తీకి ‘ది ఎండ్’?

  • Salman Khan: బాలీవుడ్ హిట్ జోడీ మళ్ళీ రిపీట్..

  • Star Hero’s: ఈ ముగ్గురు లెజెండ్స్ రాజకీయాల్లో ఎందుకు నిలబడలేకపోయారు? 

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions