70 ఏళ్లుగా ఇక్కడి ఎమ్మెల్యేలు, మంత్రులు ఏం చేశారు: మంత్రి శ్రీనివాస్ గౌడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం ఊకచెట్టు వాగుపై కురుమూర్తి స్వామి దేవాలయం వరకు కాజ్ వే బ్రిడ్జి, చెక్ డ్యామ్, బీటీరోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్ రెడ్డితో కలిసి భూమిపూజలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. 70 ఏళ్ళుగా ఇక్కడ ఎమ్మెల్యేలుగా.. మంత్రులుగా.. ముఖ్యమంత్రిగా కూడా పదవులు అనుభవించిన వారున్నారు.. వాళ్ళు ఈ ప్రాంతానికి ఏమైనా చేశారా అని ప్రశ్నించారు. కాగా కొందరు మంత్రిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో మంత్రి నలుగురు ఐదుగురు కలసి ఏదో చేయాలని.. మమ్మల్ని అడ్డుకోవాలని చూస్తున్నారు.. మీ తల్లిదండ్రులను అడగండి.. అప్పుడు ఎలా ఉండే.. ఇప్పుడు ఎలా ఉందో వారే చెబుతారు అంటూ మంత్రి వారికి చురకలు అంటించారు.
Read Also: 317 జీవోను తక్షణమే రద్దు చేయాలి: కోదండరాం
Also Read
మేము మిమ్మల్ని చూసుకోండని మా కార్యకర్తలకు పిలుపునిస్తే.. మీరు ఏమైపోతారో ఆలోచించుకోండి. పనులు అడగండి చేస్తాం. మా సీఎం కేసీఆర్ను అడిగైనా సరే నిధులు తెస్తాం.. ప్రజలు అడిగితే.. కురుమూర్తి స్వామి ఆలయం దాకా రోప్వేను కూడా తీసుకొస్తాం.కానీ రాజకీయాలు చేస్తే సహించం అంటూ మంత్రి ఫైర్ అయ్యారు. వాట్సాప్.. ట్విట్టర్లను నమ్ముకుని ఊరుకులాడుతున్నారు. మీరు అధికారంలో ఉండగా ఏమి చేశారో చెప్పండి.. ఇప్పుడు అంతకన్నా ఎక్కువగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ను జైళ్లో పెడితే .. లక్షలాది మంది ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నారని మంత్రి వెల్లడించారు. జైలు గోడలు బద్ధలు కొడతాం.. చరిత్రను తిరగరాసే పరిస్థితి వస్తది. మనం మౌనంగా ఉన్నామని అడ్డమైన వాళ్ళు అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారు. మేము బూతులు మాట్లాడితే తట్టుకోలేరు. తెలంగాణా అంటే తుపాకిలో గుండు లాంటిది.. మనిషిలో గుండె కాయ లాంటిదని అంటూ ప్రతిపక్షాలను పరోక్షంగా హెచ్చరించారు.
తాజావార్తలు
-
Patna High Court: ‘‘సల్వార్ తీయడం, ఛాతీ నొక్కడం’’.. రేప్ అటెంప్ట్ కేసుపై హైకోర్టు కీలక తీర్పు..
-
Income Tax Notice: ఇదెక్కడి పాపం.. రోజుకు రూ.400 సంపాదించే కూలీకి ఐటీ శాఖ షాక్! అసలు ట్విస్ట్ ఇదే
-
SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
-
IRCTC: రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. ఇక వేగంగా తత్కాల్!
-
Mudragada Padmanabham: ముద్రగడ పాడె మోసిన వైఎస్ జగన్.. అంత్యక్రియల్లో ఉద్రిక్తత
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!