70 ఏళ్లుగా ఇక్కడి ఎమ్మెల్యేలు, మంత్రులు ఏం చేశారు: మంత్రి శ్రీనివాస్ గౌడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం ఊకచెట్టు వాగుపై కురుమూర్తి స్వామి దేవాలయం వరకు కాజ్ వే బ్రిడ్జి, చెక్ డ్యామ్, బీటీరోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్ రెడ్డితో కలిసి భూమిపూజలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. 70 ఏళ్ళుగా ఇక్కడ ఎమ్మెల్యేలుగా.. మంత్రులుగా.. ముఖ్యమంత్రిగా కూడా పదవులు అనుభవించిన వారున్నారు.. వాళ్ళు ఈ ప్రాంతానికి ఏమైనా చేశారా అని ప్రశ్నించారు. కాగా కొందరు మంత్రిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో మంత్రి నలుగురు ఐదుగురు కలసి ఏదో చేయాలని.. మమ్మల్ని అడ్డుకోవాలని చూస్తున్నారు.. మీ తల్లిదండ్రులను అడగండి.. అప్పుడు ఎలా ఉండే.. ఇప్పుడు ఎలా ఉందో వారే చెబుతారు అంటూ మంత్రి వారికి చురకలు అంటించారు.
Read Also: 317 జీవోను తక్షణమే రద్దు చేయాలి: కోదండరాం
Also Read
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
- Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
- HYDRA: నార్సింగిలో హైడ్రా దూకుడు.. ఆ చెరువు చుట్టూ కంచె నిర్మాణం షురూ..
- Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
మేము మిమ్మల్ని చూసుకోండని మా కార్యకర్తలకు పిలుపునిస్తే.. మీరు ఏమైపోతారో ఆలోచించుకోండి. పనులు అడగండి చేస్తాం. మా సీఎం కేసీఆర్ను అడిగైనా సరే నిధులు తెస్తాం.. ప్రజలు అడిగితే.. కురుమూర్తి స్వామి ఆలయం దాకా రోప్వేను కూడా తీసుకొస్తాం.కానీ రాజకీయాలు చేస్తే సహించం అంటూ మంత్రి ఫైర్ అయ్యారు. వాట్సాప్.. ట్విట్టర్లను నమ్ముకుని ఊరుకులాడుతున్నారు. మీరు అధికారంలో ఉండగా ఏమి చేశారో చెప్పండి.. ఇప్పుడు అంతకన్నా ఎక్కువగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ను జైళ్లో పెడితే .. లక్షలాది మంది ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నారని మంత్రి వెల్లడించారు. జైలు గోడలు బద్ధలు కొడతాం.. చరిత్రను తిరగరాసే పరిస్థితి వస్తది. మనం మౌనంగా ఉన్నామని అడ్డమైన వాళ్ళు అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారు. మేము బూతులు మాట్లాడితే తట్టుకోలేరు. తెలంగాణా అంటే తుపాకిలో గుండు లాంటిది.. మనిషిలో గుండె కాయ లాంటిదని అంటూ ప్రతిపక్షాలను పరోక్షంగా హెచ్చరించారు.
తాజావార్తలు
-
Ajith Kumar: తలా అజిత్ ఇంట్లో తీవ్ర విషాదం.. దిగ్భ్రాంతిలో ఫ్యాన్స్!
-
Petrol and Diesel Prices Cut: భారీ ఉపశమనం.. పెట్రోల్, డీజిల్ లీటర్పై రూ.22 తగ్గించిన పాక్..
-
Vivo S60 సిరీస్ లాంచ్.. 7200mAh భారీ బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో..
-
Bengal Police: మమతా గూండాల బట్టలూడదీసి..! పశ్చిమబెంగాల్లో రౌడీల భరతం పడుతున్న సువెందు అధికారి
-
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ ముగిసింది.. కొత్త సవాల్కు సిద్ధమైన వైభవ్ సూర్యవంశీ.. నెక్ట్స్ ఆడే మ్యాచ్లు ఇవే..
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..