Minister Seethakka : తప్పుడు ప్రచారం చేస్తే నాశనం తప్పదు కేటీఆర్..!
- ములుగులో మీడియా సమావేశంలో మంత్రి సీతక్క ఆగ్రహం
- కేటీఆర్ తప్పుడు ప్రచారాలపై తీవ్రమైన విమర్శలు
- “పదేళ్ల పాలనలో వేయి ఇండ్లు కూడా కట్టలేకపోయారు” బీఆర్ఎస్పై ధ్వజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Seethakka : బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై మంత్రి సీతక్క మండిపడ్డారు. మంగళవారం ములుగు పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనిపై తప్పుడు ప్రచారం చేస్తూ, వ్యక్తిగత దాడులకు దిగితే కేటీఆర్ నాశనం తప్పదని హెచ్చరించారు. ” మీ చెల్లి నీ మీద దుమ్మెత్తి పోస్తుంది.. ఆమె పరిస్థితిని గమనించు కేటీఆర్!” అంటూ ఆమె ఫైర్ అయ్యారు. చిల్లర రాజకీయాల నుంచి బయటపడాలని హితవు పలికిన సీతక్క, “నువ్వు నిర్వహించిన పంచాయతీరాజ్ శాఖకు నేను మంత్రిగా వచ్చిన తరువాత భయపడుతున్నావ్. నేను ఎలాంటి కుల, కుటుంబ, అధికార పటిష్టత లేకుండా ప్రజల మద్దతుతో నిలబడ్డాను,” అని వ్యాఖ్యానించారు. తన అన్న కూడా ఉద్యమ సమయంలో ప్రాణాలు కోల్పోయారని, తాను ఎవరినీ అండగా లేకుండానే పోరాటం చేసి ముందుకు వస్తున్నానని పేర్కొన్నారు.
SSMB 29 : సైలెన్స్ను కూడా ప్రమోషన్స్ స్ట్రాటజీగా వాడేస్తున్న జక్కన్న.
Also Read
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
ఇక ములుగు అభివృద్ధిని అడ్డుకునేందుకు కేటీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. “పక్క నియోజకవర్గాల్లో ఓడిపోయాక ఇక్కడికి వచ్చి డ్రామాలు చేస్తే ప్రజలు నమ్మరని” స్పష్టం చేశారు. పోలీసు వ్యవస్థను విమర్శిస్తూ కేటీఆర్ చేస్తున్న ఆరోపణలు అసత్యమని అన్నారు. లక్ష్మీదేవిపేట, చల్వాయి గ్రామాల్లో యువకులపై పెట్టిన కేసులను గుర్తు చేస్తూ, “వాస్తవంగా నువ్వు ధైర్యవంతుడివైతే చర్చకు సిద్ధమవ్వు” అని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పించిన మంత్రి, “పదేళ్లలో కనీసం వేయి ఇండ్లయినా ములుగులో నిర్మించారా? ఇప్పుడేమి మాట్లాడతారు?” అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా విమర్శిస్తున్న కేటీఆర్కు సంస్కారం లేదని, ప్రజాస్వామ్య పాలన ఎలా ఉంటుందో ములుగులో తాము చూపిస్తున్నామని అన్నారు.
Rammohan Naidu: జగన్ ప్రభుత్వ వైఖరి కారణంగా రైతులకు అనేక చిక్కుముడులు..!
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!