Minister Seethakka : ఆయిల్ ఫార్మ్ పంట రహస్యం చెప్పిన మంత్రి సీతక్క
- ఆయిల్ ఫార్మ్ పంటకు ప్రత్యేక గ్యారంటీ.. రైతులకు లాభాలు
- మహిళలు, యువత కోసం ప్రభుత్వ ప్రత్యేక పథకాలు
- ములుగులో త్వరలో ఐటీ కంపెనీ శంకుస్థాపన
- పర్యాటక కేంద్రాల అభివృద్ధికి మంత్రి తుమ్మల హామీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Seethakka : ములుగు జిల్లా మంజీరా ప్రాంతంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సీతక్క రైతులకు ఆయిల్ ఫార్మ్ పంట ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, “ఆయిల్ ఫార్మ్ సాగుతో రైతులు మంచి లాభాలు పొందవచ్చు. 10 ఎకరాల భూమి ఉన్న రైతులు కనీసం ఐదు ఎకరాలలో ఈ పంటను సాగు చేయాలి. ఈ పంటకు ఉన్న గ్యారంటీ మరే పంటకు లేదు” అని తెలిపారు.
రైతుల భారం తగ్గించేందుకు సబ్సిడీతో ఒక్కో మొక్కను రూ.25కే అందిస్తున్నామని ఆమె వివరించారు. “కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల మేలుకోరే ప్రభుత్వం. రైతులకు దేశంలో ఉచిత కరెంట్ ఇచ్చిన మొదటి రాష్ట్రం మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి కాంగ్రెస్ ప్రభుత్వమే. అలాగే దేశంలోనే మొదటిసారి రూ.70 వేల కోట్ల రైతు రుణమాఫీ చేసినది కూడా కాంగ్రెస్” అని గుర్తుచేశారు.
Also Read
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
మంత్రి సీతక్క మాట్లాడుతూ, మహిళలకు వడ్డీ లేకుండా రుణాలు, యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. దేశవ్యాప్తంగా నిర్భయ పథకం కింద ఎంపికైన 10 జిల్లాలలో ములుగు జిల్లా కూడా చోటు దక్కించుకుందని, త్వరలోనే జిల్లాలో ఐటీ కంపెనీ శంకుస్థాపన చేయనున్నట్టు చెప్పారు. ఈ నెల 18న మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేసి, శాశ్వత భవనం ఏర్పాటుకు పునాది వేస్తారని వెల్లడించారు. వ్యవసాయ శాఖ రాష్ట్రవ్యాప్తంగా పంటలను పండుగలా చేసేందుకు కృషి చేస్తోందని మంత్రి అన్నారు.
Spark of The Paradise: నాని పారడైజ్ జైలు సీక్వెన్స్ వీడియో వచ్చేసింది.. అరాచకం అంతే!
ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడుతూ, “ములుగు జిల్లా ఎప్పటి నుంచో రైతులకు జీవనాధారమైన ప్రాంతం. నేను 40 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు” అని చెప్పారు. ఉగాది రోజున మంత్రి సీతక్క చేతుల మీదుగా ఆయిల్ ఫార్మ్ ప్రారంభోత్సవం జరుగుతుందని తెలిపారు.
“ములుగు జిల్లాలో పర్యాటకాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తాం. కర్రిగుట్ట ప్రాంతాన్ని టూరిజం హబ్గా మార్చుతాం. అలాగే తెలంగాణలోని అన్ని జిల్లాలలో ఆయిల్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాం” అని మంత్రి తుమ్మల అన్నారు.
Dhanush-Mrunal Thakur :ధనుష్ తో డేటింగ్.. ఎట్టకేలకు స్పందించిన మృణాల్..
తాజావార్తలు
-
King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Tamannaah Bhatia: ‘రాగిణి 3’ షూటింగ్ ప్రారంభం.. సెట్స్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా
-
OnePlus N6x: వన్ప్లస్ N6x త్వరలో భారత్లోకి.. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో మరో సంచలనం
-
Palli Chattambi OTT: ఓటీటీలోకి టోవినో థామస్ పీరియడ్ యాక్షన్ డ్రామా… స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!