111 GO: జీవో ప్రకటనపై ఎవరేమన్నరంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు నిరవధిక వాయిదా పడ్డాయి. నేడు సభలో సీఎం కేసీఆర్ 111 జీవో ఎత్తేస్తామని ప్రకటించారు. దీనిపై మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పందిస్తూ.. గతంలో త్రాగునీటి అవసరాల కోసం అక్కడ 111 జీవోను అమలు చేశారని, కానీ ఇప్పుడు ఆ రిజర్వాయర్ల ద్వారా త్రాగునీటి అవసరం లేదు కనుక ఇబ్బంది లేదన్నారు. 111జీవో పై సీఎం సరైన నిర్ణయం తీసుకున్నారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. 84 గ్రామాల పరిధిలో దీనితో మేలు జరుగుతుందని, టీఆర్ఎస్ నేతలకు మేలు చేయడం కోసమే జీవో ఎత్తి వేస్తున్నారనే ఆరోపణలు చేయడం సరికాదన్నారు. చాలా మందికి అక్కడ ల్యాండ్ ఉందని, రాజకీయాలకు అతీతంగా ప్రజలకు మంచి చేస్తే విమర్శలు చేయడం సరైంది కాదన్నారు. 111 జీవో పై లేనిపోని విమర్శలు చేస్తే దాని పరిధిలో ఉన్న వివరాలు సేకరిస్తామని, ఇది ఎప్పటి నుండో దాదాపు 84 గ్రామాల పరిధిలో ఉన్న ప్రజలు అడుగుతున్న సమస్య అని ఆయన వెల్లడించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే స్పందిస్తూ.. 111 జీవో ఎత్తి వేస్తా అని సీఎం చెప్పడం నీ స్వాగతిస్తున్నామన్నారు. మంచి నిర్ణయం.. వైఎస్ హయాంలోనే కమిటీ వేశారు. కోర్టు లో పిటిషన్ పడటంతో ఆగిపోయిందని ఆయన వెల్లడించారు. 111 జీవో ఎత్తెస్తే… రైతులు అదృష్టవంతులు అని, అక్కడి చెరువులకు ఇబ్బంది లేకుండా 111 జీవో ఎత్తి వేస్తే సరిపోతుందన్నారు. చెరువులకు ముప్పు లేదని సీఎం చెప్తున్నా… వాటికి నీళ్ళు కూడా వచ్చేలా చూడటం మంచిదన్నారు.
Also Read
- Nayeem Mu*rder: నాగోల్లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- CM Revanth Reddy: తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
- Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
- Telangana Congress New In-Charge: తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇంచార్జ్.?
కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోదండ రెడ్డి 111 జీవో ప్రకటనపై మాట్లాడుతూ.. జీవో 111 ఎత్తివేత ప్రకటన.. అదరా బాదరా ప్రకటన సరికాదని ఆయన మండిపడ్డారు. 111 జీవో ఎత్తేసి.. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభం చేయాలని అనుకుంటున్నారా..? అని ప్రశ్నించారు. 111 జీఓ పరిధిలో ఉన్న గ్రామాల పరిధి తగ్గించండి అప్పుడు రైతులకు మేలు జరుగుతుందన్నారు. ఇప్పటికే బడా బాబులా చేతిలోకి 111 జీవో భూములు వెళ్ళాయని, పర్యావరణ అనుమతులు, ఎన్జీటీ అనుమతులు రావడం కష్టమన్నారు. సీఎం ఉన్నత స్థాయి కమిటీ వేసి చర్చించాలని, లేదంటే రైతులు నష్టపోతారు… రియల్ ఎస్టేట్ వ్యాపారులు లాభ పడతారని ఆయన హితవు పలికారు.
తాజావార్తలు
-
The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న ‘ఏష నాగుల’ సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
-
Alla Nani No More: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత..
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో రామాయణ ఎపిసోడ్.. రాజమౌళి ఊహించని అప్డేట్!
-
Oracle layoffs: ఉదయం 6 గంటలకే ఈమెయిల్.. ఒరాకిల్లో మళ్లీ భారీగా ఉద్యోగాల కోతలు
ట్రెండింగ్
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!