Ponnam Prabhakar : తెలంగాణ బీజేపీ చీఫ్ పై మంత్రి పొన్నం ఫైర్
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపాటు
- “ఎరువుల సరఫరా కేంద్రం ఆధీనంలోనే ఉంది” – మంత్రి వ్యాఖ్యలు
- రైతుల సమస్యలపై రాజకీయాలు చేయొద్దు.. బీజేపీకి హితవు
- కేంద్రంపై ఒత్తిడి తేవాలని కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో జరిగిన ఒక సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఎరువుల కొరతపై బీజేపీ చేస్తున్న విమర్శలు నిరాధారమని, “ఎరువులు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయనే విషయం కూడా రామచంద్రరావుకి తెలియదా?” అంటూ మండిపడ్డారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, “వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాలు, ఎరువులు ఎక్కడి నుండి వస్తాయో కూడా రామచంద్రరావుకి అర్థం కావడం లేదు. మిగతా విత్తనాలు, నీళ్లు, విద్యుత్ వంటి సదుపాయాలను రాష్ట్రాలు అందిస్తున్నాయి కానీ ఎరువుల తయారీ, సరఫరా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది” అని స్పష్టం చేశారు.
Also Read
“కేంద్రం సరైన విధంగా ఎరువులు సరఫరా చేయడంలో విఫలమవుతుంటే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనం చేయడం ఎందుకు?” అని ప్రశ్నించారు. అంతేకాకుండా.. “బీజేపీ అధ్యక్షుడు తెలంగాణ రైతుల సమస్యలను అర్థం చేసుకోవడం లేదు. ఢిల్లీకి వెళ్లి మీ ప్రధానమంత్రిని కలిసి తెలంగాణకు అవసరమైన ఎరువులు సరఫరా చేయించండి. రైతుల సమస్యలపై రాజకీయాలు చేయడం మానేయాలి” అని హెచ్చరించారు.
Bangladesh: యూనస్ షేక్ హసీనాకు భయపడుతున్నారా..?
రైతుల అవసరాల కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని గుర్తు చేస్తూ, “ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధిత మంత్రులను కలిసి ఎరువుల సరఫరా కోసం విజ్ఞప్తి చేశారు. కానీ బీజేపీ నాయకులు ఈ విషయం మీద మౌనం వహిస్తున్నారు” అని ఆరోపించారు.
“దేశంలో 29 రాష్ట్రాల మధ్య తెలంగాణ పట్ల కేంద్రం ఎంత వివక్షత చూపుతోందో ప్రజలు గుర్తించాలి. బీజేపీ నాయకులు కేంద్రాన్ని ఒత్తిడి చేసి తెలంగాణ రైతులకు కావాల్సిన ఎరువులు తీసుకురావాలి” అని పొన్నం ప్రభాకర్ అన్నారు.
రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎరువులను దాచిపెడుతోందని చెప్పడం పూర్తిగా అబద్ధమని ఆయన ఖండించారు. “ఎరువులు ఎంత స్టాక్లో ఉన్నాయి, ఎంత సరఫరా కావాల్సి ఉంది అనే వివరాలు సేకరించి, ఢిల్లీకి వెళ్లి రామచంద్రరావు మాట్లాడాలి” అని సవాలు చేశారు.
మంత్రి మాట్లాడుతూ, “రైతులు, పల్లెలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీల సమస్యలను అర్థం చేసుకోవడంలో బీజేపీ పూర్తిగా విఫలమైంది. కేంద్రం సరైన విధంగా ఎరువులు పంపకపోవడం వల్లే ఈ ఇబ్బందులు వస్తున్నాయి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి బీజేపీ నాయకులు కేంద్రంపై ఒత్తిడి తేవాలని మేము డిమాండ్ చేస్తున్నాం” అని అన్నారు.
తాజావార్తలు
-
Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఈ నెల 28 నుంచే ప్రారంభం..
-
France: ఫ్రాన్స్లో ఎండలు భగభగ.. ఏసీల కోసం ఎగబడ్డ జనాలు
-
Maa Inti Bangaram : సమంత ‘గోల్డెన్ రన్’.. 17 లక్షలకు పైగా టికెట్లతో ‘మా ఇంటి బంగారం’ సరికొత్త రికార్డ్!
-
Chilli Garlic Egg Salad Recipe: ఉదయాన్నే ఎనర్జీ కావాలా? 5 నిమిషాల్లో రెడీ.. రుచికరమైన హై-ప్రోటీన్ ఎగ్ సలాడ్
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!