Ponnam Prabhakar: నేడు మంత్రి పొన్నం ప్రభాకర్ దీక్ష.. బీజేపీ తీరుకు నిరసన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar: ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ దీక్ష చేయనున్నారు. కరీంనగర్ జిల్లాలోని కాంగ్రేస్ కార్యాలయంలో ఆయన దీక్ష చేపట్టనున్నారు. పదేళ్ల బీజేపీ ప్రభుత్వ పాలనలో వైఫల్యాలపై దీక్ష చేపట్టనున్నట్లు పొన్నం ప్రకటించారు. కేంద్రంలో గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ పట్ల చూపిన వివక్ష, విభజన హామీల అమలులో బీజేపీ తీరుకు నిరసనగా దీక్ష చేయనున్నారు. ఆవిధంగానే రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాల పరిధిలో దీక్షలు చేస్తామని మంత్రి తెలిపారు. మరో ఆరు రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుండడంతో జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంటోంది. గత రెండు రోజులుగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అంటూ జోరుగా చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ బండి సంజయ్ కుమార్ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు.
Read also: Vijayasai Reddy: ముఖ్యమంత్రి జగన్పై జరిగిన దాడి హేయమైన చర్య
Also Read
- CM Revanth Reddy : ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ’.. పాతబస్తీ అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణించాలి
- Asaduddin Owaisi : రేవంత్ రెడ్డి పాలనలోనే అభివృద్ధి.. కాంగ్రెస్కు కాదు, రేవంత్కే నా సపోర్ట్
- Chinna Reddy : పదవి పోయినా గౌరవం ఉంది.. చిన్నారెడ్డి కీలక వ్యాఖ్యలు
- KTR : సాగర్ నీళ్లపై కేటీఆర్ సమరశంఖం.. 10 రోజుల డెడ్లైన్..
బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 10 ఏళ్లు పూర్తయినా విభజన హామీలను విస్మరించిందని, దీనికి నిరసనగా ఈరోజు కరీంనగర్ డీసీసీ కార్యాలయం వద్ద దీక్ష చేపట్టనున్నట్లు పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా ఆయనకు సూటిగా సమాధానం చెప్పేందుకు సిద్ధమవడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. విభజన హామీలను విస్మరించిన బీజేపీకి ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడిగుతుందోనని, ఆ పార్టీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. పదేళ్లలో రాష్ట్రానికి ఏం చేశారో చెప్పేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేశారని విమర్శించారు.
Read also: Iran Vs Israel: ఇజ్రాయెల్పై రెండు వందలకుపైగా డ్రోన్స్, మిస్సైల్స్తో ఇరాన్ దాడి..
ప్రతి ఇంటికి రాముడు, అక్షింతల ఫొటోలు పంపడం తప్ప ప్రతి ఇంటికి ఏం చేశారో చెప్పాలని, వీలైతే బీజేపీకి రాముడి బొమ్మ కాకుండా మోదీ బొమ్మతో ఓట్లు అడగాలని పొన్నం సవాల్ విసిరారు. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ తమ నియోజకవర్గాల్లో ఏం చేశారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పొన్నం ప్రభాకర్ దీక్షా ప్రకటనపై ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. పదేళ్లుగా ఈ విషయంలో పొన్నం ప్రభాకర్ ఏం చేశారో, ఇప్పుడు ఎందుకు దీక్ష చేయాలనుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారని, తెలంగాణ భవన్ వద్ద దీక్ష చేయాలని పొన్నంకు సవాల్ విసిరిన విషయం తెలిసిందే.
Iran Vs Israel: ఇజ్రాయెల్పై రెండు వందలకుపైగా డ్రోన్స్, మిస్సైల్స్తో ఇరాన్ దాడి..
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ’.. పాతబస్తీ అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణించాలి
-
Tamil Nadu: కొత్త అసెంబ్లీ–సచివాలయం.. ఒకే చోట అన్ని ప్రభుత్వ శాఖలు.. సీఎం విజయ్ ప్రకటన
-
Bareilly Viral Video: బురఖాలో ప్రియుడితో పట్టుబడిన భార్య.. నడిరోడ్డుపై భర్త వీరంగం..
-
Vijay-Congress: ముందు మంచి ముఖ్యమంత్రి అవ్వండి.. విజయ్కు కాంగ్రెస్ సూచన
-
Lord Ganesha: 66 కేజీల బంగారం, 335 కేజీల వెండి.. రూ.703 కోట్ల బీమా.. మహా గణపతి దివ్య దర్శనం ఇలా..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!