Ponnam Prabhakar: నేడు మంత్రి పొన్నం ప్రభాకర్ దీక్ష.. బీజేపీ తీరుకు నిరసన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar: ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ దీక్ష చేయనున్నారు. కరీంనగర్ జిల్లాలోని కాంగ్రేస్ కార్యాలయంలో ఆయన దీక్ష చేపట్టనున్నారు. పదేళ్ల బీజేపీ ప్రభుత్వ పాలనలో వైఫల్యాలపై దీక్ష చేపట్టనున్నట్లు పొన్నం ప్రకటించారు. కేంద్రంలో గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ పట్ల చూపిన వివక్ష, విభజన హామీల అమలులో బీజేపీ తీరుకు నిరసనగా దీక్ష చేయనున్నారు. ఆవిధంగానే రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాల పరిధిలో దీక్షలు చేస్తామని మంత్రి తెలిపారు. మరో ఆరు రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుండడంతో జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంటోంది. గత రెండు రోజులుగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అంటూ జోరుగా చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ బండి సంజయ్ కుమార్ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు.
Read also: Vijayasai Reddy: ముఖ్యమంత్రి జగన్పై జరిగిన దాడి హేయమైన చర్య
Also Read
- KTR: మోసపోతే గోసపడుతాం అంటే ఇదే.. 2028లో మళ్లీ కేసీఆరే సీఎం
- Nitin Nabin : తెలంగాణలో త్వరలోనే 'కమలం' వికసిస్తుంది.. వచ్చే ఎన్నికల్లో బీజేపీదే గెలుపు
- HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
- iPhone 16: ఫ్లిప్కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 10 ఏళ్లు పూర్తయినా విభజన హామీలను విస్మరించిందని, దీనికి నిరసనగా ఈరోజు కరీంనగర్ డీసీసీ కార్యాలయం వద్ద దీక్ష చేపట్టనున్నట్లు పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా ఆయనకు సూటిగా సమాధానం చెప్పేందుకు సిద్ధమవడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. విభజన హామీలను విస్మరించిన బీజేపీకి ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడిగుతుందోనని, ఆ పార్టీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. పదేళ్లలో రాష్ట్రానికి ఏం చేశారో చెప్పేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేశారని విమర్శించారు.
Read also: Iran Vs Israel: ఇజ్రాయెల్పై రెండు వందలకుపైగా డ్రోన్స్, మిస్సైల్స్తో ఇరాన్ దాడి..
ప్రతి ఇంటికి రాముడు, అక్షింతల ఫొటోలు పంపడం తప్ప ప్రతి ఇంటికి ఏం చేశారో చెప్పాలని, వీలైతే బీజేపీకి రాముడి బొమ్మ కాకుండా మోదీ బొమ్మతో ఓట్లు అడగాలని పొన్నం సవాల్ విసిరారు. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ తమ నియోజకవర్గాల్లో ఏం చేశారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పొన్నం ప్రభాకర్ దీక్షా ప్రకటనపై ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. పదేళ్లుగా ఈ విషయంలో పొన్నం ప్రభాకర్ ఏం చేశారో, ఇప్పుడు ఎందుకు దీక్ష చేయాలనుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారని, తెలంగాణ భవన్ వద్ద దీక్ష చేయాలని పొన్నంకు సవాల్ విసిరిన విషయం తెలిసిందే.
Iran Vs Israel: ఇజ్రాయెల్పై రెండు వందలకుపైగా డ్రోన్స్, మిస్సైల్స్తో ఇరాన్ దాడి..
తాజావార్తలు
-
Ben Stokes: క్రికెట్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసిన బెన్ స్టోక్స్.. రిటైర్మెంట్ ప్రకటన..
-
KTR: మోసపోతే గోసపడుతాం అంటే ఇదే.. 2028లో మళ్లీ కేసీఆరే సీఎం
-
AB de Villiers: ‘నా లైఫ్లో చూసిన అత్యుత్తమ బ్యాట్స్మెన్స్ వీరే’.. టాప్ 3లో ఎవరెవరంటే..
-
Idupu Kayitham : రచ్చ రచ్చ చేస్తున్న ‘ఇడుపు కాయితం’.. నేషనల్ ఇష్యూ చేశారంటూ నరేశ్ ఫైర్!
-
MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!