Minister KTR : జిల్లాల్లో ఒక్క ప్రాణ నష్టం ఉండొద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో గత ఐదు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే అధికారులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసి సహాయక చర్యలు చేపట్టారు. అయితే తాజాగా మంత్రి కేటీఆర్ భారీ వర్షాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేనివిధంగా జులైలో అత్యధిక వర్షం నమోదు అయ్యిందని, ప్రాథమిక సమాచారం ప్రకారం సాధారణం కంటే 450 శాతం ఎక్కువ గా వర్ష పాతం నమోదైందని ఆయన వెల్లడించారు. జిల్లాలో పెద్దపల్లి, జగిత్యాల, నిర్మల్ మాదిరి అసాధారణ పరిస్థితులు లేవని, అయినా ఉదాసీనంగా, ఆలక్ష్యంగా ఉండొద్దన్నారు. ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ఆయన తెలిపారు. ఆస్తి నష్టం కనిష్టానికి తగ్గించేలా చూడాలని అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇరిగేషన్ అధికారులు, ఇతర ప్రభుత్వ అధికారులు ప్రో ఆక్టివ్ గా ఉండాలని, చెరువులు డ్యామ్లనుంచి నీటిని కిందికి విడుదల చేసే ముందు ప్రజలకి, పోలీస్ రెవెన్యూ వంటి ఇతర శాఖలో ఉద్యోగులకు సమాచారం ఇవ్వాలన్నారు.
నీటి విడుదల సందర్భంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, జిల్లాలో ఒక్క ప్రాణ నష్టం ఉండొద్దన్నారు. ప్రాఫర్ గా మున్సిపాలిటీలతో సహా అన్ని గ్రామాలలో సేఫ్టీ అడిట్ జరగాలన్నారు. పట్టణాలు గ్రామాల్లో తాగునీటి సరఫరాకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. తాగునీరు కాలుష్యం కాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు గ్రామాల్లో పారిశుధ్యం పైన ప్రధానంగా దృష్టి సారించాలన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు కఠినంగా వ్యవహరించాలని, శిథిలావస్థలో ఉన్న పాత నిర్మాణాలను వెంటనే తొలగించాలి. నిరుపయోగంగా ఉన్న బోరుబావులతో పాటు నీటి బాగులను వెంటనే పూడ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. నిర్మాణ పనులు జరిగే చోట హెచ్చరిక సంకేతాలు పెట్టాలి. బ్యారికెడ్ ల నిర్మాణం చేపట్టాలన్నారు.
Also Read
- Hyderabad: మహిళపైకి దూసుకెళ్లిన ప్రొడ్యూసర్ కారు.. "డ్రైవర్నే చంపుకోండి" అంటూ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు..
- OTR : కొందరు 'దరిద్రుల' వల్లే పార్టీ మారా!: పోచారం
- HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు..
- Ponguleti Srinivas : తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లు.. కేంద్రానికి మంత్రి పొంగులేటి బిగ్ రిక్వెస్ట్..
Amarnath Yatra: కశ్మీర్ లోయలో భారీ వర్షాలు.. అమర్నాథ్ యాత్రకు మళ్లీ బ్రేక్
తాజావార్తలు
-
Shweta Singh: సుశాంత్ను ఇప్పటికీ కలల్లో చూస్తున్నా.. ధోనీ కనీసం పరామర్శించలేదు.. సోదరి శ్వేత భావోద్వేగ వ్యాఖ్యలు
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!
-
Ola, Uber, Rapido: ఓలా, ఉబర్, ర్యాపిడో యూజర్లకు గుడ్ న్యూస్.. ‘అడ్వాన్స్ టిప్’ విధానానికి కేంద్రం చెక్
-
CM Chandrababu: ఇది ప్రారంభం మాత్రమే.. దేశంలోనే నంబర్ వన్ రాజధానిగా అమరావతి..!
-
Raveena Tandon : కూతురిని మించి జెట్ స్పీడ్లో సినిమాలు చేస్తున్న ఒకప్పటి గ్లామరస్ బ్యూటీ
ట్రెండింగ్
-
Rohit Sharma: ఇక నేను ఆడను.. అదే చివరిది.. రోహిత్ శర్మ భావోద్వేగం!
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!