తెలంగాణలో పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన, ఇతర కార్యక్రమాల కోసం కేంద్ర బడ్జెట్ లో నిధులను కేటాయించాలని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ కు రాసిన లేఖల్లో మంత్రి కేటీఆర్ కొరకు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పారిశ్రామిక రంగంలో అభివృద్ధి పథంలో తెలంగాణ ముందు వరుసలో ఉన్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. వినూత్నమైన విధానాలతో ముందు వరుసలో నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం సహాయం అందించాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో నేషనల్ డిజైన్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని గతంలో అనేకసార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. నిర్మల సీతారామన్ తో జరిగిన చర్చల సందర్భంగా ఆమె సూచన మేరకు నూతన నేషనల్ డిజైన్ సెంటర్ క్యాంపస్ ని ఏర్పాటు చేయడం లేదన్నారు.
ఇప్పటికే హైదరాబాదులో ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో నేషనల్ డిజైన్ సెంటర్ కార్యకలాపాలు కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి అవసరమైన పరికరాలు, ఇతర మౌలిక వసతుల కల్పనకు సంబంధించి కేంద్రం ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు. నేషనల్ డిజైన్ సెంటర్ కి సంబంధించి 8 సంవత్సరాల పాటు కేంద్రం నుంచి నిర్వహణ ఖర్చు కోరుతున్నామని, ఇందులో 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు నేషనల్ డిజైన్ సెంటర్ కు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కేటీఆర్ కోరారు