Minister KTR: ఖిలావరంగల్ లో కేటీఆర్.. ఐడీఓసీ నిర్మాణానికి శంకుస్థాపన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR: వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. గీసుకొండ మండలం శాయంపేటలో గల కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో యంగ్గోన్ కంపెనీ ఎవర్ టాప్ టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న వస్త్ర పరిశ్రమల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. భూమిపూజ అనంతరం పార్కులో టెక్స్ టైల్ పరిశ్రమలు నిర్మిస్తున్న ఇతర ప్రతినిధులతో కంపెనీ ప్రతినిధులు మాట్లాడారు. కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కలెక్టర్ పాల్గొన్నారు. కాగా, అంతకుముందు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో టెక్స్టైల్ పార్కుకు చేరుకున్న మంత్రి కేటీఆర్కు మంత్రి ఎర్రబెల్లి, యంగ్గోన్ కంపెనీ ప్రతినిధులు స్వాగతం పలికారు. టెక్స్టైల్ పార్కులో యంగ్గోన్ కంపెనీకి టీఎస్ఐఐసీ ఇటీవల 298 ఎకరాలు కేటాయించింది.
Read also: Prabhas: పాన్ ఇండియా రూలర్!
Also Read
- Hyderabad: ప్రేమిస్తున్న యువకుడు మాట్లాడటం లేదని మనస్తాపం.. మైనర్ బాలిక ఆత్మహత్య.!
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
- CM Revanth Reddy : సీఎం రేవంత్ బిగ్ ప్లాన్.. స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి మేకోవర్.!
- Local Governance : గ్రామ పంచాయతీలకు బంపర్ పవర్.. సొంత ఆదాయంపై పూర్తి హక్కు.!
దక్షిణ కొరియాకు చెందిన యంగ్వన్ కంపెనీ తన టెక్స్టైల్ పరిశ్రమల్లో 11,700 మందికి ప్రత్యక్ష ఉపాధిని కల్పించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. పరోక్షంగా మరో 11,700 మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. టెక్స్టైల్ పార్కులో యంగ్గోన్ కంపెనీ రూ.840 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. అనంతరం మంత్రి కేటీఆర్ ఖిలావరంగల్ వెళ్లనున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అజంజాహీ మిల్స్ గ్రౌండ్లో ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ (ఐడీఓసీ) నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. దేశాయిపేటలో రూ.12.60 కోట్లతో ప్రభుత్వం నిర్మించిన 200 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను, వరంగల్లో రూ.135 కోట్లతో చేపట్టిన 16 స్మార్ట్ రోడ్లను కేటీఆర్ ప్రారంభించనున్నారు. రూ.75 కోట్లతో వరంగల్ మోడల్ బస్ స్టేషన్, రూ.313 కోట్లతో ఇన్నర్ రింగ్ రోడ్డు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఆజంజాహి మిల్స్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తారు.
PM Modi America Visit: అమెరికాలో ప్రధాని మోడీ పేరుతో కారు నంబర్ ప్లేట్
తాజావార్తలు
-
Delhi Police Commissioner: ఢిల్లీకి కొత్త పోలీస్ బాస్.. ఎవరు ఈ అనురాగ్ కుమార్..?
-
Hydrogen Fuel Cell Train: తొలి “హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్” రైలు షురూ.. రూ.14,700 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం..!
-
TamannaahBhatia : బోల్డ్ హారర్ థ్రిల్లర్లో తమన్నా భాటియా.. రసహృదయాలు కాస్త జాగ్రత్త
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Lenovo Legion R9000P: ప్రపంచంలోనే తొలి IJP OLED డిస్ప్లేతో.. లెనోవో Legion R9000P రిలీజ్
ట్రెండింగ్
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!