Minister KTR: పేపర్ లీకేజీ, ధరల పెరుగుదలపై మంత్రి కేటీఆర్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR: రాష్ట్రంలో సంచలనంగా మారిన బండి అరెస్టుపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. బండి అరెస్ట్ పై ఓ వ్యక్తి చేసిన ట్వీట్ ను మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు. పేపర్ లీక్ కుంభకోణాల వెనుక బీజేపీ నేతల హస్తం ఉందనడానికి ఆ ట్వీట్ మరో నిదర్శనం అంటూ ట్వీట్ చేశారు. పేపర్ లీక్ చేసిన నిందితుడు, బీజేపీ నేతలతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను షేర్ చేశారు. ఇక వాట్సాప్ గ్రూపుల్లో పేపర్ వైరల్ చేసిన నిందితుడు బండి సన్నిహితుడు అంటూ అందులో తెలిపారు. 10వ తరగతి ప్రశ్నపత్రం లీక్ కుట్రకు సూత్రధారిగా తేలిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చోని చేతిలో రాయి ఉంటే వచ్చి వెళ్లే వారికే ప్రమాదమని మంత్రి హెచ్చరించారు. బీజేపీ నేతలు తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రశ్నపత్రాలను లీక్ చేస్తూ అమాయక విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్వీట్ సంచలనంగా మారింది.
పిచ్చోని చేతిలో రాయి ఉంటే..
వచ్చి పోయేటోళ్ళకే ప్రమాదం…!!Also Read
- AICC Disciplinary Action: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు.? నేడు ఏఐసీసీ కీలక నిర్ణయం
- Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
- OTR: వరంగల్ కాంగ్రెస్లో అసలేం జరుగుతోంది? కొండా వర్సెస్ కాంగ్రెస్ నేతలు..
- రాష్ట్రమంతా సమస్య ఉంటే.. అది విధానపరమైన తప్పిదమే: హరీష్ రావు
కానీ
అదే పిచ్చోని చేతిలో ఒక పార్టీ ఉంటే
ప్రజాస్వామ్యానికే ప్రమాదం…!!!తమ స్వార్థ రాజకీయాల కోసం
ప్రశ్నా పత్రాలు లీకు చేసి అమాయకులైన విద్యార్ధుల, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న బీజేపి నాయకులు #BJPleaks https://t.co/8GFI6ups6v— KTR (@KTRBRS) April 5, 2023
Read also: Identify Fake Land Registry: మీ భూమి రిజస్ట్రేషన్ నిజమైనదా లేదా నకిలీదా ?
ఇది ఇలా ఉండగా.. మంత్రి కేటీఆర్ మరో ట్వీట్ చేశారు. గత కొంతకాలంగా విపరీతమైన ధరల పెరుగుదలతో సామాన్యుల జీవనం అతలాకుతలమైంది. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ సహా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సాల్ట్ పీరం..పప్పు పీరం..పెట్రోల్ పీరం..డీజిల్ పీరం..గ్యాస్ పీరం..దోశ పీరం..ఆల్ పీరం..పిరం..జనం అంతా గరం..గరం’ అంటూ ట్వీట్ చేశాడు. అందుకే మోడీ డియర్ ప్రధాని అని మంత్రి సెటైర్లు వేశారు. ఇంధన ధరలు విపరీతంగా పెరగడానికి కారణమైన అదనపు ఎక్సైజ్ సుంకం, సెస్సులను ఎత్తివేయాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. మరి నిత్యావసర వస్తువుల ధరలు ఎలా పెరిగాయి? వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తా కథనాలకు సంబంధించిన క్లిప్పింగ్లను వారు తమతో సామాన్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పంచుకున్నారు.
ఉప్పు పిరం.. పప్పు పిరం..
పెట్రోల్ పిరం.. డీజిల్ పిరం
గ్యాస్ పిరం..
గ్యాస్ పై వేసిన దోశ పిరంఅన్నీ పిరం.. పిరం…
జనమంతా గరం… గరం…అందుకే అంటున్న
ప్రియమైన ప్రధాని… మోదీ కాదు..
“పిరమైన ప్రధాని.. మోదీ.."
Modi Ji, we demand scrapping of Additional Excise Duties and… pic.twitter.com/BAzDtlDHPf
— KTR (@KTRBRS) April 5, 2023
తాజావార్తలు
-
September Releases: తెలుగు సినిమాలకు డబ్బింగ్ మూవీస్ గట్టి పోటీ.. సెప్టెంబర్లో బాక్సాఫీస్ బిగ్ ఫైట్!
-
AICC Disciplinary Action: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు.? నేడు ఏఐసీసీ కీలక నిర్ణయం
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
T-Shirt Hacks: మీ పాత టీ-షర్ట్లను పడేస్తున్నారా? ఒక్కసారి ఈ ట్రిక్ చూడండి.. 4 వస్తువులు ఫ్రీగా తయారు చేసుకోవచ్చు!
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!