Minister KTR: పేపర్ లీకేజీ, ధరల పెరుగుదలపై మంత్రి కేటీఆర్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR: రాష్ట్రంలో సంచలనంగా మారిన బండి అరెస్టుపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. బండి అరెస్ట్ పై ఓ వ్యక్తి చేసిన ట్వీట్ ను మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు. పేపర్ లీక్ కుంభకోణాల వెనుక బీజేపీ నేతల హస్తం ఉందనడానికి ఆ ట్వీట్ మరో నిదర్శనం అంటూ ట్వీట్ చేశారు. పేపర్ లీక్ చేసిన నిందితుడు, బీజేపీ నేతలతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను షేర్ చేశారు. ఇక వాట్సాప్ గ్రూపుల్లో పేపర్ వైరల్ చేసిన నిందితుడు బండి సన్నిహితుడు అంటూ అందులో తెలిపారు. 10వ తరగతి ప్రశ్నపత్రం లీక్ కుట్రకు సూత్రధారిగా తేలిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చోని చేతిలో రాయి ఉంటే వచ్చి వెళ్లే వారికే ప్రమాదమని మంత్రి హెచ్చరించారు. బీజేపీ నేతలు తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రశ్నపత్రాలను లీక్ చేస్తూ అమాయక విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్వీట్ సంచలనంగా మారింది.
పిచ్చోని చేతిలో రాయి ఉంటే..
వచ్చి పోయేటోళ్ళకే ప్రమాదం…!!Also Read
- Congress vs BRS: బావ–బామ్మర్ది ఇద్దరూ గన్పార్క్కు రండి.. ఒకేసారి సమాధానం ఇస్తా.. జూపల్లి ఛాలెంజ్!
- Congress vs BRS: తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత.. హరీశ్ రావును అడ్డుకున్న పోలీసులు!
- Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
- Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 3 ఎకరాల లోపు రైతులకు 'రైతు భరోసా' నిధులు విడుదల!
కానీ
అదే పిచ్చోని చేతిలో ఒక పార్టీ ఉంటే
ప్రజాస్వామ్యానికే ప్రమాదం…!!!తమ స్వార్థ రాజకీయాల కోసం
ప్రశ్నా పత్రాలు లీకు చేసి అమాయకులైన విద్యార్ధుల, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న బీజేపి నాయకులు #BJPleaks https://t.co/8GFI6ups6v— KTR (@KTRBRS) April 5, 2023
Read also: Identify Fake Land Registry: మీ భూమి రిజస్ట్రేషన్ నిజమైనదా లేదా నకిలీదా ?
ఇది ఇలా ఉండగా.. మంత్రి కేటీఆర్ మరో ట్వీట్ చేశారు. గత కొంతకాలంగా విపరీతమైన ధరల పెరుగుదలతో సామాన్యుల జీవనం అతలాకుతలమైంది. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ సహా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సాల్ట్ పీరం..పప్పు పీరం..పెట్రోల్ పీరం..డీజిల్ పీరం..గ్యాస్ పీరం..దోశ పీరం..ఆల్ పీరం..పిరం..జనం అంతా గరం..గరం’ అంటూ ట్వీట్ చేశాడు. అందుకే మోడీ డియర్ ప్రధాని అని మంత్రి సెటైర్లు వేశారు. ఇంధన ధరలు విపరీతంగా పెరగడానికి కారణమైన అదనపు ఎక్సైజ్ సుంకం, సెస్సులను ఎత్తివేయాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. మరి నిత్యావసర వస్తువుల ధరలు ఎలా పెరిగాయి? వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తా కథనాలకు సంబంధించిన క్లిప్పింగ్లను వారు తమతో సామాన్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పంచుకున్నారు.
ఉప్పు పిరం.. పప్పు పిరం..
పెట్రోల్ పిరం.. డీజిల్ పిరం
గ్యాస్ పిరం..
గ్యాస్ పై వేసిన దోశ పిరంఅన్నీ పిరం.. పిరం…
జనమంతా గరం… గరం…అందుకే అంటున్న
ప్రియమైన ప్రధాని… మోదీ కాదు..
“పిరమైన ప్రధాని.. మోదీ.."
Modi Ji, we demand scrapping of Additional Excise Duties and… pic.twitter.com/BAzDtlDHPf
— KTR (@KTRBRS) April 5, 2023
తాజావార్తలు
-
IBPS PO Recruitment 2026: బ్యాంకింగ్ కెరీర్కు గోల్డెన్ ఛాన్స్.. వేల సంఖ్యలో PO పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్..
-
Congress vs BRS: బావ–బామ్మర్ది ఇద్దరూ గన్పార్క్కు రండి.. ఒకేసారి సమాధానం ఇస్తా.. జూపల్లి ఛాలెంజ్!
-
Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన బేబీ బాస్.. అరంగేట్రం వాయిదాపై గవాస్కర్ సీరియస్ వార్నింగ్..
-
Celebrity Wedding: 78 ఏళ్ల వయసులో మళ్లీ వరుడైన స్టార్ నటుడు.. భార్యతో మరోసారి పెళ్లి!
-
Stock Market: 27 నిమిషాల్లోనే రూ.2.82 లక్షల కోట్లు లాభం! స్టాక్ మార్కెట్లో ఈ రోజు ఇన్వెస్టర్లకు పండగే!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?