Minister KTR: పేపర్ లీకేజీ, ధరల పెరుగుదలపై మంత్రి కేటీఆర్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR: రాష్ట్రంలో సంచలనంగా మారిన బండి అరెస్టుపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. బండి అరెస్ట్ పై ఓ వ్యక్తి చేసిన ట్వీట్ ను మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు. పేపర్ లీక్ కుంభకోణాల వెనుక బీజేపీ నేతల హస్తం ఉందనడానికి ఆ ట్వీట్ మరో నిదర్శనం అంటూ ట్వీట్ చేశారు. పేపర్ లీక్ చేసిన నిందితుడు, బీజేపీ నేతలతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను షేర్ చేశారు. ఇక వాట్సాప్ గ్రూపుల్లో పేపర్ వైరల్ చేసిన నిందితుడు బండి సన్నిహితుడు అంటూ అందులో తెలిపారు. 10వ తరగతి ప్రశ్నపత్రం లీక్ కుట్రకు సూత్రధారిగా తేలిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చోని చేతిలో రాయి ఉంటే వచ్చి వెళ్లే వారికే ప్రమాదమని మంత్రి హెచ్చరించారు. బీజేపీ నేతలు తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రశ్నపత్రాలను లీక్ చేస్తూ అమాయక విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్వీట్ సంచలనంగా మారింది.
పిచ్చోని చేతిలో రాయి ఉంటే..
వచ్చి పోయేటోళ్ళకే ప్రమాదం…!!Also Read
కానీ
అదే పిచ్చోని చేతిలో ఒక పార్టీ ఉంటే
ప్రజాస్వామ్యానికే ప్రమాదం…!!!తమ స్వార్థ రాజకీయాల కోసం
ప్రశ్నా పత్రాలు లీకు చేసి అమాయకులైన విద్యార్ధుల, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న బీజేపి నాయకులు #BJPleaks https://t.co/8GFI6ups6v— KTR (@KTRBRS) April 5, 2023
Read also: Identify Fake Land Registry: మీ భూమి రిజస్ట్రేషన్ నిజమైనదా లేదా నకిలీదా ?
ఇది ఇలా ఉండగా.. మంత్రి కేటీఆర్ మరో ట్వీట్ చేశారు. గత కొంతకాలంగా విపరీతమైన ధరల పెరుగుదలతో సామాన్యుల జీవనం అతలాకుతలమైంది. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ సహా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సాల్ట్ పీరం..పప్పు పీరం..పెట్రోల్ పీరం..డీజిల్ పీరం..గ్యాస్ పీరం..దోశ పీరం..ఆల్ పీరం..పిరం..జనం అంతా గరం..గరం’ అంటూ ట్వీట్ చేశాడు. అందుకే మోడీ డియర్ ప్రధాని అని మంత్రి సెటైర్లు వేశారు. ఇంధన ధరలు విపరీతంగా పెరగడానికి కారణమైన అదనపు ఎక్సైజ్ సుంకం, సెస్సులను ఎత్తివేయాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. మరి నిత్యావసర వస్తువుల ధరలు ఎలా పెరిగాయి? వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తా కథనాలకు సంబంధించిన క్లిప్పింగ్లను వారు తమతో సామాన్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పంచుకున్నారు.
ఉప్పు పిరం.. పప్పు పిరం..
పెట్రోల్ పిరం.. డీజిల్ పిరం
గ్యాస్ పిరం..
గ్యాస్ పై వేసిన దోశ పిరంఅన్నీ పిరం.. పిరం…
జనమంతా గరం… గరం…అందుకే అంటున్న
ప్రియమైన ప్రధాని… మోదీ కాదు..
“పిరమైన ప్రధాని.. మోదీ.."
Modi Ji, we demand scrapping of Additional Excise Duties and… pic.twitter.com/BAzDtlDHPf
— KTR (@KTRBRS) April 5, 2023
తాజావార్తలు
-
Hyderabad: నెంబర్ ప్లేట్ లేని కారుతో ఢీ.. నగరంలో న్యాయవాది దారుణ హత్య!
-
Pakistan Cuts Petrol and Diesel Prices: పాక్లో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. వరుసగా రెండోసారి ఊరట
-
Trump: భారత్ దెబ్బకు భయపడి అమెరికా కాళ్లబేరానికి పాక్.. ఆపరేషన్ సిందూర్ సీజ్ఫైర్పై ట్రంప్ సంచలన ప్రకటన..
-
Kohli vs Head: సైగలతో రెచ్చగొట్టిన విరాట్.. కోహ్లీ-ట్రావిస్ హెడ్ మధ్య అసలేం జరిగింది?.. క్లారిటీ ఇదిగో!
-
Swayambhu: ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత భారీ గ్రాఫిక్స్తో వస్తున్న నిఖిల్ మూవీ
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!