Identify Fake Land Registry: మీ భూమి రిజస్ట్రేషన్ నిజమైనదా లేదా నకిలీదా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Identify Fake Land Registry: ప్రస్తుతం భూమి బంగారం కంటే విలువగా మారిపోయింది. ఈ క్రమంలో దేశంలో భూరిజిస్ట్రేషన్ కి సంబంధించిన స్కామ్లు, అక్రమాలు ఎక్కవ అయిపోయాయి. చాలాసార్లు కొందరు ప్రభుత్వ భూమికి, అమ్మిన భూమికి డబుల్ రిజిస్ట్రేషన్ చేసి ప్రజలను మోసం చేస్తున్నారు. అటువంటి మోసాలను నివారించడానికి ప్రతి వ్యక్తి నిజమైన, నకిలీ రిజిస్ట్రేషన్ల గురింది తెలుసుకోవడం అవసరం. వాస్తవానికి, ఆస్తిని కొనుగోలు చేసిన తర్వాత దాని యాజమాన్యాన్ని విక్రేత నుండి కొనుగోలుదారుకు రిజిస్ట్రేషన్ చేస్తుంటారు.
భారతదేశంలో రిజిస్ట్రేషన్ అనేది చట్టపరమైన ప్రక్రియ. దీని ఆధారంగా భూమిని కొనుగోలు చేసి విక్రయిస్తున్నారు. అయితే ఈ సమయంలో కొందరు వ్యక్తులు భూమి కొనుగోలుదారుకు అవగాహన లేమిని ఉపయోగించుకుని మోసాలకు పాల్పడుతున్నారు. భూమి రిజిస్ట్రీకి సంబంధించిన మోసాలు పలు రకాలుగా ఉంటాయి. ఒక అంచనా ప్రకారం, దేశంలో ప్రతి ఏడాది 40 శాతం నకిలీ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్లు అంచనా. సాధారణంగా ప్రజలు భూమి రిజిస్ట్రీ, ఖతౌని పత్రాలను మాత్రమే చూస్తారు. కానీ, ఇది సరిపోదు ఎందుకంటే ఈ పత్రాలను చూడటం ద్వారా విక్రేతకు భూమిపై హక్కు ఉందా లేదా అని నిర్ధారించలేము.
Also Read
- Petrol-Diesel Prices: పెట్రోల్-డీజిల్ ధరల పెంపునకు రంగం సిద్ధం.. ఈ సాయంత్రం షాకిచ్చే అవకాశం!
- Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
- 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
- Dowry Harassment: పెళ్లై రెండు నెలలు తిరగకముందే.. వరకట్న వేధింపులకు నవ వధువు బలి!
Read Also: Mumbai Airport Closed: మూతపడనున్న ముంబై ఎయిర్ పోర్టు
ల్యాండ్ రిజిస్ట్రీలో మోసానికి సంబంధించిన కేసులను నివారించడానికి, ముందుగా భూమి సంబంధించిన కొత్త, పాత రిజిస్ట్రేషన్ పత్రాలను చూడాలి. మీకు భూమిని అమ్ముతున్న వ్యక్తి వేరొకరి నుండి భూమిని కొనుగోలు చేసి ఉంటే, ఆ భూమికి సంబంధించిన ఖతౌనిని తనిఖీ చేయాలి. ఖతౌనిలోని పత్రాలు అర్థం కాకపోతే న్యాయ నిపుణుడి సలహాను తీసుకోవాలి.
Read Also: Child Drives Car Video: ఈ బుడ్డోడు మామూలోడు కాడు.. మూడేళ్లకే కార్లో రయ్.. రయ్
అలాగే, కన్సాలిడేషన్ 41, 45 రికార్డులను చెక్ చేయాలి. అప్పుడు ఈ భూమి ఏ వర్గానికి చెందినదో తెలుస్తుంది. 41, 45 రికార్డుల్లో ప్రభుత్వ భూమో లేక, అటవీ శాఖకో లేదా రైల్వేకి చెందినదా అనేది స్పష్టం అవుతుంది. కొన్నిసార్లు వీలునామా లేదా డబుల్ రిజిస్ట్రీ కేసు కోర్టులో పెండింగ్లో ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడు భూమి కొన్నా దానిపై పెండింగ్ కేసు లేకుండా చూసుకోండి. ఇది తహసీల్ నుండి భూమి డేటా నంబర్, భూమి యజమాని పేరు నుండి తెలుసుకోవచ్చు. అంతే కాకుండా తనఖా పెట్టిన భూమి అంటే ఏ రకమైన రుణం ఉందో పరిశీలించి నిర్ధారించుకోవాలి. ఆ సమయంలో మీకు భూమి అమ్మే వ్యక్తికి దానిపై హక్కు ఉందో లేదో తనిఖీ చేసుకోవాలి.
తాజావార్తలు
-
Internet Crisis: ఇంటర్నెట్కు హోర్ముజ్ సెగలు.. భారత్కు ముప్పు తప్పదా?
-
Yogibabu : సత్య – యోగి బాబు నవ్వుల బాంబ్..’రంగబలి’ డైరెక్టర్ క్రేజీ ప్రాజెక్ట్ షురూ!
-
Petrol-Diesel Prices: పెట్రోల్-డీజిల్ ధరల పెంపునకు రంగం సిద్ధం.. ఈ సాయంత్రం షాకిచ్చే అవకాశం!
-
Nara Rohit: కొత్త సినిమా మొదలెట్టిన నారా రోహిత్
-
Trump China Visit: డ్రాగన్ గడ్డపై అడుగు పెట్టబోతున్న ట్రంప్ .. బీజింగ్ వేదికగా ఏం జరగబోతుంది?
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?