Minister KTR: గంగుల మీద పోటీ అంటే.. పోచమ్మ గుడి ముందు పొట్టేలు కట్టేసినట్టే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR: కమలాకర్ అన్నపై పోటీ చేసేందుకు అందరూ జంకుతున్నారని మంత్రి అన్నారు. కాంగ్రెస్ వాళ్లు హుస్నాబాద్ పారిపోయారు.. బీజేపీ వాళ్ళు పోటీకి వెన్క ముందాడుతున్నారంటూ మంత్రి తెలిపారు. గంగుల మీద పోటీ అంటే పోచమ్మ గుడి ముందు పొట్టేలు కట్టేసినట్టే అంటూ కేటీఆర్ అన్నారు. కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ మంత్రి మంత్రి మాట్లాడుతూ.. మరోసారి తెలంగాణలో కేసీఆర్ కి అవకాశం ఇవ్వాలని కోరారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈ పదేళ్ళలో ఎన్ని మార్పులు వచ్చాయన్నారు. మానేరు నీళ్లకోసం జరిగిన కొట్లాటలు ఇంక కళ్లముందే ఉన్నాయని తెలిపారు. నేడు ఆ పరిస్థితి మారింది..కాళేశ్వరంతో కరీంనగర్ జిల్లా అంత సజీవ జలధారగా మారిందన్నారు. అభివృద్ధికి తోడు సంక్షేమం దీటుగా సాగుతుందని తెలిపారు. కమలాకర్ నాయకత్వంలో బీసీ సంక్షేమం అద్భుతమైన ప్రగతి సాధించామన్నారు. చదువుకునేందుకు గురుకులాలు, విదేశాలకు పోయేవాళ్ళకి కూడా అండగా ఉన్నామన్నారు. హిందూ ముస్లింల మధ్య కొట్లాటలు పెట్టె సన్నాసులు కరీంనగర్ లో ఉన్నారని తెలిపారు. కమలాకర్ చేతిలో చావు దెబ్బ తిని దొంగ ఏడ్పుతో ఎంపీ అయ్యాడంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీ అయ్యాక కరీంనగర్ కి ఏం చేశారు? ఓ బడి తేలేదు… కనీసం గుడి అయినా తేలేదు.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మోడీ దేవుడన్న అంటున్న బండి సంజయ్ చెప్పాలి గ్యాస్ ధర ఎంత పెరిగిందో? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ అందరి నాయకుడు.. హిందూ ముస్లిం అందరికి నేత అన్నారు. కేసీఆర్ గొప్ప హిందువు… యాగాలు యజ్ఞాలు చేశారని, నిజమైన హిందువు ఎవర్ని తిట్టడని అన్నారు. ఇక్కడ ఎంపీ మసీదులు తవ్వుదాం అంటాడు… బొందల గడ్డలు తవ్వడానికా ఎంపీ అయింది సంజయ్ అంటూ మండిపడ్డారు. పునాదులు తవ్వండి.. అభివృద్ధి కోసం పునాదులు వేయండని అన్నారు. చావు నోట్లో తలపెట్టిన కేసీఆర్ ఒకవైపు… తెలంగాణ కోసం రాజీనామా చేయకుండా పారిపోయిన బీజేపీ కిషన్ రెడ్డి, ఓటుకు నోటు దొంగ థర్డ్ క్లాస్ క్రిమినల్ రేవంత్ రెడ్డి ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ బీమా పథకం తెస్తున్నాం.. అధికారం ఇవ్వండి.. ఆర్నెళ్లలో అమలు చేస్తామన్నారు. కమలాకర్, కేసీఆర్ కి చెప్పినట్టు… రాష్ట్రంలో సన్నబియ్యం పథకం అమలు చేయబోతున్నామన్నారు. 15 లక్షల పరిమితితో కేసీఆర్ ఆరోగ్య రక్ష ఇస్తామన్నారు. ప్రవళిక అనే అమ్మాయి చనిపోతే కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వారి కుటుంభం నా దగ్గరకు వచ్చారు.. వారి అమ్మాయిని వేధించారని చెప్పారని తెలిపారు. వారికి న్యాయం చేస్తాం.. ఆ అమ్మాయి తమ్మునికి ఉద్యోగం ఇస్తామని చెప్పామని మంత్రి క్లారిటీ ఇచ్చారు. రాహుల్ వస్తాడు.. ప్రియాంక వస్తుంది.. మోసపోకండి… కార్ గుర్తుకు ఓటేసి కేసీఆర్ ని దీవించండి అని మంత్రి కేటీఆర్ అన్నారు.
Telangana Police: ప్రవళిక ఆత్మహత్య..13 మంది రాజకీయ నాయకులపై కేసులు
Also Read
- Khaja Moizuddin Mur*der: హైకోర్టు న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు.!
- OTR : హైదరాబాద్ FSL లో అగ్నిప్రమాదం.. మేడిగడ్డ ఫైళ్లు తగలబడటం వెనుక రహస్యం ఏంటి?
- Cabinet Sub Committee : రేపు కేబినెట్ సబ్ కమిటీ అత్యవసర భేటీ!
- Off The Record : డెలివరీ సూపర్.. ప్రచారం వీక్! కాంగ్రెస్ మార్క్ పాలన ప్రజల్లోకి వెళ్లడం లేదా?
తాజావార్తలు
-
AMAs 2026: అమెరికన్ మ్యూజిక్ అవార్డ్స్లో దుమ్మురేపిన BTS.. మూడు అవార్డులతో సెన్సేషన్..!
-
Peddi : రెంట్ vs పర్సెంటేజ్ వివాదం.. తెలంగాణలో రెంటల్ బేస్ మీదే పెద్ది రిలీజ్..
-
IPL 2026 Playoffs: 22 రోజులు టాప్లో ఉన్నా నో యూస్.. ఒక్కరోజే టేబుల్ టాపర్గా ఉండి ప్లేఆఫ్స్కు అర్హత!
-
Ranveer Singh: ‘ధురంధర్’ సక్సెస్ తర్వాత రణ్వీర్కు బిగ్ షాక్.. బాలీవుడ్ స్టార్ హీరోను “బ్యాన్” చేయడం సాధ్యమేనా?
-
Preity Mukhundhan: “హీరోయిన్లను గ్లామర్కే వాడుకుంటున్నారు”.. ప్రీతి ముకుందన్ బోల్డ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!