Jagadish Reddy: బీజేపీ నుండి దేశాన్ని రక్షిస్తాం.. కవిత ఈడీ విచారణపై మంత్రి ధ్వజం
Minister Jagadish Reddy Fires On BJP Over Kavitha ED Investigation: ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణపై తాజాగా మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. విచారణ సంస్థల పేరుతో బీజేపీ రాజకీయ కక్ష సాధింపులు చేస్తోందని ఆరోపించారు. రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తూ.. రాజకీయ ప్రత్యర్థులని వేధిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ వచ్చిన తర్వాత ఇలాంటి దుర్మార్గాలు ఎక్కువైయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా.. విచారణ పేరుతో ఎమ్మెల్సీ కవితను వేధిస్తున్నారని అన్నారు. మహిళల విచారణ పట్ల నిబంధనలు పాటించడం లేదని ఫైర్ అయ్యారు. తాను ఎక్కడికి పారిపోవడం లేదని, విచారణకు సహకరిస్తానని కవిత చెప్పినా కూడా.. రాత్రి వరకు విచారించడం వేధింపులేనని పేర్కొన్నారు. మహిళల హక్కులను గౌరవించాలని, చట్ట పరిధికి లోబడి విచారించాలని సూచించారు. చట్టంలో లోసగులను అడ్డంపెట్టుకుని.. వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. బీజేపీ పార్టీ నాయకుల కనుసన్నల్లోనే ఈడీ పని చేస్తోందని చెప్పారు. బీజేపీ నాయకులు ముందే చెప్పినట్లుగా.. విచారణ సంస్థలు పని చేస్తున్నాయన్నారు. బీజేపీ దుర్మార్గాలను ప్రజల్లో ఎండగడతామని.. దేశాన్ని బీజేపీ నుండి రక్షిస్తామని మంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడించారు.
Srinidhi Shetty: ‘కెజిఎఫ్’ సెట్ లో యష్ నన్ను వేధించాడు.. పచ్చి అబద్దం
Also Read
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
- Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
ఇదిలావుండగా.. ఎమ్మెల్సీ కవిత రేపు మరోసారి సుప్రీంకోర్టు తలుపు తట్టనున్నారు. రేపే తమ పిటీషన్పై అత్యవసర విచారణ జరపాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కవిత తరఫు న్యాయవాదులు కోరనున్నారు. 20వ తేదీన సోమవారం విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్ర చూడ్ ధర్మాసనం ముందు.. అత్యవసర విచారణకు ప్రస్తావనకు చేయనున్నారు. విచారణ సందర్భంగా ఈడీ చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని, తనకు ఈడి ఇచ్చిన నోటీసులు రద్దు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కవిత పిటిషన్ వేశారు.
Swapna Lok Fire Accident: సికింద్రాబాద్లోని స్వప్నలోక్ కాంప్లెక్స్లో భారీ అగ్నిప్రమాదం
తాజావార్తలు
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!