Jagadish Reddy: బీజేపీ నుండి దేశాన్ని రక్షిస్తాం.. కవిత ఈడీ విచారణపై మంత్రి ధ్వజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Jagadish Reddy Fires On BJP Over Kavitha ED Investigation: ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణపై తాజాగా మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. విచారణ సంస్థల పేరుతో బీజేపీ రాజకీయ కక్ష సాధింపులు చేస్తోందని ఆరోపించారు. రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తూ.. రాజకీయ ప్రత్యర్థులని వేధిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ వచ్చిన తర్వాత ఇలాంటి దుర్మార్గాలు ఎక్కువైయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా.. విచారణ పేరుతో ఎమ్మెల్సీ కవితను వేధిస్తున్నారని అన్నారు. మహిళల విచారణ పట్ల నిబంధనలు పాటించడం లేదని ఫైర్ అయ్యారు. తాను ఎక్కడికి పారిపోవడం లేదని, విచారణకు సహకరిస్తానని కవిత చెప్పినా కూడా.. రాత్రి వరకు విచారించడం వేధింపులేనని పేర్కొన్నారు. మహిళల హక్కులను గౌరవించాలని, చట్ట పరిధికి లోబడి విచారించాలని సూచించారు. చట్టంలో లోసగులను అడ్డంపెట్టుకుని.. వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. బీజేపీ పార్టీ నాయకుల కనుసన్నల్లోనే ఈడీ పని చేస్తోందని చెప్పారు. బీజేపీ నాయకులు ముందే చెప్పినట్లుగా.. విచారణ సంస్థలు పని చేస్తున్నాయన్నారు. బీజేపీ దుర్మార్గాలను ప్రజల్లో ఎండగడతామని.. దేశాన్ని బీజేపీ నుండి రక్షిస్తామని మంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడించారు.
Srinidhi Shetty: ‘కెజిఎఫ్’ సెట్ లో యష్ నన్ను వేధించాడు.. పచ్చి అబద్దం
Also Read
- Hyderabad: పంజాగుట్ట శ్మశానవాటికలో షాకింగ్ ఘటన.. పూడ్చిపెట్టిన పసికందు మృతదేహం మాయం
- Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- OTR : తెలంగాణ MLC ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్త లెక్కలు..! రెండు సీట్లు రెడ్లకేనా..?
ఇదిలావుండగా.. ఎమ్మెల్సీ కవిత రేపు మరోసారి సుప్రీంకోర్టు తలుపు తట్టనున్నారు. రేపే తమ పిటీషన్పై అత్యవసర విచారణ జరపాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కవిత తరఫు న్యాయవాదులు కోరనున్నారు. 20వ తేదీన సోమవారం విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్ర చూడ్ ధర్మాసనం ముందు.. అత్యవసర విచారణకు ప్రస్తావనకు చేయనున్నారు. విచారణ సందర్భంగా ఈడీ చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని, తనకు ఈడి ఇచ్చిన నోటీసులు రద్దు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కవిత పిటిషన్ వేశారు.
Swapna Lok Fire Accident: సికింద్రాబాద్లోని స్వప్నలోక్ కాంప్లెక్స్లో భారీ అగ్నిప్రమాదం
తాజావార్తలు
-
Christopher Nolan : ఫ్రాంచైజీ లేదు.. సూపర్హీరో లేడు.. కానీ బిలియన్ డాలర్లు వసూలు చేసింది
-
Sunil Gavaskar: ఆ రోజుల్లోనే సునీల్ గవాస్కర్ పెను సాహసం.. విషయం తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు!
-
Explainer: ఉద్యోగాల కోసం ఎదురుచూపులు.. ఆగిపోతున్న గుండెలు.. ఇంకెన్నాళ్లీ బాధలు?
-
Gaja Teaser: మంచు మనోజ్ చేతుల మీదుగా ‘గజ’ టీజర్ రిలీజ్.. షాకుల మీద షాకులు ఇస్తున్న ట్విస్ట్లు !
-
Sourav Ganguly Death Threats: మిమ్మల్ని చంపేస్తాం.. సౌరవ్ గంగూలీ, సతీమణి డోనాకి బెదిరింపులు!
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!