Swapna Lok Fire Accident: సికింద్రాబాద్లోని స్వప్నలోక్ కాంప్లెక్స్లో భారీ అగ్నిప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire Accident In Secunderabad Swapna Lok Complex: సికింద్రాబాద్లోని స్వప్నలోక్ కాంప్లెక్స్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కాంప్లెక్స్లోని 7, 8వ అంతస్థుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. అక్కడ భయానక పరిస్థితులు నెలకొన్నాయి. దట్టంగా పొగలు వ్యాపించడంతో.. ఆ కాంప్లెక్స్లో ఉన్న కార్యాలయాల్లోనే ఉద్యోగులు చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. వెంటనే రంగంలోకి దిగి, మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. లోపలే చిక్కుకున్న జనాలు.. టార్చిలైట్ వెళుతురు చూపిస్తూ, తమని కాపాడమని ఆర్తనాదాలు చేస్తున్నారు. కాగా.. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు ధృవీకరించారు. అయితే.. పొగ కమ్మేయడంతో ఉక్కిరిబిక్కిరి పరిస్థితి ఏర్పడింది.
United Alliance Technology: ఉద్యోగాల పేరిట భారీ మోసం.. బోర్డు తిప్పేసిన కంపెనీ
Also Read
- OTR : తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా?
- Khaja Mohijuddin: వక్ఫ్ బోర్డు భూముల పోరాటమే ప్రాణం తీసిందా? సెకండ్ హ్యాండ్ ‘స్కార్పియో’తో లాయర్ను లేపేసిన కిల్లర్స్!
- Astro Scam : జ్యోతిష్యం పేరుతో జేబుకు జలక్.. కొత్త సైబర్ స్కామ్ అలర్ట్.!
- OTR : సడన్ గా ఆగిపోయిన గాంధీభవన్ ముఖాముఖి.. కాంగ్రెస్లో మంత్రులపై అధిష్టానం సీరియస్?
మరోవైపు.. ఈ అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న తర్వాత మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఈవీడీఎం అడిషనల్ కమిషనర్ ప్రకాష్ రెడ్డిలతో మాట్లాడారు. అక్కడ జరుగుతున్న సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజల్ని క్షేమంగా ఈ ప్రమాదం నుంచి కాపాడాలని ఆదేశించారు. అలాగే.. చుట్టుపక్కల ఉన్న వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, వారికి సహాయ సహకారాలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో.. డిఆర్ఎఫ్ టీమ్లు, ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నాయని మేయర్కి ప్రకాశ్ రెడ్డి తెలియజేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా.. ఈ అగ్నిప్రమాదం స్వప్నలోక్ కాంప్లెక్స్ వద్దకు చేరుకొని, సహాయక చర్యలను పర్యవేక్షించారు. కాగా.. కాంప్లెక్స్లో మొత్తం 12 మంది చిక్కుకున్నట్టు సమాచారం.
Kunamneni Sambasiva Rao: బీజేపీతోనే దేశానికి ప్రమాదం.. బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కావాలి
మరోవైపు.. జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలోనూ భారీ అగ్నిప్రమాదం జరిగింది. కోపల్లే ఫార్మా ఇండస్ట్రీ వద్ద సాల్వెంట్ డ్రమ్ములు గాల్లోకి ఎగురుతూ పెద్ద శబ్దంతో పేలడంతో, పరిసరాల్లోని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. సమీపంలోని జనప్రియ, మోదీ అపార్ట్ మెంట్ వాసులు హడలిపోతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
RCB vs GT : గుజరాత్పై ఆర్సీబీ ‘రాయల్’ విక్టరీ.. ఏకంగా 92 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లోకి..!
-
OTR : తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా?
-
Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్బై చెప్పనున్న సిద్ధరామయ్య!
-
Khaja Mohijuddin: వక్ఫ్ బోర్డు భూముల పోరాటమే ప్రాణం తీసిందా? సెకండ్ హ్యాండ్ ‘స్కార్పియో’తో లాయర్ను లేపేసిన కిల్లర్స్!
-
Vizag Bhimili Murder: ప్రియుడి మోజులో పచ్చని సంసారంలో నిప్పులు.. భర్తను చున్నీతో చంపేసిన ఇల్లాలు!
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!