Indrakaran Reddy: రైతులు మంచిగా బతుకుతుంటే.. కాంగ్రెస్కు కడుపుమంటగా ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Indrakaran Reddy Fires On Congress Over Free Power Issue: తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మరోసారి కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో రైతులు మంచిగా బతుకుతుంటే.. కాంగ్రెస్కు కడుపుమంటగా ఉందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు 3 గంటలు కరెంట్ చాలని అంటోందని గుర్తు చేశారు. నిర్మల్లో ఆయన మాట్లాడుతూ.. కేసిఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. గతంలో లాగా కరెంట్ సమస్యలు గానీ, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల సమస్య గానీ లేదన్నారు. వ్యవసాయానికి సాగునీరు, నిరంతర నాణ్యమైన ఉచిత విద్యుత్, రైతు సంక్షేమ పథకాలతో రాష్ట్ర రైతన్నల మోహంలో నవ్వు కనబడుతోందన్నారు.
V Hanumantha Rao: పప్పు అన్నారు, ఇప్పుడదే రాహుల్ పప్పా అయ్యాడు.. వీహెచ్ ఘాటు వ్యాఖ్యలు
Also Read
- Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Devji : లాసెట్లో మెరిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ..
- OTR : మంత్రి శ్రీధర్బాబుతో ఎంపీ వంశీకి సెట్ అయిందా?
వ్యవసాయానికి 3 గంటల కరెంట్ చాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అసలు రైతు కష్టాలు రేవంత్కి ఏం తెలుసు? ఏనాడైనా అరకపట్టి దుక్కి దున్నిండా? అని ప్రశ్నించారు. ఆనాడు టీడీపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై బషీర్బాగ్ వద్ద రైతులు ఆందోళన చేస్తే.. చంద్రబాబు కాల్పులు జరిపి ముగ్గురిని పొట్టన పెట్టుకున్నాడని పేర్కొన్నారు. ఇవాళ ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి ఉచిత కరెంట్ వద్దంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఉచిత కరెంట్ ఎందుకన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను గ్రామ పొలిమేరల వరకు తరిమికొట్టాలని అన్నారు. కాంగ్రెస్ హయంలో కరెంట్ కష్టాలు, అప్పుల బాధలతో రైతన్న చితికిపోయాడని.. రైతన్నల ఆత్మహత్యలు కూడా చూశామని ఆరోపణలు చేశారు. ఇప్పుడు స్వరాష్ట్రంలో వ్యవసాయం లాభసాటిగా మారిందని.. రైతు ఆత్మహత్యలు లేవు, వలసలూ లేవని చెప్పారు. సాగునీరు, ఉచిత కరెంట్, రైతుబంధు లాంటి సంక్షేమ పథకాలతో అన్నదాతలు ఆర్థికవృద్ధి సాధించారన్నారు.
MP Margani Bharat: పవన్ కల్యాణ్ ఊసరవెల్లి.. ఢిల్లీలో యాక్టింగ్ చేస్తున్నాడు..
3 గంటల కరెంట్ ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ కావాలా? 3 పంటలకు సాగునీరు, కరెంట్ ఇస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలో రైతులు నిర్ణయించుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ సూచించారు. అనంతరం రాష్ట్ర సర్కారు వ్యవసాయానికి అందిస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగించాలని, ‘3 గంటలు వద్దు 3 పంటలు కావాలని’ కోరుతూ బీఆర్ఎస్ నాయకులు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆయన ఆమోదించారు. ఇదే సమయంలో.. రైతులకు వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ని తొలగించాలమని తీర్మాణం చేస్తామని కూడా చెప్పారు. రైతుల్ని ముంచే వ్యక్తుల్ని పెట్టుకుంటారా? రాహుల్, సోనియా గాంధీలకు కళ్లు లేవా? అంటూ ధ్వజమెత్తారు.
తాజావార్తలు
-
Lalit Modi: సచిన్, గంగూలీ, ద్రవిడ్లను నేను బ్రతిమాలుకున్నా.. లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు!
-
Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
-
2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
-
Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
-
JanaNayagan : విజయ్ ‘జననాయగన్’.. బయ్యర్లకు వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..