V Hanumantha Rao: పప్పు అన్నారు, ఇప్పుడదే రాహుల్ పప్పా అయ్యాడు.. వీహెచ్ ఘాటు వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
V Hanumantha Rao Interesting Comments In Congress OBC Public Meeting: ఇన్నాళ్లూ పప్పు అంటూ ఎవరినైతే అవహేళన చేశారో, ఇప్పుడదే రాహుల్ గాంధీ అందరికీ పప్పా అయ్యాడంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు వ్యాఖ్యానించారు. దేశంలో రాహుల్గాంధీ గ్రాఫ్ పెరిగిందని చెప్పారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ OBC నాయకుల సమావేశంలో వీహెచ్ మాట్లాడుతూ.. గట్టిగా కష్టపడితే కాంగ్రెస్ తప్పకుండా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్లో చిన్న చిన్న కోపాలు, గొడవలు ఉన్నాయన్న మాట వాస్తవమేనని అన్నారు. సీనియర్లు, జూనియర్ల మధ్య విభేదాలున్నాయని పేర్కొన్నారు. సీనియర్పై జూనియర్ పెత్తనం చెలాయిస్తానంటే ఊరికే ఉంటారా? తమ పార్టీలోని లొల్లి కూడా అలాంటిదేనని వివరణ ఇచ్చారు.
MP Margani Bharat: పవన్ కల్యాణ్ ఊసరవెల్లి.. ఢిల్లీలో యాక్టింగ్ చేస్తున్నాడు..
Also Read
- Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
కాంగ్రెస్ నేతలను కేసీఆర్ బంగాళాఖాతంలో వేస్తానని అంటున్నారని.. జనం నిన్నే బంగాళాఖాతంలో వేస్తారని వీహెచ్ పేర్కొన్నారు. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుంటే.. నాంపల్లి దర్గా దగ్గర ‘అల్లాకే బాబా దేదో’ అంటూ అడుక్కునేవాడివి అని ఎద్దేవా చేశారు. అన్నం పెట్టినోనికి కేసీఆర్ సున్నం పెడతాడని విమర్శించారు. ఈసారి రాహుల్ గాంధీ తప్పకుండా ప్రధాని అవుతాడని, లేకపోతే తన పేరు హనుమంతరావు కాదని ఛాలెంజ్ చేశారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోడీ.. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. అదానికి, మోడీకి సంబంధం ఏంటని ప్రశ్నిస్తే.. రాహుల్పై కక్ష సాధింపు చర్యలు తీసుకున్నారని మండిపడ్డారు. నేతలు కాంగ్రెస్లో ఉంటే అవినీతిపరులు, బీజేపీలో చేరితే సత్యహరిశ్చంద్రులా? అని నిలదీశారు. త్వరలోనే బీసీ గర్జన పెడతామని.. ఇందుకు థాక్రే, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఒప్పుకున్నారని తెలిపారు.
Uttarakhand: ఉత్తరాఖండ్లో పేలిన ట్రాన్స్ఫార్మర్.. 16 మంది మృతి
కేవలం అగ్ర కులాలకే కాదు, రిక్షా తొక్కేవాడికి కూడా టాలెంట్ ఉంటుందని వీహెచ్ చెప్పారు. అగ్రకులాల వాళ్ళు OBCలను అణగదొక్కుతున్నారని ఆరోపించారు. రాహుల్ తన జోడో యాత్రలో భాగంగా అన్ని వర్గాల వారిని కలిశారన్నారు. కొందరు లేస్తే బీసీలకు 50 శాతం రిజర్వేషన్ అంటున్నారని.. మొదట 20 శాతం తెచ్చుకొని, ఆ తర్వాత 50 శాతం గురించి ఆలోచిద్దాం హితవు పలికారు. ప్రతి పార్లమెంట్ పరిధిలో మూడు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని అడుగుతున్నామన్నారు. తానెవ్వరికీ వ్యతిరేకం కాదని, తమ హక్కుల కోసం తాము పోరాడుతున్నామని స్పష్టం చేశారు. ఫైనల్గా తాను సోనియాగాంధీ, రాహుల్ గాంధీ మాట మాత్రమే వింటానన్నారు. ఆప్ కీ బార్ కిసాన్ సర్కార్ అని చెప్పే కేసీఆర్, అదే రైతుల్ని జైల్లో వేయిస్తున్నాడని ఆరోపించారు.
తాజావార్తలు
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!