Harish Rao: మంత్రి హరీష్ రావు కీలక ప్రకటన.. పట్టణాల్లో 500 బస్తీ దవాఖానాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Harishrao: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త బస్తీ దవాఖానల ఏర్పాటుపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కీలక ప్రకటన చేశారు. జూన్ నాటికి పట్టణాల్లో 500 బస్తీ దవాఖానలు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి జిల్లాలో 350 బస్తీ దవాఖానలు, రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లో 150 బస్తీ దవాఖానలను తీసుకురానున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 363 బస్తీ దవాఖానలు సేవలు అందిస్తుండగా, మరో 57 బస్తీ దవాఖానలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఇవి త్వరలో అందుబాటులోకి రానున్నాయని, వెంటనే ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జూన్ నెలాఖరు నాటికి మరో 80 బస్తీ దవాఖానలను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. మే నెలాఖరు నాటికి 3,206 గ్రామీణ దవాఖానలను పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామాల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని హరీశ్ రావు స్పష్టం చేశారు. దవాఖానలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తెరిచి ఉంటాయని, డిస్పెన్సరీ సమయాలు, వైద్యుల ఫోన్ నంబర్లు, అందించే వైద్య సేవలు, పరీక్షల గురించి ప్రజలకు తెలియజేసేలా బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.
Read also: ప్రెగ్నెన్సీ సమయంలో ఇవి అస్సలు తినకూడదు
Also Read
గ్రామీణ దవాఖానల పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు. ఆదివారం కూడా బస్తీ దవాఖానలు తెరిచేలా ఏర్పాట్లు చేస్తున్నామని హరీశ్ రావు తెలిపారు. బస్తీ దవాఖానలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సీనియర్ డాక్టర్ తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని తెలిపారు. గ్రామీణ దవాఖానల్లో ఖాళీగా ఉన్న 321 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా అందరికీ కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్లద్దాలు ఇవ్వాలని సూచించారు. కంటి వెలుగు రెండో విడత కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 1.31 కోట్ల మందికి కంటి పరీక్షలు పూర్తి చేయగా 12 లక్షల మందికి అద్దాలు పంపిణీ చేశారు. హైదరాబాద్లో కంటి అద్దాల పంపిణీకి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. దవాఖానల ఏర్పాటు, కంటి వెలుగు కార్యక్రమంపై ఇటీవల వైద్యశాఖ అధికారులతో హరీశ్రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నిమ్స్ నూతన భవనం, వరంగల్ హెల్త్ సిటీ పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు.
TSPSC Paper Leak Case: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం.. అదుపులో మరో ఇద్దరు
తాజావార్తలు
-
Venezuela Earthquake: భూమ్మీద నూకలున్నయ్.. 8 రోజుల తర్వాత భూకంప శిథిలాల నుంచి ప్రాణాలతో బయటపడిన సెక్యూరిటీ గార్డు
-
December Clash : డిసెంబర్ లో బాలయ్య vs ప్రభాస్ టగ్ ఆఫ్ వార్..
-
Japan Releases : జపాన్ మార్కెట్ టార్గెట్ చేస్తోన్న భారతీయ చిత్రాలు
-
Motorola Edge 70 Max: మోటరోలా ఎడ్జ్ 70 సిరీస్ మ్యాక్స్ వచ్చేస్తోంది.. 200MP కెమెరా, Snapdragon 8 Gen 5 చిప్
-
Vaibhav Sooryavanshi Debut: వైభవ్ అరంగేట్రాన్ని టీమిండియా ఎందుకు అడ్డుకుంటోంది?.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!