TSPSC Paper Leak Case: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం.. అదుపులో మరో ఇద్దరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSPSC Paper Leak Case: టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సిట్ల అధికారులు మరో ఇద్దరిని అదుపులో తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రేణుక భర్త డాక్యా నాయక్ నుంచి ఏఈ పేపర్ కొనుగోలు చేసిన కేసులో మరో ఇద్దరిని సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. కోస్గి భగవంత్ కుమార్, కోస్గి రవికుమార్లను శుక్రవారం అరెస్టు చేశారు. భగవంత కుమార్ తన తమ్ముడు కోస్గి రవికుమార్ కోసం పేపర్ కొనుగోలు చేసినట్లు సిట్ పోలీసులు గుర్తించారు. దర్యాప్తు అధికారులు ఢాకా నాయక్ బ్యాంకు ఖాతాలపై ఆరా తీస్తున్నారు. అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో కోస్గి భగవంత్ కుమార్ విషయం బయటకు వచ్చింది. కోస్గి భగవంత్ కుమార్ వికారాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో పని చేస్తూ దొరికిపోయాడు. రెండు లక్షలకు ఢాకా నాయక్ నుంచి ఏఈ పేపర్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. వారిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
కాగా..టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో విచారణ దాదాపుగా ముగిసింది. మరికొందరు అనుమానితులను కూడా విచారిస్తున్నారు. నిందితులు ఇప్పటివరకు రూ.33.4 లక్షలు అందుకున్నట్లు సిట్ నిర్ధారించింది. కొందరు నేరుగా నగదు తీసుకుంటే, మరికొందరు తమ బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు అధికారులు గుర్తించారు. పేపర్ లీక్ కావడంతో ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్ కుమార్ కు రూ.16 లక్షలు లభించాయి. రేణుకా రాథోడ్ ప్రవీణ్ కుమార్ ద్వారా రూ.10 లక్షలకు ఏఈ పేపర్ తీసుకున్నారు. ఆ తర్వాత రేణుక భర్త డాక్యా, రాజేశ్వర్ మరో ఐదుగురికి విక్రయించారు. ఈ విక్రయం ద్వారా రాజేశ్వర్, దాఖ్యలకు రూ.27.4 లక్షలు లభించినట్లు సిట్ అధికారులు తేల్చారు. ఇందులో ప్రవీణ్ కుమార్ కు రూ.10 లక్షలు, రాజేశ్వర్, డాక్యాలకు రూ.17.4 లక్షలు మిగిలాయి. డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పేపర్ను ప్రవీణ్ కుమార్ ఖమ్మంకు చెందిన దంపతులకు రూ.6 లక్షలకు విక్రయించాడు. ప్రవీణ్ ఈ డబ్బును బ్యాంకులో దాచగా.. సిట్ అధికారులు ఆ డబ్బును స్తంభింపజేశారు. ఆ తర్వాత గ్రూప్-1 ప్రశ్నపత్రాన్ని ప్రవీణ్, రాజశేఖర్ ఉచితంగా ఇచ్చినట్లు విచారణలో తేలింది. ప్రశ్నపత్రాల ద్వారా వచ్చిన డబ్బుతో రాజేశ్వర్ ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు.
Minister KTR: జమ్మూ హెలికాప్టర్ ప్రమాదంలో సిరిసిల్ల వాసి మృతి.. కేటీఆర్ సంతాపం
Also Read
తాజావార్తలు
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
Varanasi: వారణాసిపై ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు బాబోయ్.. నెట్ఫ్లిక్స్ వీపీ మోనికా ఆసక్తికర వ్యాఖ్యలు!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Oscars Academy :’RRR’ ఎడిటర్కు ఆస్కార్ గౌరవం.. ఇక విజేతలను ఎంపిక చేసే హక్కు కూడా!
-
Amazon Zoox: స్టీరింగ్ లేదు.. డ్రైవర్ లేడు.. అమెజాన్ కొత్త రోబోట్యాక్సీ.. పెయిడ్ రైడ్స్కు రంగం సిద్ధం
ట్రెండింగ్
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!