Harish Rao: వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఏడాది పూర్తి.. అభివృద్ధి నివేదిక విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు ఏడాది పూర్తి చేసుకున్నారు. ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి నివేదికను మంత్రి విడుదల చేసారు. అనంతరం మాట్లాడుతూ.. దేశంలోనే ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్న 3వ రాష్ట్రంగా నీతి అయోగ్ తెలంగాణను గుర్తించింది. మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ని 43 శాతానికి తగ్గించి, ఎంఎంఆర్ రేట్ అతి తక్కువ ఉన్న మూడో రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని తెలిపారు. ఇన్ ఫాంట్ మోర్టాలిటీ రేట్ 2014 నాటికి రాష్ట్రంలో 39 కాగా ప్రస్తుతం 21 కి తగ్గించారన్నారు. ఏడాది కాలంలో 8 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రాగా… మరో 9 కొత్త మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయని మంత్రి అన్నారు.
Read also: Bandi Sanjay: కేటీఆర్ కు సవాల్.. తండ్రితో ఆ.. మాట చెప్పించగలవా?
Also Read
- Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
- Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
- Harish Rao-KTR: "బతుకంతా తెలంగాణది".. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతి లక్ష జనాభాకు 19 ఎంబీబీఎస్, 7 పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నలుమూలల నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, వరంగల్ లో మరో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి రానుందని అన్నారు మంత్రి. నిమ్స్ ఆస్పత్రిలో బెడ్ల సంఖ్యను 1489 నుంచి 3489కి పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కొత్తగా 515 డయాలసిస్ యంత్రాలతో 61 డయాలసిస్ కేంద్రాల మంజూరు చేశారని అన్నారు. ఉచితంగా తెలంగాణ డయాగ్నోస్టిక్స్ లో భాగంగా ఒక కోటి కంటే ఎక్కువ వైద్య పరీక్షలు జరగాయన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22 జిల్లాల్లో టీ డయాగ్నోస్టిక్స్ హబ్స్ ఉండగా త్వరలో మరో 13 జిల్లాల్లోనూ అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఆక్సిజన్ జనరేషన్ సామర్థ్యం రోజుకి 135 ఎంటీ నుంచి 332 ఎంటీకి పెంచామన్నారు. కేసీఆర్ కిట్ ద్వారా 13.91 లక్షల మందికి ప్రయోజనం జరుగుతుందని ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావ్ తెలిపారు.
Cheating Couple: సీఎం క్యాంప్ ఆఫీస్ పేరుతో దంపతులు భారీ మోసం.. లబోదిబో మంటున్న బాధితులు
తాజావార్తలు
-
Vivo S2: భారత్లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
-
Hero Pleasure Plus: మరింత స్టైలిష్గా హీరో ప్లెజర్ ప్లస్.. కొత్త Aqua Grey కలర్లో విడుదల!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!