Cheating Couple: సీఎం క్యాంప్ ఆఫీస్ పేరుతో దంపతులు భారీ మోసం.. లబోదిబో మంటున్న బాధితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cheating Couple: సీఎం క్యాంప్ ఆఫీస్ పేరుతో భారీ మోసాలకు పాల్పడుతున్న దంపతుల కేసు పోలీసులకే సవాల్ గా మారింది. ఇంజనీరింగ్ మెడికల్ సీట్లు ఇప్పిస్తామంటూ కోట్ల రూపాయలు దోచుకున్నారు. నిరుద్యోగులే లక్ష్యంగా భారీ మోసాలకు పాల్పడ్డారు. కోట్లలో దండుకున్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్ పేరు చెప్పడంతో పాపం అమాయక ప్రజలు ఆదంపతులను నమ్మారు. సీటు సంపాదించుకోవచ్చని వారిదగ్గర ఉండేది ఆదంపతులకు ముట్టజెప్పారు. వారి శ్రమకు ఫలితం వస్తుందని ఆశపడ్డారు మోసపోయామని తెలియడంతో లబోదిబో అంటున్నారు. చివరకు పోలీస్టేషన్ మెట్లెక్కి న్యాయం చేయాలని వాపోతున్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్ పేరు వినడంతో నమ్మాల్సి వచ్చిందని ఇంజనీరింగ్ మెడికల్ సీట్లు ఇప్పిస్తామని మాతో మాయమాటలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడుపు కొట్టుని వారి దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఆదంపతులకు ఇచ్చామని 50 లక్షల నుండి కోటి రూపాయలు వసూలు చేశారని బాధితులు తెలిపారు. ఈఘటన హైదరాబాద్ నడిబొడ్డున జరగడం తీవ్ర కలకలం రేపింది.
Read also: Indrakaran Reddy: నాందేడ్ గురుద్వార్ ను దర్శించుకున్న ఇంద్రకరణ్ రెడ్డి
Also Read
హైదరాబాద్ కాచిగూడలో దంపతులు సీఎం క్యాంప్ ఆఫీస్ పేరుతో ఓ సంస్థను ప్రారంభించారు. ఇంజనీరింగ్ మెడికల్ సీట్లు ఇప్పిస్తామంటూ అమాయక ప్రజలను నమ్మించారు. వారి వద్దనుంచి దంపతులు శ్రీధర్ రెడ్డి, సంధ్యారెడ్డి ఇద్దరు కోట్ల రూపాయలు వసూలు చేశారు. మెడికల్ సీట్ కి 50 లక్షల నుండి కోటి రూపాయలు వసూలు చేశారు. ఇంజనీరింగ్ సీటుకి 10 లక్షల నుండి 16 లక్షల రూపాయల వరకు వసూలు చేశారు. గ్రోవెల్ ఎడ్యుకేషనల్ కెరియర్ సర్వీసెస్ పేరుతో శ్రీధర్ రెడ్డి కాచిగూడలో సంస్థలు ఏర్పాటు చేశాడు. గత రెండున్నరేళ్లుగా శ్రీధర్ రెడ్డి, సంధ్యారెడ్డి ఇద్దరు మోసాలకు పాల్పడుతున్నారు. ఐదు నెలలుగా ఇంకా ఏమి స్పందన రాకపోవడంతో బాధితులు వారిని నిలదీశారు అయినా స్పందించలేదు ఇద్దరు దంపతులు. దీంతో మోసపోయామని భావించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని న్యాయం చేస్తామని తెలిపారు కానీ.. ఇప్పటివరకు శ్రీధర్ రెడ్డి, సంధ్యారెడ్డి లను పోలీసులు పట్టుకోలేదని మండిపడుతున్నారు.
Read also: BRS Meeting: కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం.. అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ
శ్రీధర్ రెడ్డి పై సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే మూడు ఎఫ్ఐఆర్ లు ఉండటం గమనార్హం. అయినా పోలీసులు ఇప్పటి వరకు వారిని ఎందుకు పట్టుకోలేక పోతున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎంతమందితో వీరిద్దరు డబ్బులు కాజేశారో ఇంకా ఎంత మంది బాధితులు ఉన్నారో తేల్చాలని ఆ దంపతులిద్దరికి తగిన బుద్ధి చెప్పాలని, వారి డబ్బులు తిరిగి ఇప్పించే బాధ్యత పోలీసులదే అని బాధితులు అంటున్నారు. ఇంత జరగుతున్నా వారిద్దరిని పోలీసులు ఎందుకు అదుపులో తీసుకోవడం లేదో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతామని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వేచిచూడాలి? అయితే వారిద్దరు ఎక్కడ వున్నారు? ఇప్పటికీ పోలీసులు దంపతులిద్దరిని ఎందుకు అదుపులో తీసుకోవడంలేదు? అనే విషయం పై బాధితులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
BRS Meeting: కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం.. అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!