Hindu Man Killed: కర్ణాటకలో ఉద్రిక్తత.. ముస్లిం మహిళతో సంబంధం, యువకుడి హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో ఇటీవల కాలంలో మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. గత కొన్ని నెలలుగా హిజాబ్ వివాదం కర్ణాటకలో నానుతూనే ఉంది. హైకోర్ట్ విద్యాలయాల్లోకి హిజాబ్ ధరించి రావడానికి వ్యతిరేఖంగా తీర్పు చెప్పింది. అయినా కూడా అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతూనే ఉన్నాయి. మండ్యా, శివమొగ, ఉడిపి, చిక్ బళ్లాపూర్, మైసూర్, దక్షిణ కన్నడ జిల్లాల్లో ఈ వివాదంతో పాఠశాలల్లో రెండు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దేశ వ్యాప్తంగా హిజాబ్ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశం అయింది.
ప్రస్తుతం మాండ్యాలోని జామియా మసీదు, మంగళూర్ లోని జుమా మసీదు వ్యవహారం తెరపైకి వచ్చింది. గతంలో ఈ రెండు మసీదులు దేవాలయాలని…టిప్పు సుల్తాన్ హాయాంలో కూల్చేసి మసీదులుగా మార్చారని హిందు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల మంగళూర్ జుమా మసీదులో దేవాలయానికి సబంధించిన నిర్మాణం వెలుగులోకి రావడంతో ఉద్రికత్తత తలెత్తింది.
Also Read
- Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
- Honeymoon Murder Case: ‘మీ భర్తపై దాడి జరిగినప్పుడు మీరేం చేశారు’ సోనమ్కు సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు
- Congress: రాహుల్ గాంధీ సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్.. అధికారులు, మీడియా షాక్..
- Rahul Gandhi: మోడీ ఇంటి దగ్గర నిరసన.. పోలీసుల అదుపులో రాహుల్గాంధీ, ఖర్గే
ఇదిలా ఉంటే మరోసారి కర్ణాటకలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ముస్లిం మహిళతో సంబంధం పెట్టుకున్నాడని.. 25 ఏళ్ల హిందూ యువకుడిని కిరాతంగా హతమార్చారు. ఈ ఘటన కలబురిగిలో చోటు చేసుకుంది. దీంతో కలబురిగి జిల్లాలో పోలీసులు భద్రతను పెంచారు. ఎటువంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా గట్టి బందోబస్త్ ఏర్పాటు చేశారు.
కులబురిగి జిల్లా వాడి పట్టణానికి చెందిన విజయ్ కాంబ్లే, స్థానికంగా ఉన్న ముస్లిం యువతితో రిలేషన్ లో ఉన్నాడు. అయితే వీరిద్దరు త్వరలోనే వివాహం చేసుకోవాలని అనుకున్నారని అయితే కుటుంబ సభ్యులు మాత్రం దీనిని వ్యతిరేఖించినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే విజయ కాంబ్లేను సోమవారం రాత్రి స్థానికంగా ఉన్న రైల్వే బ్రిడ్జి వద్ద పదునైన ఆయుధాలతో దాడి చేసి చంపేశారు. అమ్మాయి తండ్రి, సోదరుడు తన కుమారుడు విజయ కాంబ్లేను హత్య చేసినట్లు తల్లి ఫిర్యాదు చేసింది. బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందుతులను మస్లిం యువతి సోదరులు షహబుద్దీన్, నవాజ్ గా గుర్తించారు.
తాజావార్తలు
-
China: కొత్త గేమ్కి రెడీ అవుతున్న చైనా.. ప్రపంచానికి షాక్ తప్పదా?
-
Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
-
Cristiano Ronaldo: అర్జెంటీనాపై వివాదాస్పద పోస్ట్ను రొనాల్డో లైక్ చేశారా? సోషల్ మీడియాలో నెటిజన్ల రచ్చ..
-
Adluri Laxman : అధికారంలో ఉన్నప్పుడు రైతులు కనిపించలేదా..!
-
Oppo Smartphone Price: షాపింగ్ చేయడానికి ముందే చెక్ చేసుకోండి.. అమల్లోకి వచ్చిన ఒప్పో కొత్త రేట్లు..
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!