Harish Rao: కాంగ్రెస్ ది.. ఫేక్ సర్వేలు.. తప్పుడు ప్రచారాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: కాంగ్రెస్ ఫేక్ సర్వేలు చేస్తున్నది. మాకే సీట్లు ఎక్కువ అంటూ తప్పుడు ప్రచారం చేస్తుందని మంత్రి హరీష్ రావు అన్నారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల దశ మారిందన్నారు.
నాడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన అంటే నేడు పోదాం పద బిడ్డ సర్కారు దవాఖాన అంటున్నారని తెలిపారు. బిచ్కుందకి డయాలసిస్ సేవలు తెచ్చామన్నారు. ఇప్పుడు వంద పడకల ఆసుపత్రి తెచ్చామని తెలిపారు. నాడు 30 శాతం ప్రభుత్వ డెలివరీలు ఉంటే నేడు అది 76.8 శాతానికి పెరిగిందన్నారు. మోడీ వచ్చి ఇష్టం వచ్చి మాట్లాడాడు. డబుల్ ఇంజిన్ ఫెయిల్ అయ్యిందన్నారు. పక్కనే ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర లో ఎలాంటి పరిస్థితి ఉందని, నాందేడ్ ఆసుపత్రిలో 40 మంది పిల్లలు చనిపోయారని తెలిపారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ సీఎం కేసీఅర్ ఏర్పాటు చేశారని మంత్రి అన్నారు. కర్ణాటకలో కళ్యాణ లక్ష్మి ఉందా? రైతు బంధు ఉందా, 24 గంటల కరెంట్ ఉందా? అని ప్రశ్నించారు. ఇక్కడ కరెంట్ లేదు అంటున్నారు వేలు పేట్టి చూస్తే తెలుస్తుందని మండిపడ్డారు. 3 గంటల కరెంట్ ఎలా సరిపోతుందో రేవంత్ రెడ్డి చెప్పాలని, 3 గంటల కరెంటు కావాలంటే కాంగ్రెస్, 24 గంటల కరెంట్ కావాలంటే బిఆర్ఎస్ కి ఓటు వేయాలని హరీష్ రావు అన్నారు.
ఢిల్లీలో ఇచ్చే అవార్డులన్ని తెలంగాణకు వస్థాయని తెలిపారు. కానీ గల్లికి వచ్చి తిడుతారని మండిపడ్డారు. సంక్షేమంలో స్వర్ణయుగం కేసీఆర్ పాలన ఉందన్నారు. కేసీఆర్ అంటే ప్రతి ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడని, ఒక పెద్ద దిక్కు అని అన్నారు. తెలంగాణ మీద ప్రేమ కేసీఆర్ కు ఉంటదా? రాహుల్ గాంధీకి ఉంటదా? అని ప్రశ్నించారు. పిల్లలకు ఉపాహారం ఇచ్చే అద్భుత పథకం ప్రారంభించామన్నారు. ఇతర రాష్ట్రాల్లో గొడ్డు కారంతో అన్నం పెడితే, సీఎం కేసీఅర్ విద్యార్ధులకు మమకారంతో అన్నం పెడుతున్నారని మంత్రి అన్నారు. ఎస్ఎఫ్టి చొప్పున బెంగళూరులో డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. అవినీతిలో కూడుకు పోయారు
మొన్న చెప్పిన హామీలు కర్ణాటకలో అమలు చేయలేని పరిస్థితి అన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టలేదని, 35 వేల కోట్ల రూపాయలు ఆపింది కేంద్రమని మండిపడ్డారు.
కాంగ్రెస్ ఫేక్ సర్వేలు చేస్తుందని, మాకే సీట్లు ఎక్కువ అంటూ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. గాంధీ భవన్ లో మొన్నటి దాకా అప్లికేషన్ కోసం డబ్బులు వసూలు చేశారు, ఇప్పుడు సీట్లు అమ్ముకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెన్ని ట్రిక్కులు చేసిన హ్యాట్రిక్ కొట్టేది కేసీఆర్ అని మంత్రి హరీస్ అన్నారు.
Kishan Reddy : ఓవైసీ కుటుంబానికి కట్టు బానిసలుగా బీఆర్ఎస్ వ్యవహరిస్తుంది
Also Read
తాజావార్తలు
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
-
buchi babu: సినిమా హిట్ అయినా ఆ తప్పును ఒప్పుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు..
-
India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
-
TG20 League: ‘హైదరాబాద్ ఈ ఛాంపియన్స్’ ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
-
Ragi Burelu: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. సాంప్రదాయ పద్ధతిలో ‘రాగి బూరెలు’ ఎలా చేయాలో తెలుసా?
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!