తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంలో వేగంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. ఈటల దగ్గర ఉన్న వైద్య ఆరోగ్యశాఖను ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు గవర్నర్ తమిళిసై… దీంతో.. ఏ శాఖలేని మంత్రిగా ఈటల మిగిలిపోయారు.. అయితే, ఈటల నుంచి వైద్య, ఆరోగ్యశాఖ తప్పించాలని గవర్నర్కు సీఎం కేసీఆర్ లేఖ రావడంతో.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు గవర్నర్.. ఇక, ఈటలపై భూ కబ్జా ఆరోపణలు రావడంతో.. విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే కాగా.. సంబంధిత గ్రామంలో పర్యటించిన కలెక్టర్, ఇతర అధికారులు.. వారి అభిప్రాయాలను తెలుసుకుని.. ప్రభుత్వానికి నివేదిక అందజేశారు.. దీంతో.. ఈటల రాజేందర్ నుంచి మంత్రి పదవి తన పరిధిలోకి తెచ్చుకున్నారు కేసీఆర్.. కాగా, అచ్చంపేటలో అసైన్డ్ భూములు కబ్జాకు గురైన మాట వాస్తమేనని ఇప్పటికే మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ స్పష్టం చేశారు. ఇక, ఈటల ఇలాంటి నిర్ణయం తీసుకోబుతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.