Ganja Smuggling: ఏం ఐడియా రా బాబు.. కుటుంబంగా ఏర్పడి కారులో గంజాయి విక్రయం..
- గంజాయిని సరఫరా చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్న శామీర్పేట్ పోలీసులు..
- 26 కిలోల గంజాయి,1 కారు 2 బైకులు,4 సెల్ ఫోన్లు స్వాధీనం..
- మీడియాకు వివరాలు వెల్లడించిన పెట్ బషీరాబాద్ ఏసిపి రాములు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ganja Smuggling: ఎవరికి అనుమానం రాకుండా ఒక కుటుంబంలా ఏర్పడి గంజాయి విక్రయం చేస్తున్న ముఠాను శామీర్పేట్ పోలీస్ స్టేషన్ గుట్టురట్టు చేశారు.
ఇతర రాష్ట్రాల నుండి తక్కువ ధరలో గంజాయిని కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తున్న ముఠాను అదుపులో తీసుకున్నారు. వీరి వద్దనుంచి దాదాపు 15 లక్షల విలువైన గంజాయిని సీజ్ చేశారు.
Read also: Narayana Murthy: కింగ్ ఫిషర్ టవర్స్లో ఫ్లాట్ కొనుగోలు చేసిన నారాయణ మూర్తి.. ధర ఎంతంటే?
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్లో ప్రేమ పేరుతో మోసం.. ఇద్దరు యువతుల నుంచి రూ.12 లక్షలకు పైగా కాజేసిన కేటుగాడు.!
- Medak: మొబైల్ లో గేమ్స్ ఆడొద్దు అన్నందుకు యువతి షాకింగ్ డెసిషన్
- Wife Kills Husband: 23 ఏళ్ల యువకుడితో అక్రమ సంబంధం.. భర్తను చంపి చెరువులో పడేసిన భార్య
- Gorilla Getup: కోతుల బెడదకు యువత మాస్టర్ ప్లాన్..!
ఈ ఘటనపై పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు మాట్లాడుతూ.. విశ్వసనీయ సమాచారం మేరకు శామీర్పేట్ పోలీసులు మేడ్చల్ జిల్లా శామీర్పేట్ మండల మజీద్ పూర్ గ్రామంలోని బావార్చి ఎదురుగు ఉన్న ఓపెన్ వెంచర్ వద్ద గంజాయిని సరఫరా చేస్తున్న ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారి వద్ద నుండి 26 కిలోల గంజాయి, ఒక ఫోర్డ్ ఫిగో కారు, రెండు ద్విచక్రా వాహనాలు, నాలుగు మొబైల్ ఫోన్ లను స్వదినం చేసుకుని నిందితులను పోలీస్ స్టేషన్ కు తరలించారని అన్నారు. వీటి విలువ మొత్తం దాదాపు 15 లక్షల వరకు ఉంటుందని ఏసీపీ రాములు చెప్పారు.
Read also: Madhavaram Krishna Rao: ఎమ్మెల్యే శంకర్పై చర్యలు తీసుకోండి.. ఎమ్మెల్యే మాధవరం సీరియస్..
సరఫరా చేసే వ్యక్తులు ఎవరికి అనుమానం రాకుండా కార్ లో ఒక కుటుంబంలాగా ఏర్పడి దేశంలోని పలు రాష్ట్రాలకు గంజాయి సరఫరా చేస్తున్నారని ఏసీపీ చెప్పారు. గంజాయి సరఫరా చేస్తున్న వారిలో ఒడిశా రాష్ట్రానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కాగా, హైదరాబాద్ పాతబస్తీకి చెందిన మరో నలుగురు కొనుగోలు చేస్తున్న వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు.
Read also: TGSRTC: ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త.. హైదరాబాద్లో ఆర్టీసీ పికప్ వ్యాన్ సేవలు..
ఈ ఏడుగురిలో ఓ మైనర్ బాలికతో పాటు గీత మండల, రిత మిశ్రా మహిళలు ఉండగా నయన్ దాస్, రోహిత్, రాజ్ సింగ్ తోపాటు అనికేష్ సింగ్ పాత నేరస్థుడిగా పోలీసులు గుర్తించారు. గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తి మీనా భాయ్ పరారీలో ఉన్నట్లు ఏసీపీ రాములు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని రిమాండ్ కు తరలించినట్లు ఏసీపీ చెప్పారు. అసాంఘిక కార్యపాలపై ఎలాంటి సమాచారం ఉన్న పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఏసీపీ రాములు కోరారు.
Top Headlines @1PM : టాప్ న్యూస్
తాజావార్తలు
-
Vijay : విజయ్ అయినా ఆ కల నెరవేరుస్తాడా?
-
Iran: రక్తానికి రక్తం.. ట్రంప్ ఫ్యామిలీని టార్గెట్ చేసిన ఇరాన్..
-
Anna Hazare: ‘‘సహనాన్ని పరీక్షించొద్దు’’.. సోనమ్ వాంగ్చుక్కు అన్నాహజారే మద్దతు..
-
72nd National Film Awards: ఉత్తమ నటుడు కిరీటం వీళ్లిద్దరికీ.. జాతీయ ఉత్తమ నటిగా!
-
Abhishek Banerjee: “తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా”.. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!