Cold Wave: ఉమ్మడి మెదక్ జిల్లాను వణికిస్తున్న చలి.. కనిష్ట ఉష్ణోగ్రత నమోదు
- ఉమ్మడి మెదక్ జిల్లాపై చలి పంజా
- చలికి గజగజ వణుకుతున్న జనం
- ఒక్కసారిగా సింగిల్ డిజిట్ కి పడిపోయిన ఉష్ణోగ్రతలు
- రాష్ట్రంలోనే కనిష్ట ఉష్ణోగ్రత సంగారెడ్డి జిల్లాలో నమోదు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి మెదక్ జిల్లాపై చలి పంజా విసురుతుంది. చలికి జనం గజగజ వణుకుతున్నారు. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కి పడిపోయాయి. రాష్ట్రంలోనే కనిష్ట ఉష్ణోగ్రత సంగారెడ్డి జిల్లాలో నమోదు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా కోహిర్ 6.9, న్యాల్కల్ 8.2, అల్గోల్ 8.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్ జిల్లా టేక్మాల్ 9.3, నర్సాపూర్ 9.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి. సిద్దిపేట జిల్లా అంగడి కిష్టాపూర్ 9.7, బేగంపేట 10.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యాయి.
Read Also: Road Accident: అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా.. డ్రైవర్ మృతి, పలువురికి గాయాలు
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్లో ప్రేమ పేరుతో మోసం.. ఇద్దరు యువతుల నుంచి రూ.12 లక్షలకు పైగా కాజేసిన కేటుగాడు.!
- Medak: మొబైల్ లో గేమ్స్ ఆడొద్దు అన్నందుకు యువతి షాకింగ్ డెసిషన్
- Wife Kills Husband: 23 ఏళ్ల యువకుడితో అక్రమ సంబంధం.. భర్తను చంపి చెరువులో పడేసిన భార్య
- Gorilla Getup: కోతుల బెడదకు యువత మాస్టర్ ప్లాన్..!
మరోవైపు.. సాయంత్రం 5 కాగానే చలి ప్రారంభమవుతుంది. రాత్రి 7 గంటల వరకు చలి తీవ్రంగా పెరిగి.. ఉదయం 8 గంటల వరకు చలి ప్రభావం చూపిస్తుంది. ఉదయం, సాయంత్రం చలి గాలులకు జనం ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఉదయం స్కూళ్లకు వెళ్లే పిల్లలు, పాలు, కూరగాయలు అమ్మేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే.. చలి తీవ్రత ముందు రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
Read Also: RIP GOUTAM GAMBHIR: టీమిండియా కోచ్పై విరుచుకపడుతున్న క్రికెట్ అభిమానులు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉదయం పొగమంచు కమ్మేస్తోంది. ఉదయం 8 గంటల వరకు కూడా మంచు దుప్పటి వీడడం లేదు. ముఖ్యంగా జాతీయ రహదారులను పొగమంచు తీవ్ర స్థాయిలో కమ్మేస్తోంది. ఈ క్రమంలో.. వాహనాల రాకపోకలకు అసౌకర్యం కలుగుతోంది. పొగ మంచు కమ్మేయడంతో కొన్ని చోట్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించాలని రహదారి నిపుణులు సూచిస్తున్నారు. చలికాలంలో రాత్రి, తెల్లవారుజామున ప్రయాణాలు మానుకోవాలని, అవసరమైతేనే ఆయా వేళల్లో బయటకి వెళ్లాలని చెబుతున్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులు, గర్భిణులు, బాలింతలు, మహిళలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!