Cold Wave: ఉమ్మడి మెదక్ జిల్లాను వణికిస్తున్న చలి.. కనిష్ట ఉష్ణోగ్రత నమోదు
- ఉమ్మడి మెదక్ జిల్లాపై చలి పంజా
- చలికి గజగజ వణుకుతున్న జనం
- ఒక్కసారిగా సింగిల్ డిజిట్ కి పడిపోయిన ఉష్ణోగ్రతలు
- రాష్ట్రంలోనే కనిష్ట ఉష్ణోగ్రత సంగారెడ్డి జిల్లాలో నమోదు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి మెదక్ జిల్లాపై చలి పంజా విసురుతుంది. చలికి జనం గజగజ వణుకుతున్నారు. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కి పడిపోయాయి. రాష్ట్రంలోనే కనిష్ట ఉష్ణోగ్రత సంగారెడ్డి జిల్లాలో నమోదు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా కోహిర్ 6.9, న్యాల్కల్ 8.2, అల్గోల్ 8.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్ జిల్లా టేక్మాల్ 9.3, నర్సాపూర్ 9.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి. సిద్దిపేట జిల్లా అంగడి కిష్టాపూర్ 9.7, బేగంపేట 10.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యాయి.
Read Also: Road Accident: అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా.. డ్రైవర్ మృతి, పలువురికి గాయాలు
Also Read
- Accident : స్కూల్ ఆటోను ఢీకొట్టిన లారీ, 10 మంది విద్యార్థులకు గాయాలు
- Medak: నకిలీ బాబా బాగోతం.. యువతిని పెళ్లి చేసుకుని, గుప్తనిధుల పేరుతో లక్షలు కాజేసిన కేటుగాడు..!
- Instagram Love: ఇన్స్టాగ్రామ్లో ప్రేమ పేరుతో మోసం.. ఇద్దరు యువతుల నుంచి రూ.12 లక్షలకు పైగా కాజేసిన కేటుగాడు.!
- Medak: మొబైల్ లో గేమ్స్ ఆడొద్దు అన్నందుకు యువతి షాకింగ్ డెసిషన్
మరోవైపు.. సాయంత్రం 5 కాగానే చలి ప్రారంభమవుతుంది. రాత్రి 7 గంటల వరకు చలి తీవ్రంగా పెరిగి.. ఉదయం 8 గంటల వరకు చలి ప్రభావం చూపిస్తుంది. ఉదయం, సాయంత్రం చలి గాలులకు జనం ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఉదయం స్కూళ్లకు వెళ్లే పిల్లలు, పాలు, కూరగాయలు అమ్మేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే.. చలి తీవ్రత ముందు రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
Read Also: RIP GOUTAM GAMBHIR: టీమిండియా కోచ్పై విరుచుకపడుతున్న క్రికెట్ అభిమానులు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉదయం పొగమంచు కమ్మేస్తోంది. ఉదయం 8 గంటల వరకు కూడా మంచు దుప్పటి వీడడం లేదు. ముఖ్యంగా జాతీయ రహదారులను పొగమంచు తీవ్ర స్థాయిలో కమ్మేస్తోంది. ఈ క్రమంలో.. వాహనాల రాకపోకలకు అసౌకర్యం కలుగుతోంది. పొగ మంచు కమ్మేయడంతో కొన్ని చోట్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించాలని రహదారి నిపుణులు సూచిస్తున్నారు. చలికాలంలో రాత్రి, తెల్లవారుజామున ప్రయాణాలు మానుకోవాలని, అవసరమైతేనే ఆయా వేళల్లో బయటకి వెళ్లాలని చెబుతున్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులు, గర్భిణులు, బాలింతలు, మహిళలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!