C.V.Anand: హైదరాబాద్ లో రెచ్చిపోతున్న డ్రగ్స్ ముఠా.. ముంబైలో మకాం వేసి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drugs Mafia: ముంబై నుంచి హైదరాబాద్ కి డ్రగ్స్ రాకుండా కట్టటి చేస్తున్నామని, టీ ల్యాబ్ అందుబాటులోకి తెస్తున్నాం, దాని ద్వారా మరింత నిఘా పెడుతామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. హైదరాబాద్ లో డ్రగ్స్ ను రూపుమాపడానికి చాలా వ్యూహాలతో నార్కోటిక్ ఎన్ఫోర్స్ మెంట్ వింగ్ ముందుకు పోతుంది. డ్రగ్స్ పెడ్లర్లు తోపాటు డ్రగ్స్ సేవించే వారిలో భయాన్ని తీసుకొచ్చామన్నారు. ముంబై కేంద్రంగా ఇప్పుడు డ్రగ్స్ అడ్డాగా మారిందని డ్రగ్స్ వ్యవహారంలో గోవా పోలీస్ గతంలో మాకు సహకారం అందించాలేదన్నారు. ఇప్పుడు ముంబై కేంద్రంగా నడుస్తున్న డ్రగ్స్ ముఠాలపై మహారాష్ట్ర పోలీసులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. వారి సహకారంతో ముంబై లో కూడా ఆపరేషన్లు చేస్తామని, కొద్దీ రోజుల్లోనే T ల్యాబ్ అందుబాటులోకి తెస్తున్నాం, దాని ద్వారా మరింత నిఘా పెడుతామన్నారు. ముంబై కేంద్రంగా అమ్మబడుతున్న నార్కోటిక్ డ్రగ్ MDMA గా గుర్తించామని తెలిపారు. సనా ఖాన్ అనే ఒక స్టూడెంట్ ఓ ఐటీ కంపనీలో పని చేస్తుందని, ముంబై వెళ్లి అక్కడ డ్రగ్స్ సేవిస్తుంది, ఒక గ్రాము మూడు వేలకు కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్ కి సనా ఖాన్ డ్రగ్స్ తెచ్చి ఒక గ్రాము 7 వేలకు అమ్మకాలు చేస్తున్నారని వెల్లడించారు. హైదరాబాద్ కి చెందిన 40 మంది, ముంబైలో 70 మంది స్నేహితులకు అమ్మకాలు చేస్తుందని తెలిపారు.
Read also: Komatireddy Venkat Reddy: పొత్తులపై కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు.. కేసీఆర్ కాంగ్రెస్ తో కలవాల్సిందే..!
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
- Oil Palm Cultivation : తెలంగాణలో ఆయిల్పామ్ దూకుడు.. రైతులకు ‘మహా కారిడార్’ ప్లాన్
- Bhatti Vikramarka : బొగ్గు దాటి బంగారం, రాగిపై సింగరేణి ఫోకస్.. భట్టి కీలక ఆదేశాలు
- US: ఫ్లోరిడాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ విద్యార్థుల మృతి
ముంబైలో ఉన్న డ్రగ్స్ కింగ్ పిన్ ను త్వరలో పట్టుకుంటామన్నారు. కిలో MDMA కు ఆరు లక్షలు అమ్మకాలు చేస్తిన్నట్లు గుర్తించామని తెలిపారు. ముంబైలోని మలాద్ ప్రాంతం నుండి శంషఉద్దీన్ ద్వారా ట్రాన్స్ఫర్ట్ చేస్తున్నారని తెలిపారు. జతిన్ భాలచంద్ర భలేరావుకి పంపుతున్నారని తెలిపారు. ఏడాదికి 12 లక్షలు విలువైన డ్రగ్స్ అమ్మకాలు చేసినట్లు గుర్తించామమని సీపీ తెలిపారు. ముంబైలో నయా ట్రెండ్ నడుస్తుందని, అమ్మాయిలకు డ్రగ్స్ ఇవ్వడం, అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు వారిపై లైంగిక దాడి చేస్తున్నారని పేర్కొన్నారు. నిందితుల నుండి 204 గ్రాముల MDMA, ఫోర్ వీలర్ ను సీజ్ చేశామని తెలిపారు. ముంబైలో మరో గ్యాంగ్ ను అరెస్ట్ చేశామని, ఏపీ నుండి ముంబైకి గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. ఈ కేసులో భార్య భర్తల ఇద్దరు పరారు అయ్యారని, వారికోసం గాలిస్తున్నామన్నారు. వారి వద్ద 110 కిలోల గంజాయిని టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేశామమన్నారు. ఇక మూడో గ్యాంగ్ ను కూడా పట్టుకున్నామని, మెహర్జ కాజి అనే వ్యక్తి కూడా డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్నారని తెలిపారు. నాలుగు లక్షల విలువైన 40 గ్రాముల MDMA సీజ్ చేశామమన్నారు. మొత్తం ముంబై కేంద్రంగా నడుస్తున్న మూడు గ్యాంగ్ లను అరెస్ట్ చేశామన్నారు. గతంలో అరెస్ట్ చేసిన టోనీ ఆధారంగా ఈ కేసు పెట్టుకున్నామన్నారు. ముంబై నుంచి హైదరాబాద్ కి డ్రగ్స్ రాకుండా కట్టటి చేస్తున్నామన్నారు. ముంబై పోలీసుల సహకారంతో నలుగురిని తీసుకున్నామన్నారు.
Haath se haath Jodo: రేవంత్ తో వీహెచ్ పాదయాత్ర.. సాయంత్రం భట్టితో..
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..