Karthika Pournami: శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు.. శివాలయాల్లో భక్తుల పూజలు..
- నేడు కార్తీక పౌర్ణమి..
- శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు..
- తెల్లవారుజాము నుంచే శివాలయాల్లో భక్తుల పూజలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karthika Pournami: కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వేయి స్తంభాల గుడి, రామప్ప, కాళేశ్వరం, సిద్దేశ్వరాలయం, కోటగుల్ల, పాలకుర్తి సోమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అలాగే, కాళేశ్వరం త్రివేణి సంగమం, భద్రాచలం వద్ద గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, ఆలయాల్లో కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు.
Read Also: Ahmedabad Plane Crash: విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్న రమేష్కు షాకింగ్ వ్యాధి..!
Also Read
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
అలాగే, నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ మండలం సోమశిలలో కార్తీక పౌర్ణమి సందర్భంగా కృష్ణానదిలో భక్తులు స్నానాలు ఆచరించిన తర్వాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. మరోవైపు, జోగులాంబ గద్వాల జిల్లాలో బీచుపల్లిలో గల ఆంజనేయ స్వామి ఆలయాలలో వేకువ జాము నుంచే కృష్ణ నదిలో, అలంపూర్ లోని తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు ఆచరించి భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలన వెలిగించి నదిలో భక్తులు వదిలి పెడుతున్నారు. ఇక, అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల పరిసరాలలో కార్తీక దీపాలు వెలిగించి స్వామి వారికి అభిషేకాలు నిర్వహించి, అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కాగా, నల్లగొండ జిల్లాలోని నార్కట్ పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు కొనసాగుతున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. తెల్లవారుజాము నుంచి ఆలయానికి చేరుకొని కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!