Maoists Letters: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోల లేఖల కలకలం.. ఎమ్మెల్యేలే టార్గెట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల లేఖలు కలకలం రేపుతున్నాయి. నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లోని ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ మావోల పేరుతో లేఖలు కనిపించాయి. మంచిర్యాల జిల్లాలో ఎమ్మెల్యే దివాకర్ రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డిల పేర్లు ప్రస్తావిస్తూ లేఖలు వైరల్ అవుతున్నాయి. మావోయిస్టు నేత భాస్కర్, సికాసా ప్రభాత్ పేరుతో ఈ లేఖలు కనిపించాయి. ఇక, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నారని.. ఎమ్మెల్యే అనుచరులు సహాయం కోసం వచ్చే మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారని ఆ లేఖలో మావోలు పేర్కొన్నారు.
Read Also: Shruti Haasan : శృతిహాసన్ పాటకు నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్..
Also Read
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
ఇక, ఎమ్మెల్యే దివాకర్ రావు అనుచరుడు హాజీపూర్ ఎంపీపీ భర్త మందపల్లి శ్రీనివాస్ అక్రమాలకు పాల్పడుతున్నాడని.. అలాగే, ఎమ్మెల్యే దివాకర్ రావు కుమారుడు విజిత్ రావు మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలను తెప్పించి యువతను నాశనం చేస్తున్నారని, వారి ద్వారా భూమి కబ్జాలు చేస్తున్నారని ఆ లేఖలో ప్రస్తావించారు. అలాగే, ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల దీన స్థితి, దాని కోసం వచ్చే ప్రభుత్వ నిధుల దారి మళ్లింపులో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అలాగే విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై విమర్శలు మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు.
Read Also: Kotta Manohar Reddy: మహేశ్వరంలో కొత్త మనోహర్ రెడ్డి ప్రచారం.. అడుగడుగున ప్రజల నీరాజనం
అలాగే, ఖానాపూర్, నిర్మల్, ముధోల్, మంచిర్యాల, బెల్లంపల్లి, రామగుండం ఎమ్మెల్యేలే టార్గెట్ గా ఈ లేఖలు కలకలం రేపుతున్నాయి. అవి మావోలే విడుదల చేశారా.. లేఖ గిట్టని వారి పనా అనే దానిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆరా తీస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోల పేరుతో ఉన్న లేఖలు వైరల్ గా మారాయి. ఎన్నికల ప్రచారంకు వచ్చే బీజేపీ నాయకులను తరమండి బీఆర్ఎస్ నేతలను నిలదీయండి అంటూ లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?