Maoists Letters: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోల లేఖల కలకలం.. ఎమ్మెల్యేలే టార్గెట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల లేఖలు కలకలం రేపుతున్నాయి. నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లోని ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ మావోల పేరుతో లేఖలు కనిపించాయి. మంచిర్యాల జిల్లాలో ఎమ్మెల్యే దివాకర్ రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డిల పేర్లు ప్రస్తావిస్తూ లేఖలు వైరల్ అవుతున్నాయి. మావోయిస్టు నేత భాస్కర్, సికాసా ప్రభాత్ పేరుతో ఈ లేఖలు కనిపించాయి. ఇక, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నారని.. ఎమ్మెల్యే అనుచరులు సహాయం కోసం వచ్చే మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారని ఆ లేఖలో మావోలు పేర్కొన్నారు.
Read Also: Shruti Haasan : శృతిహాసన్ పాటకు నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్..
Also Read
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
- Job Scam: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
- Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
ఇక, ఎమ్మెల్యే దివాకర్ రావు అనుచరుడు హాజీపూర్ ఎంపీపీ భర్త మందపల్లి శ్రీనివాస్ అక్రమాలకు పాల్పడుతున్నాడని.. అలాగే, ఎమ్మెల్యే దివాకర్ రావు కుమారుడు విజిత్ రావు మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలను తెప్పించి యువతను నాశనం చేస్తున్నారని, వారి ద్వారా భూమి కబ్జాలు చేస్తున్నారని ఆ లేఖలో ప్రస్తావించారు. అలాగే, ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల దీన స్థితి, దాని కోసం వచ్చే ప్రభుత్వ నిధుల దారి మళ్లింపులో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అలాగే విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై విమర్శలు మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు.
Read Also: Kotta Manohar Reddy: మహేశ్వరంలో కొత్త మనోహర్ రెడ్డి ప్రచారం.. అడుగడుగున ప్రజల నీరాజనం
అలాగే, ఖానాపూర్, నిర్మల్, ముధోల్, మంచిర్యాల, బెల్లంపల్లి, రామగుండం ఎమ్మెల్యేలే టార్గెట్ గా ఈ లేఖలు కలకలం రేపుతున్నాయి. అవి మావోలే విడుదల చేశారా.. లేఖ గిట్టని వారి పనా అనే దానిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆరా తీస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోల పేరుతో ఉన్న లేఖలు వైరల్ గా మారాయి. ఎన్నికల ప్రచారంకు వచ్చే బీజేపీ నాయకులను తరమండి బీఆర్ఎస్ నేతలను నిలదీయండి అంటూ లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వీడియో
-
Jananayagan : కళ్లు చెదిరే రేటుకు ‘జననాయగన్’ తెలుగు రైట్స్?
-
Oil Companies: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచినా.. ఇంకా నష్టాల్లోనే చమురు సంస్థలు.. కారణం ఇదే..
-
India Bullet Train: భారత్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ విడుదల.. ఫొటో వైరల్
-
CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో ‘బుల్లెట్ మోటార్ సైకిల్’ ప్రాజెక్టు ఏర్పాటు..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!