Hyderabad: నిద్రిస్తున్న వ్యక్తి.. ఇల్లు కూల్చివేసిన అధికారులు.. ఆ తర్వాత ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: నిర్మాణంలో ఉన్న ఓ ఇల్లు కూల్చివేత పనులు చేస్తుండగా, ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కూకట్పల్లి మూసాపేటలో మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్, తన పాత ఇంటిని బుధవారం కూల్చివేశారు. కూల్చివేతకు ముందు రోజే ఆ ఇంటిలో అద్దెకు ఉన్న అందరినీ ఇల్లు ఖాళీ చేయించారు. ఉదయం పాక్షికంగా కూల్చివేత పనులు చేపట్టగా, భోజన విరామ అనంతరం ఇంటిని పూర్తిగా కూల్చివేశారు. అయితే ఆ ఇంటిలో స్వామి రెడ్డి అనే వ్యక్తి అద్దెకు ఉండేవాడు. నిన్న మధ్యాహ్నం మద్యం మత్తులో ఖాళీ చేయించిన ఇంటికి వచ్చి లోన నిదిరించాడు. అతడు లోన ఉన్న విషయం తెలియకుండా ఇంటిని పూర్తిగా కూల్చివేయటంతో, స్వామి రెడ్డి శిథిలాల కింద పడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృత దేహాన్ని శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read also: Tunnel Roads: హైదరాబాద్ లో 5 టన్నెల్ రోడ్లు.. మూడు మార్గాల్లో 39 కి.మీటర్లు మేర సొరంగం
Also Read
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
- Telangana Jobs: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలోనే 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు..
- Hyderabad: ప్రేమిస్తున్న యువకుడు మాట్లాడటం లేదని మనస్తాపం.. మైనర్ బాలిక ఆత్మహత్య.!
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
కూల్చి వేస్తున్నట్లు ముందే సమాచారం ఇచ్చిన తాగి మరీ ఖాళీ చేయించిన ఇంట్లోనే స్వామి రెడ్డి ఎందుకు పడుకున్నాడు. కుటుంబ విభేదాలతో ఇక్కడకు వచ్చి నిద్రపోయాడా? లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే కోనంలో పోలీసులు విచారణ చేపట్టారు. అయితే మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ మాట్లాడుతూ.. తను ముందుగానే తన పాత ఇంటిని ఖాళీ చేయాలని చెప్పానని తెలిపారు. అయితే నిన్న కూల్చివేస్తున్నప్పుడు కూడా ముందుగానే ఇంటిని పరిశీలించామని అన్నారు. అయితే స్వామి రెడ్డి ఎప్పుడు వచ్చి ఇంటిలో పడుకున్నాడో మాకు తెలియదని కొనియాడారు. ముందుగా సమాచారం ఇచ్చాము కాబట్టే ఇంటిని కూల్చివేసామని అందులో స్వామి రెడ్డి మృతితో తమకు సంబందం లేదని అన్నారు. మరి వీటిపై పోలీసులు ఏవిధంగా చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
Satya Pal Malik: జమ్మూ కాశ్మీరు మాజీ గవర్నర్ ఇంట్లో సీబీఐ సోదాలు
తాజావార్తలు
-
Trump: భారత్ విద్యార్థులకు బిగ్ షాక్.. ట్రంప్ కొత్త స్టూడెంట్ వీసా నిబంధనలివే!
-
6500mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే , 90W ఛార్జింగ్.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ లా కనిపించే ఫోన్..
-
ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..
-
Devendra Fadnavis: సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
-
Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?