Mahesh Kumar Goud: 2 లక్షల రూపాయల రైతు రుణ మాఫీ చారిత్రక నిర్ణయం..
- ఇవాళ- రేపు సంబరాలకు కాంగ్రెస్ పిలుపు..
- ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ కి కేబినెట్ ఆమోదంపై సంబరాలు..
- మండల..జిల్లా కేంద్రాల్లో సంబరాలు చేయాలని మహేష్ గౌడ్ పిలుపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahesh Kumar Goud: 2 లక్షల రూపాయల రైతు రుణ మాఫీ చారిత్రక నిర్ణయమని ఎమ్మెల్సీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రి వర్గం సమావేశం జరిగింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏక కాలంలో 2 లక్షల రూపాయల రైతు రుణ మాఫీ కి నిర్ణయం తీసుకున్న విషయం చారిత్రక నిర్ణయమని తెలిపారు. ఇంతటి ఘనత సాధించి రైతాంగానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మన ప్రభుత్వ పనితీరు ను మనం విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలని తెలిపారు.
Read also: Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత..!
Also Read
- Mutyam Venkataramana: ఆదాయానికి మించిన ఆస్తులు.. ట్రాన్స్కో డీఈ అరెస్టు.! రూ.400 కోట్ల ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు.!
- CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
- HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
- HYDRA Ranganath: నేను చట్టపరిధిలోనే పనిచేస్తున్నా, పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తి లేదు
2004 లో కరీంనగర్ లో శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని అడ్డంకులు వచ్చినా 60 ఏళ్ల తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసామన్నారు. అలాగే 2022 డిసెంబర్ లో ఏఐసీసీ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు రైతులకు ఏక కాలంలో 2 లక్షల రూపాయల రైతు రుణ మాఫీ పై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. ఇకపోతే మన ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 లోపు రైతు రుణ మాఫీ చేస్తమని ప్రకటించారన్నారు.
Read also: ఇన్స్టాలో అవి చూస్తే రిస్క్లో పడ్డట్టే..?
ఎన్ని ఆర్థిక అవాంతరాలు వచ్చినా కూడా అన్నింటినీ అధిగమించి 31 వేల కోట్ల రూపాయలు రుణ మాఫీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఇంతటి ఘనత సాధించిన కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన, రైతుల పక్షాన మనం పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవాలన్నారు. ఈ రోజు, రేపు అన్ని మండల, నియోజక వర్గ, జిల్లా కేంద్రాలలో 2 లక్షల రూపాయల రైతు రుణ మాఫీ అమలు సందర్భంగా సంబరాలు, ప్రెస్ మీట్స్ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వం రుణ మాఫీ విషయంలో రైతులకు అనేక మాటలు చెప్పి మోసం చేసిందని గుర్తు చేశారు.
Read also: Cell Phone Snatching: చిలకలగూడలో సెల్ ఫోన్ స్నాచింగ్ ముఠాపై పోలీసులు ఫైర్..!
ఈ విషయంలో ఈ రోజు అన్ని నియోజక వర్గాలలో, జిల్లా కేంద్రాలలో ప్రెస్ మీట్స్ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, మంత్రి వర్గానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తూ ప్రెస్ తో మాట్లాడగలరని విజ్ఞప్తి చేశారు. ఇవాళ.. రేపు సంబరాలకు కాంగ్రెస్ పిలుపు నిచ్చింది. ఒకేసారి రెండు లక్షల రుణమాఫీకి కేబినెట్ ఆమోదంపై సంబరాలు చేసుకోవాలని తెలిపారు. మండల..జిల్లా కేంద్రాల్లో సంబరాలు చేయాలని డీసీసీ లకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ పిలుపు నిచ్చారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రెస్ మీట్ లు పెట్టి ప్రజలకు వివరించాలని ఆదేశాలు జారీ చేశారు.
Wrong Route Driving: రాంగ్ రూట్ లో వెళ్తున్నారా తస్మాత్ జాగ్రత్తా..
తాజావార్తలు
-
2027 Movies : క్రేజీ మూవీస్ అన్నీ 2027లోనే.. పోటీలో బాలయ్య, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
Richest Star Kids: హృతిక్ నుంచి అల్లు అర్జున్ వరకు.. 2026లో అత్యంత ధనవంతులైన స్టార్ కిడ్స్ ఎవరో తెలుసా?
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
PM Modi on NEET Protest: నీట్ పేపర్ లీక్ వివాదంపై మౌనం వీడిన ప్రధాని మోడీ.. ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఆదేశం
ట్రెండింగ్
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి