Charminar: ఛీ..ఛీ.. చార్మినార్ పై ఏంట్రా ఇలా చెలరేగిపోతున్నారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Charminar: హైదరాబాద్ అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది చార్మినార్. ఇదీ మన భాగ్య నగరానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గుర్తింపు. హైదరాబాద్ పాతబస్తీలోని చార్మినార్ భారతదేశంలోని ప్రసిద్ధ భవనాలలో ఒకటి. హైదరాబాదును సందర్శించే ప్రతి పర్యాటకుడు తప్పక చూడవలసిన అద్భుతమైన భవనం. చార్మినార్ను 1591లో హైదరాబాద్ను పాలించిన మహమ్మద్ కులీ కుతుబ్షా నిర్మించారు. ఇది మన హైదరాబాద్ నగరానికి బెంచ్ మార్క్ గా మారింది. అయితే ఇప్పుడు ఆ చార్మినార్ ప్రాంతంలో అంధకారం అలుముకుంది. నిత్యం వేలాది మంది వచ్చే ఈ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డంకిగా మారింది. పర్యాటక కేంద్రంగా పేరొందిన ఆ ప్రదేశంలో కొందరు చేస్తున్న పని పర్యాటకులకు ఇబ్బందికి గురిచేస్తోంది. ఇప్పటి వరకు రాత్రిపూట కూడా రద్దీ లేని చార్మినార్.. బ్యాంగిల్స్, ఇతర దుకాణాలు నిత్యం కిటకిటలాడేవి. అయితే ఇప్పుడు చాలు చార్మినార్కు వెళ్లే ప్రధాన రహదారులను పోలీసులు అర్థరాత్రి మూసివేస్తున్నారు.
Read also: TSRTC: ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త.. సుదూర ప్రాంతాలకు స్పెషల్ ట్రిప్పులు
Also Read
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్కు హరీశ్ రావు లేఖ..!
- Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
కొందరు ప్రేమికులు రాత్రి వేళల్లో దురుసుగా ప్రవర్తించడం, గొడవ పడుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో చార్మినార్ చూసేందుకు దూరప్రాంతాల నుంచి వచ్చే వారికి నిరాశ తప్పలేదు. చాలా దూరం నుంచి వస్తున్నా.. అదే దూరం నుంచి చార్మినార్ని చూసి చీకట్లో సెల్ఫీలు దిగాల్సిన పరిస్థితి నెలకొంది. ఎంతో ఆశతో వస్తుంటే చార్మినార్ ను దగ్గర నుంచి చూడలేకపోతున్నామని పర్యాటకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొందరు చేసిన పనికి తమను ఇబ్బంది పెట్టడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా రాత్రి వేళల్లో రోడ్లను మూసివేస్తున్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. తాజాగా కేంద్రమంత్రి కిషన్రెడ్డి కూడా చార్మినార్ను రాత్రిపూట అందంగా తీర్చిదిద్దేందుకు ఇల్యూమినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 190 వాట్ల ఎల్ఈడీ లైట్లు కూడా అమర్చారు. అలాగే ఏడాది పొడవునా ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక దీపాలు వెలిగిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. కొత్త అందాలతో చార్మినార్ని చూసేందుకు చాలా మంది పర్యాటకులు అక్కడికి వెళుతున్నారు. పోలీసుల ఆంక్షలతో వారు నిరాశ మిగిల్చింది.
Fire Aciident: చందానగర్లో అగ్ని ప్రమాదం.. జేపీ సినిమాస్ మల్టీఫ్లెక్స్లో చేలరేగిన మంటలు..
తాజావార్తలు
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్గా..
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
-
Brad Pitt : ఏంజెలీనా జోలీని వివాహం చేసుకోవడమే నా జీవితంలో అతిపెద్ద తప్పు
-
Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!