Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలోని దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే భారీ శుభవార్త అందించనుంది. ప్రస్తుతం ఇస్తున్న ఆసరా పెన్షన్ మొత్తాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వెల్లడించారు. దివ్యాంగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పూర్తి కట్టుబడి ఉందని, ఇందులో భాగంగానే ప్రస్తుతం ఇస్తున్న 4,000 రూపాయల పెన్షన్ను 6,000 రూపాయలకు పెంచబోతున్నామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంపై ఎంతటి ఆర్థిక భారం ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల అమలులో వెనక్కి తగ్గేది లేదని, అర్హులైన దివ్యాంగులందరికీ పెన్షన్లు సక్రమంగా అందుతాయని ఆయన భరోసా ఇచ్చారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు దివ్యాంగుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని మంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2014 మేనిఫెస్టోలో ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేశారని, 2018లో అసలు దివ్యాంగుల అంశాన్నే పట్టించుకోలేదని విమర్శించారు. నిన్నటి సమావేశంలో హరీష్ రావు పచ్చి అబద్ధాలు మాట్లాడారని, కేవలం ముఖ్యమంత్రిని తిట్టడమే లక్ష్యంగా దివ్యాంగుల సమావేశాన్ని ఏర్పాటు చేశారని మండిపడ్డారు. దివ్యాంగులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్న హరీష్ రావుకు త్వరలోనే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రజా సమస్యలు ఏవైనా ఉంటే రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడాలని, ప్రతి శాఖ నుంచి సమాధానం ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ చేశారు.
Also Read
- Vaibhav Sooryavanshi: చరిత్ర తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కెప్టెన్గా బాధ్యతలు స్వీకరణ..
- Vijaysai Reddy: సొంత కారణాలతోనే విజయసాయి రెడ్డి బయటకు వెళ్లారు.. పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారు!
- Skincare Tips: బ్యూటీ పార్లర్కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..
- Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
తమ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించిందని మంత్రి తెలిపారు. రూ. 50 కోట్ల నిధులతో మోపెడ్ వాహనాలు, బ్యాటరీ వీల్ చైర్లను పంపిణీ చేశామని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో దివ్యాంగులకు ప్రత్యేక కోటాను ఏర్పాటు చేశామని చెప్పారు. పుట్టిన వెంటనే శిశువులకు ఏదైనా అంగవైకల్యం గుర్తిస్తే, ‘బాల భరోసా’ పథకం కింద ప్రభుత్వమే పూర్తి ఖర్చు భరించి కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స అందిస్తోందని వివరించారు. భవిష్యత్తులో దివ్యాంగులకు మరిన్ని పారదర్శకమైన సేవలు అందిస్తామని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
-
Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
-
Secret Soldier : సెన్సార్ బోర్డులో 8 నెలలు.. హోమ్ మినిస్ట్రీకి వెళ్లిన ‘సీక్రెట్ సోల్జర్’
-
Ariyana Glory : హిజ్రాలపై అరియానా గ్లోరి సంచలన వ్యాఖ్యలు
-
Vaibhav Sooryavanshi: చరిత్ర తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కెప్టెన్గా బాధ్యతలు స్వీకరణ..
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!