Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- ఇవాళ మార్కాపురం జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు..
- వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభించనున్న సీఎం..
- వెలిగొండ జలసిరులు-అభివృద్ధికి రెక్కలు పేరుతో వేడుకగా కార్యక్రమం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Veligonda Project: మార్కాపురం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1ను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ‘వెలిగొండ జలసిరులు–అభివృద్ధికి రెక్కలు’ పేరుతో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమాలను పూర్తి చేయనున్నారు.
సీఎం చంద్రబాబు ఉదయం 9.30 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరుతారు. ఉదయం 10.15 గంటలకు మార్కాపురం జిల్లా దోర్నాల మండలం గంటవానిపల్లి హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇతర ప్రముఖులు ముఖ్యమంత్రికి స్వాగతం పలకనున్నారు. ఆ తర్వాత ఉదయం 10.25 గంటలకు సీఎం చంద్రబాబు రోడ్డు మార్గంలో వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ వేదికకు చేరుకుంటారు. ఉదయం 10.35 గంటల నుంచి 11.20 గంటల వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1ను ముఖ్యమంత్రి ప్రారంభించడంతో పాటు ప్రాజెక్టు ప్రారంభోత్సవ పైలాన్ను ఆవిష్కరిస్తారు.
Also Read
- Ongole: లిఫ్ట్లో ఇరుక్కుని మహిళ మృతి..! సీసీటీవీ ఫుటేజ్ వైరల్..
- Kambham Road Accident: పెళ్లి ఇంట్లో పెను విషాదం.. ఇద్దరు అన్నలు సహా నలుగురు మృతి.. పెళ్లి కూతురుకి తీవ్రగాయాలు..
- CM Chandrababu: వెలిగొండ ప్రాజెక్ట్తో దశాబ్దాల కరవు పోతుంది.. అభివృద్ధికి ఓటేయాలన్న చంద్రబాబు
- Hidden Treasure : అడవిలో అర్థరాత్రి తవ్వకాలు.. గుప్తనిధుల కోసం ఫారెస్ట్ ఆఫీసర్లే వేట.?
అనంతరం వెలిగొండ ప్రాజెక్టు గేట్లను ప్రారంభించి కృష్ణా జలాలను వెలిగొండకు విడుదల చేసే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఈ కార్యక్రమం అనంతరం ఉదయం 11.30 గంటలకు గంటవానిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. గంటవానిపల్లిలో నిర్వహించే ప్రజా వేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించనున్నారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా అందుబాటులోకి వచ్చే సాగు, తాగునీటి ప్రయోజనాలతో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సీఎం మాట్లాడనున్నారు. సభ అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు చంద్రబాబు తిరుగు ప్రయాణం ప్రారంభించి.. మధ్యాహ్నం 2.15 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.
తాజావార్తలు
-
UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్రాజ్లో ఎస్పీ నేత హత్య
-
Cheyutha Pension : గుడ్న్యూస్.. చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?