TSRTC: ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త.. సుదూర ప్రాంతాలకు స్పెషల్ ట్రిప్పులు
TSRTC: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా టీఎస్ ఆర్టీసీ శుభవార్త అందించింది. శంషాబాద్ విమానాశ్రయంలో పుష్పక్ బస్సు ఎక్కిన వారు నగరంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని గ్రేటర్ హైదరాబాద్ జోన్ అందుబాటులోకి తెచ్చింది. పుష్పక్ బస్సులో టికెట్ కొనుగోలు చేసినప్పటి నుంచి 3 గంటల పాటు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు.
శంషాబాద్ విమానాశ్రయం నుంచి వచ్చే పుష్పక్ బస్సులు కొన్ని ప్రధాన ప్రాంతాలకే పరిమితమయ్యాయి. ఆ తర్వాత ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఇతర బస్సులను ఆశ్రయించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సిటీ బస్సుల్లో ఈ సౌకర్యం కల్పించినట్లు టీఎస్ ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. అయితే ఇది ఎయిర్ పోర్టు స్టాప్ లో టికెట్ కొన్న వారికే వర్తిస్తుందని చెబుతున్నారు. మధ్యలో బస్సు ఎక్కిన వారికి ఈ ఆఫర్ వర్తించదని తెలిపారు. టీఎస్ ఆర్టీసీ కూడా ప్రయాణికులకు మరో శుభవార్త అందించింది. వరుస సెలవుల నేపథ్యంలో దూర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. సంస్థ హైదరాబాద్ నుండి చెన్నై, షిర్డీ, విశాఖపట్నం, కాకినాడ, అమలాపురం తదితర ప్రాంతాలకు ఈ ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. ప్రయాణికులు అధికారిక వెబ్సైట్ http://tsrtconline.inలో టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం 040-69440000, 040-23450033 TSRTC కాల్ సెంటర్ నంబర్లను సంప్రదించాలని TSRTC అధికారులు వెల్లడించారు.
Also Read
- GPO Promotions : గ్రామ పంచాయతీ అధికారుల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్
- Fuel Shortage Telangana : తెలంగాణలో పెట్రోల్, డీజిల్ సరఫరాపై సివిల్ సప్లై శాఖ కీలక ప్రకటన
- Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి 'భట్టి' భరోసా.. రూ.1000 కోట్ల బకాయిల విడుదల.!
- MLA Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది.!
Read also: Fire Aciident: చందానగర్లో అగ్ని ప్రమాదం.. జేపీ సినిమాస్ మల్టీఫ్లెక్స్లో చేలరేగిన మంటలు..
హైదరాబాద్ మెట్రో రైల్ కూడా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ‘సూపర్ సేవర్ ఫ్రీడమ్ ఆఫర్’ పేరుతో ఈ ఆఫర్ను తీసుకొచ్చి రూ.59తో సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డును రీఛార్జ్ చేసుకోవడం ద్వారా ఈ నెల 12, 13, 15 తేదీల్లో మెట్రోలో అపరిమితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. ఆ రోజుల్లో రూ. 59 రీఛార్జ్తో అన్లిమిటెడ్ జర్నీ చేయవచ్చని వెల్లడించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మెట్రో అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.
ప్రయాణికులకు శుభవార్త! వరుస సెలవుల నేపథ్యంలో ఈ రోజు, రేపు సుదూర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను #TSRTC ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నుంచి చెన్నై, షిర్దీ, విశాఖపట్నం, కాకినాడ, అమలాపురం, తదితర ప్రాంతాలకు ఈ ప్రత్యేక సర్వీసులను సంస్థ నడుపుతోంది. ప్రయాణికులు అధికారిక వెబ్ సైట్…
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) August 11, 2023
Heavy Rain in Hyderabad: మరోసారి కమ్ముకున్న మబ్బులు.. నగరంలో కుమ్మేస్తున్న వానలు
తాజావార్తలు
-
Egg Pickle Recipe : నాలుకపై నర్తించే రుచి.. ఇంట్లోనే కోడిగుడ్డు పచ్చడి.. తయారీ విధానం ఇలా..!
-
Toxic Effect: ‘మా ఇంటి బంగారం’ వాయిదా?
-
Ragi Sarva Pindi: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. తెలంగాణ స్పెషల్ ‘రాగి పిండి సర్వపిండి’.. ఇలా ట్రై చేయండి!
-
Bengal Elections: మళ్లీ 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. రికార్డ్ స్థాయిలో ఓటింగ్..
-
Riyan Parag: జైలు శిక్షా లేక జరిమానా.. RR కెప్టెన్పై బీసీసీఐ కఠిన చర్యలు.?
ట్రెండింగ్
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!