Charminar: ఛీ..ఛీ.. చార్మినార్ పై ఏంట్రా ఇలా చెలరేగిపోతున్నారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Charminar: హైదరాబాద్ అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది చార్మినార్. ఇదీ మన భాగ్య నగరానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గుర్తింపు. హైదరాబాద్ పాతబస్తీలోని చార్మినార్ భారతదేశంలోని ప్రసిద్ధ భవనాలలో ఒకటి. హైదరాబాదును సందర్శించే ప్రతి పర్యాటకుడు తప్పక చూడవలసిన అద్భుతమైన భవనం. చార్మినార్ను 1591లో హైదరాబాద్ను పాలించిన మహమ్మద్ కులీ కుతుబ్షా నిర్మించారు. ఇది మన హైదరాబాద్ నగరానికి బెంచ్ మార్క్ గా మారింది. అయితే ఇప్పుడు ఆ చార్మినార్ ప్రాంతంలో అంధకారం అలుముకుంది. నిత్యం వేలాది మంది వచ్చే ఈ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డంకిగా మారింది. పర్యాటక కేంద్రంగా పేరొందిన ఆ ప్రదేశంలో కొందరు చేస్తున్న పని పర్యాటకులకు ఇబ్బందికి గురిచేస్తోంది. ఇప్పటి వరకు రాత్రిపూట కూడా రద్దీ లేని చార్మినార్.. బ్యాంగిల్స్, ఇతర దుకాణాలు నిత్యం కిటకిటలాడేవి. అయితే ఇప్పుడు చాలు చార్మినార్కు వెళ్లే ప్రధాన రహదారులను పోలీసులు అర్థరాత్రి మూసివేస్తున్నారు.
Read also: TSRTC: ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త.. సుదూర ప్రాంతాలకు స్పెషల్ ట్రిప్పులు
Also Read
- Danam Nagender : ఎమ్మెల్యేగా అనర్హత వేటుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
- Danam Nagender : దానం నాగేందర్ ఉదంతంపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..
- Danam Nagender : దానం నాగేందర్పై అనర్హత వేటు.. స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టిన హైకోర్టు
- Uttam Kumar Reddy : తెలంగాణలో నీటి కొరత.. రైతులకు ఉత్తమ్ కీలక హామీ
కొందరు ప్రేమికులు రాత్రి వేళల్లో దురుసుగా ప్రవర్తించడం, గొడవ పడుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో చార్మినార్ చూసేందుకు దూరప్రాంతాల నుంచి వచ్చే వారికి నిరాశ తప్పలేదు. చాలా దూరం నుంచి వస్తున్నా.. అదే దూరం నుంచి చార్మినార్ని చూసి చీకట్లో సెల్ఫీలు దిగాల్సిన పరిస్థితి నెలకొంది. ఎంతో ఆశతో వస్తుంటే చార్మినార్ ను దగ్గర నుంచి చూడలేకపోతున్నామని పర్యాటకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొందరు చేసిన పనికి తమను ఇబ్బంది పెట్టడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా రాత్రి వేళల్లో రోడ్లను మూసివేస్తున్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. తాజాగా కేంద్రమంత్రి కిషన్రెడ్డి కూడా చార్మినార్ను రాత్రిపూట అందంగా తీర్చిదిద్దేందుకు ఇల్యూమినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 190 వాట్ల ఎల్ఈడీ లైట్లు కూడా అమర్చారు. అలాగే ఏడాది పొడవునా ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక దీపాలు వెలిగిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. కొత్త అందాలతో చార్మినార్ని చూసేందుకు చాలా మంది పర్యాటకులు అక్కడికి వెళుతున్నారు. పోలీసుల ఆంక్షలతో వారు నిరాశ మిగిల్చింది.
Fire Aciident: చందానగర్లో అగ్ని ప్రమాదం.. జేపీ సినిమాస్ మల్టీఫ్లెక్స్లో చేలరేగిన మంటలు..
తాజావార్తలు
-
Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
-
Danam Nagender : ఎమ్మెల్యేగా అనర్హత వేటుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
-
West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్లో ట్విస్ట్
-
Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
-
Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..