Charminar: ఛీ..ఛీ.. చార్మినార్ పై ఏంట్రా ఇలా చెలరేగిపోతున్నారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Charminar: హైదరాబాద్ అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది చార్మినార్. ఇదీ మన భాగ్య నగరానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గుర్తింపు. హైదరాబాద్ పాతబస్తీలోని చార్మినార్ భారతదేశంలోని ప్రసిద్ధ భవనాలలో ఒకటి. హైదరాబాదును సందర్శించే ప్రతి పర్యాటకుడు తప్పక చూడవలసిన అద్భుతమైన భవనం. చార్మినార్ను 1591లో హైదరాబాద్ను పాలించిన మహమ్మద్ కులీ కుతుబ్షా నిర్మించారు. ఇది మన హైదరాబాద్ నగరానికి బెంచ్ మార్క్ గా మారింది. అయితే ఇప్పుడు ఆ చార్మినార్ ప్రాంతంలో అంధకారం అలుముకుంది. నిత్యం వేలాది మంది వచ్చే ఈ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డంకిగా మారింది. పర్యాటక కేంద్రంగా పేరొందిన ఆ ప్రదేశంలో కొందరు చేస్తున్న పని పర్యాటకులకు ఇబ్బందికి గురిచేస్తోంది. ఇప్పటి వరకు రాత్రిపూట కూడా రద్దీ లేని చార్మినార్.. బ్యాంగిల్స్, ఇతర దుకాణాలు నిత్యం కిటకిటలాడేవి. అయితే ఇప్పుడు చాలు చార్మినార్కు వెళ్లే ప్రధాన రహదారులను పోలీసులు అర్థరాత్రి మూసివేస్తున్నారు.
Read also: TSRTC: ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త.. సుదూర ప్రాంతాలకు స్పెషల్ ట్రిప్పులు
Also Read
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
- Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
కొందరు ప్రేమికులు రాత్రి వేళల్లో దురుసుగా ప్రవర్తించడం, గొడవ పడుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో చార్మినార్ చూసేందుకు దూరప్రాంతాల నుంచి వచ్చే వారికి నిరాశ తప్పలేదు. చాలా దూరం నుంచి వస్తున్నా.. అదే దూరం నుంచి చార్మినార్ని చూసి చీకట్లో సెల్ఫీలు దిగాల్సిన పరిస్థితి నెలకొంది. ఎంతో ఆశతో వస్తుంటే చార్మినార్ ను దగ్గర నుంచి చూడలేకపోతున్నామని పర్యాటకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొందరు చేసిన పనికి తమను ఇబ్బంది పెట్టడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా రాత్రి వేళల్లో రోడ్లను మూసివేస్తున్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. తాజాగా కేంద్రమంత్రి కిషన్రెడ్డి కూడా చార్మినార్ను రాత్రిపూట అందంగా తీర్చిదిద్దేందుకు ఇల్యూమినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 190 వాట్ల ఎల్ఈడీ లైట్లు కూడా అమర్చారు. అలాగే ఏడాది పొడవునా ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక దీపాలు వెలిగిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. కొత్త అందాలతో చార్మినార్ని చూసేందుకు చాలా మంది పర్యాటకులు అక్కడికి వెళుతున్నారు. పోలీసుల ఆంక్షలతో వారు నిరాశ మిగిల్చింది.
Fire Aciident: చందానగర్లో అగ్ని ప్రమాదం.. జేపీ సినిమాస్ మల్టీఫ్లెక్స్లో చేలరేగిన మంటలు..
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!