Gadwal: సారీ కాదు కాళ్లే మొక్కుతా.. లోక్ అదాలత్లో హృదయాలను కదిలించే సంఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gadwal: జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గద్వాల పట్టణంలోని సుంకులమ్మ మెట్టుకు చెందిన డ్రైవర్ గోవింద్ కు రాజేశ్వరి అనే మహిళతో వివాహమైంది. అయితే గోవిందు తాగిన మైకంలో తరచూ భార్యతో గొడవ పడేవాడు. దీంతో విసిగిపోయిన రాజేశ్వరి ఎట్టకేలకు గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కొన్ని రోజుల తర్వాత రాజీ కోసం జాతీయ లోక్ అదాలత్ను ఆశ్రయించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.కుషా సమక్షంలో జరిగిన లోక్ అదాలత్లో మొదటి అదనపు జిల్లా జడ్జి అన్నీరోస్ క్రిస్టియన్, సీనియర్ సివిల్ జడ్జి గంటా కవిత, జూనియర్ సివిల్ జడ్జి ఉదయ్ నాయక్ భార్య భర్తలిద్దరిని పిలిపించి ఏం జరగిందని అడిగారు. రాజేశ్వరి తన భర్త అంటే ఇష్టమే కానీ రోజూ తాగి వచ్చి తనపై దాడి చేస్తాడని తెలిపింది. గోవింద్ భార్య చెప్పింది నిజమేనని ఒప్పుకున్నాడు. తాను చేసింది తప్పే కానీ.. పెద్దవాళ్లు ఏం చెబితే అదే చేస్తానని తెలిపాడు.
Read also: Rural Constable: కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం.. జీవో నం.46 సవరణ చేయాలని నిరసన
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
అయితే అక్కడున్న వారందరూ దంపతులను పిలిచి పూల దండలు మార్చుకునేందుకు అనుమతించారు. అందరి సమక్షంలోఇద్దరూ దండలు మార్చుకున్నారు. భార్యభర్తలిద్దరూ కన్నీరుమున్నీరయ్యారు. ఈ సందర్భంగా గోవింద్ భావోద్వేగానికి గురయ్యారు. తాగిన మైకంలో భార్యను కొట్టడం తప్పేనని నిజాయితీగా ఒప్పుకున్నాడు. క్షమాపణ చెప్పాలని న్యాయమూర్తులు కోరగా.. తన భార్యకు క్షమాపణలు చెబుతానని చెప్పాడు. క్షమాపణలే కాదు కాళ్లు ముక్కుతా అంటూ అంత మంది ముందు భార్యకాలు పట్టుకున్నాడు. దీంతో అక్కడకు వచ్చిన వాళ్లందరూ తప్పట్లు, విజిల్స్ వేశారు. నిజానికి తన భార్య తన తల్లిదండ్రుల కంటే ఎక్కువగా చూసుకుంటుందని గోవింద్ అన్నాడు. అందుకే ఇకపై ఎలాంటి తప్పు చేయనని గోవింద్ చెప్పాడు. ఈ ఘటనతో లోక్ అదాలత్ ఒక్కసారిగా చప్పట్లతో మారుమోగింది.
Minister KTR: డబ్బా బిల్డింగులే కాదు.. అట్రాక్టివ్గా కూడా నిర్మాణాలు జరగాలి
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!