కెసిఆర్ కు పూర్తి స్వేచ్ఛ ఉంది.. ఆయన పార్టీ పెట్టుకోవచ్చు అని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యంగాస్త్రం వేశారు. ఉట్టికి ఎగరనేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టు కెసిఆర్ పని ఉందని ఎద్దేవ చేశారు. ప్రత్యామ్నాయ శక్తి అంటే కుటుంబ పాలన, అవినీతి నా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ రాజకీయాలకు కాలం చెల్లిందని మండిపడ్డారు. మోడీనీ ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయని లక్ష్మణ్ అన్నారు.
బంగారు తెలంగాణ చేశాడు.. ఇక బంగారు భారత దేశాన్ని తయారు చేస్తాడ? అంటూ ఎద్దేవ చేశారు. దేశం అభివృద్ధి చెందుతుంది. తెలంగాణ కి కెసిఆర్ ఏమి చేశాడో చెప్పాలని ప్రశ్నించారు. కెసిఆర్ ను దేశంలో ఏ పార్టీ నమ్మే పరిస్థితి లేదని నిప్పులు చెరిగారు. ఆయన ఫ్రంట్ లకు, టెంట్ లకు ఆదరణ లేదని విమర్శించారు. మోడీనీ ప్రజలు అభిమానిస్తున్నారని లక్ష్మణ్ అన్నారు. దేశాన్ని బిజెపి విచ్ఛిన్నం చేస్తే.. గల్లీ నుండి ఢిల్లీ వరకు బిజెపి ఎందుకు గెలుస్తుందని నిలదీశారు.
కెసిఆర్ విదేశాంగ విధానం ఏంటి.. పార్టీ విధి విధానాలు ఏంటి ? అని ప్రశ్నించారు. సీఎం ప్రజల గురించి పట్టించుకోవడం లేదు కాబట్టే గవర్నర్ మహిళా దర్బార్ పెట్టారని గుర్తు చేశారు. ప్రజలకు సేవ చేయాలి అంటే రాజకీయాల్లోనే ఉండాల్సిన అవసరం లేదని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఈ సందర్భంగా కొనియాడారు.
