Kunamneni Sambasiva Rao: బీజేపీతోనే దేశానికి ప్రమాదం.. బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కావాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kunamneni Sambasiva Rao Fires On BJP And Narendra Modi: దేశ సమగ్రత, సార్వభౌమాధికారం, ఆర్థిక స్వాలంబనకు ఢోకా ఏర్పడిందని.. ప్రస్తుతం రాజ్యాంగమే ప్రమాదంలో పడిందని.. దీనికంతటికీ కేంద్ర ప్రభుత్వ విధివిధానాలే కారణమని తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. గురువారం షాద్నగర్లోని కేకేఆర్ కన్వెన్షన్లో సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్లో ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని పక్కనపెట్టి, మనువాదాన్ని కేంద్ర ప్రభుత్వం తెరపైకి తెస్తోందని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని విచ్చలవిడిగా భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. దేశ సమగ్రతకు, సమైక్యతకు విఘాతం కల్పిస్తున్నారని.. దేశంలో బీజేపీ విస్తరిస్తే ప్రమాదం పొంచి ఉందని వ్యాఖ్యానించారు. బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాల్సిన సమయం ఆస్నమైందని పిలుపునిచ్చారు.
Acid Attack : టీ ఇవ్వలేదని భార్యపై యాసిడ్ పోసిన భర్త
Also Read
- CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
- Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
- Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
గత అసెంబ్లీ ఎన్నికల్లో తాము బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపామన్న సాంబశివరావు.. భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ లాంటి పార్టీలు బలపడాలని కోరుకుంటున్నామని చెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను తమ గుప్పిట్లో పెట్టుకొని, విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా లాంటి వారిపై చట్టం తన పని తాను చేయకుండా.. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని, రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటుందని పేర్కొన్నారు. తప్పు చేస్తే ఎవరినైనా శిక్షించాలి కానీ.. దర్యాప్తు సంస్థల్లో కేంద్ర ప్రభుత్వం వేలు పెట్టడం మంచిది కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను బెదిరించి లొంగదీసుకోవాలనుకోవడం మూర్ఖత్వం అవుతుందన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ ఎంపీలు 58 మంది, అదేవిధంగా 170 మంది ఎమ్మెల్యేలు అవినీతి అక్రమాల్లో కూరుకుపోయారని.. ఇవి కేంద్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ధ్వజమెత్తారు. ఎంతోమంది ఆర్థికంగా 150 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొడితే.. కేంద్రం వారిని పట్టించుకున్న పాపాన పోలేదని విరుచుకుపడ్డారు.
K Laxman: యువత బతుకుల్ని తెలంగాణ ప్రభుత్వం ఆగం చేసింది
అవినీతి చేసిన వారు బీజేపీలో ఉంటే పునీతులు అవుతారని, లేకపోతే పాపాత్ములు అవుతారనే చందంగా బీజేపీ వ్యవహరిస్తుందని కూనంనేని ఎద్దేవా చేశారు. తొమ్మిది రాష్ట్రాల్లో అన్యాయంగా ప్రభుత్వాలను బీజేపీ కూలగొట్టిందని అన్నారు. భవిష్యత్తులో కేంద్రం పెద్దలు అనుభవించాల్సి ఉంటుందని, మోడీ కూడా జైలు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ.. రాజ్యాంగ వ్యవస్థను నాశనం చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని వార్నింగ్ ఇచ్చారు. తొమ్మిదేళ్లలో గాలి జనార్ధన్ రెడ్డి, యడ్యూరప్ప లాంటివారు ఎందరో ఆర్థిక సంపదలు కొల్లగొట్టారని.. వీరిని ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బండి సంజయ్, అరవింద్ ఓడిపోతారని.. ఒక్క లోక్సభ స్థానం కూడా బీజేపీకి దక్కదని జోస్యం చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పొత్తు ఉంటుందని స్పష్టం చేసిన ఆయన.. అనేక స్థానాల్లో సీపీఐ ఉమ్మడిగా పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెడతామని, బీజేపీని ఎదురిస్తామని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: రోహిత్-కోహ్లీ భవిష్యత్తుపై ప్రశ్న.. హ్యారీ బ్రూక్ సమాధానం ఇదే!
-
OPPO K14x 5G: ఒప్పో K14x 5G.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్!
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్లో కీలక పరిణామం..
-
Rohit Sharma: ఇంగ్లండ్తో మూడో వన్డే మ్యాచ్.. అదే రోహిత్కు ప్రధాన సమస్య!
-
Bollywood: బాలీవుడ్లో కోట్లు కురిపిస్తున్న కామెడీ చిత్రాలు
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!