K Laxman: యువత బతుకుల్ని తెలంగాణ ప్రభుత్వం ఆగం చేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MP K Laxman Fires On BRS Govt Over TSPSC Paper Leak: తెలంగాణ యువత బతుకుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆగం చేసిందని బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్ సంచలన ఆరోపణలు చేశారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంపై ఆయన స్పందిస్తూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం లీకుల ప్రభుత్వంగా మారిందని పేర్కొన్నారు. ఈ లీకుల్ని బీజేపీ ఖండిస్తోందన్నారు. ఎన్నో సంవత్సరాలుగా వేచి చూస్తున్న యువతల అశలపై నీళ్ళు పోశారని మండిపడ్డారు. సిట్ విచారణపై తమకు నమ్మకం కుదరడం లేదని, అనేక కేసుల్లో సిట్ల విచారణ వేగవంతంగా జరగలేదని అన్నారు. నయీమ్ కేసు నుంచి మొన్నటి డ్రగ్స్ కేసు వరకు.. సిట్ విచారణలేమీ తేలలేదన్నారు. అవినీతి కేసుల్ని మూసివేసే దాంట్లో రాష్ట్ర ఏసీబీకి దేశంలోనే గొప్ప పేరుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కనుసన్నల్లోనే ఈ కేసుల విచారణ జరుగుతోందని చెప్పారు.
Talasani Srinivas Yadav: మేము కమిట్మెంట్తో పని చేస్తుంటే.. బీజేపీ కుట్రలు చేస్తుంది
Also Read
- CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
- Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
- Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
- Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
గతంలో కూడా ఎన్నోసార్లు పేపర్ లీకేజీలు జరిగాయని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. 26 మంది ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమని విమర్శించారు. ఉస్మానియా యూనివర్సిటీ మరోసారి ఉద్యమాలకు వేదికగా మారబోతుందన్నారు. లిక్కర్ కేసులో నోటీసులు జారీ చేసినప్పుడు విచారణకు సహకరిస్తామని కవిత చెప్పారని.. విచారణ ఎదుర్కొని నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. తప్పించుకునే మార్గాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. తప్పు చేసిన వారే తప్పించుకోవడానికి మార్గాలు వెతుకుతారన్నారు. తప్పు చేయనప్పుడు విచారణకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. గతంలో అనేకమంది రాజకీయ నాయకులు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఈడీ విచారణను ఎదుర్కున్నారన్నారు. ఇక బీజేపీలో అందరూ ఐక్యంగానే ఉన్నామని, అసమ్మతి లేదని ఎంపీ లక్ష్మణ్ స్పష్టత ఇచ్చారు.
తాజావార్తలు
-
Udaya Bhanu : నా పర్సనల్ లైఫ్ రచ్చకెక్కి ఛానళ్ల దాకా ఎందుకు వెళ్లిందంటే.. అసలు నిజాన్ని బయటపెట్టిన ఉదయభాను!
-
Udaya Bhanu: బంగారు తాళిబొట్టు పార్శిల్.. ‘నా శ్రీమతి’ అంటూ లెటర్స్.. భయంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన స్టార్ యాంకర్!
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!