K Laxman: యువత బతుకుల్ని తెలంగాణ ప్రభుత్వం ఆగం చేసింది
BJP MP K Laxman Fires On BRS Govt Over TSPSC Paper Leak: తెలంగాణ యువత బతుకుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆగం చేసిందని బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్ సంచలన ఆరోపణలు చేశారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంపై ఆయన స్పందిస్తూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం లీకుల ప్రభుత్వంగా మారిందని పేర్కొన్నారు. ఈ లీకుల్ని బీజేపీ ఖండిస్తోందన్నారు. ఎన్నో సంవత్సరాలుగా వేచి చూస్తున్న యువతల అశలపై నీళ్ళు పోశారని మండిపడ్డారు. సిట్ విచారణపై తమకు నమ్మకం కుదరడం లేదని, అనేక కేసుల్లో సిట్ల విచారణ వేగవంతంగా జరగలేదని అన్నారు. నయీమ్ కేసు నుంచి మొన్నటి డ్రగ్స్ కేసు వరకు.. సిట్ విచారణలేమీ తేలలేదన్నారు. అవినీతి కేసుల్ని మూసివేసే దాంట్లో రాష్ట్ర ఏసీబీకి దేశంలోనే గొప్ప పేరుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కనుసన్నల్లోనే ఈ కేసుల విచారణ జరుగుతోందని చెప్పారు.
Talasani Srinivas Yadav: మేము కమిట్మెంట్తో పని చేస్తుంటే.. బీజేపీ కుట్రలు చేస్తుంది
Also Read
గతంలో కూడా ఎన్నోసార్లు పేపర్ లీకేజీలు జరిగాయని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. 26 మంది ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమని విమర్శించారు. ఉస్మానియా యూనివర్సిటీ మరోసారి ఉద్యమాలకు వేదికగా మారబోతుందన్నారు. లిక్కర్ కేసులో నోటీసులు జారీ చేసినప్పుడు విచారణకు సహకరిస్తామని కవిత చెప్పారని.. విచారణ ఎదుర్కొని నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. తప్పించుకునే మార్గాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. తప్పు చేసిన వారే తప్పించుకోవడానికి మార్గాలు వెతుకుతారన్నారు. తప్పు చేయనప్పుడు విచారణకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. గతంలో అనేకమంది రాజకీయ నాయకులు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఈడీ విచారణను ఎదుర్కున్నారన్నారు. ఇక బీజేపీలో అందరూ ఐక్యంగానే ఉన్నామని, అసమ్మతి లేదని ఎంపీ లక్ష్మణ్ స్పష్టత ఇచ్చారు.
తాజావార్తలు
-
Green Moong Dal Laddu: ప్రోటీన్ పుష్కలంగా ఉండే పెసరపప్పు బెల్లం లడ్డు.. పిల్లల కోసం అదిరిపోయే హెల్దీ స్నాక్.!
-
CSK Vs GT: ఒంటరి పోరాటం చేసిన రుతురాజ్ గైక్వాడ్.. చెపాక్లో కెప్టెన్ వీరోచిత ఇన్నింగ్స్..
-
Ragi Puri: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. రాగి పిండితో మెత్తటి పూరీలు.. ఇలా చేస్తే లొట్టలేయాల్సిందే!
-
Senior Citizen FD: సీనియర్ సిటిజన్లకు FDలో అత్యధిక రాబడి.. ఏ బ్యాంకులు ఉత్తమం? పూర్తి వివరాలు
-
FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!