KTR : ఒక్క ఓటు కూడా పోవద్దు.!
- ప్రతి బూత్లో మెజారిటీ లక్ష్యంగా పనిచేయండి
- అక్టోబర్ 1న ఫైనల్ ఓటర్ లిస్ట్
- డూప్లికేట్ ఓట్లపై ప్రత్యేక దృష్టి
- ఇంటింటికీ వెళ్లి ఓటర్ల ధృవీకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : ఎన్నికల్లో భారీ విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యూహాలను వివరించారు. ఎన్నికల సమయంలో బూత్ లెవెల్ ఏజెంట్లు (BLA) , పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఎలా అప్రమత్తంగా వ్యవహరించాలో దిశానిర్దేశం చేశారు. ఎంత పెద్ద నాయకుడైనా ముందు తన సొంత బూత్లో మెజారిటీని నిరూపించుకోవాలని, అప్పుడే పార్టీ గెలుపు సులువవుతుందని ఆయన స్పష్టం చేశారు.
అక్టోబర్ 1న ఫైనల్ ఓటర్ లిస్ట్.. ప్రతి ఓటూ ముఖ్యం
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కాలపరిమితిని గుర్తుచేస్తూ.. ఆగస్టు 30 వరకు కొత్త ఓట్ల నమోదు, మార్పులు చేర్పులు , అభ్యంతరాలను స్వీకరించే సమయం ఉందని కేటీఆర్ తెలిపారు. సెప్టెంబర్ 28 నాటికి ఈ ప్రక్రియ అంతా పూర్తయి, అక్టోబర్ 1వ తేదీన ఫైనల్ ఓటర్ లిస్ట్ విడుదలవుతుందని పేర్కొన్నారు. ఈ ఫైనల్ లిస్ట్ రాబోయే ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా వర్తిస్తుందని, కాబట్టి ఒక్క ఓటు కూడా వృధా కాకుండా ప్రతి బూత్లోనూ కార్యకర్తలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఇందుకోసం ప్రభుత్వ బూత్ లెవెల్ ఆఫీసర్ (BLO) తో కలిసి ఓటరు జాబితాను నిరంతరం సరిచూసుకోవాలని ఆదేశించారు.
Also Read
- Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
- OTR: వరంగల్ కాంగ్రెస్లో అసలేం జరుగుతోంది? కొండా వర్సెస్ కాంగ్రెస్ నేతలు..
- రాష్ట్రమంతా సమస్య ఉంటే.. అది విధానపరమైన తప్పిదమే: హరీష్ రావు
- సామాన్యులకు ఒక రూల్.. సీఎంకు, రెవెన్యూ మంత్రికి మరో రూలా..?: హరీష్రావు
డూప్లికేట్ ఓట్ల గుర్తింపు.. ‘హ్యాండ్ బుక్’తో ఇంటింటికీ..
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడంతో పాటు అక్రమ, డూప్లికేట్ ఓట్లను తొలగించడమే పార్టీ ప్రధాన లక్ష్యమని కేటీఆర్ స్పష్టం చేశారు. ఒకే వ్యక్తికి వేర్వేరు నియోజకవర్గాల్లో లేదా ప్రాంతాల్లో ఓట్లు ఉండే అవకాశం ఉందని, ఉదాహరణకు లావణ్య అనే వ్యక్తికి ఐదు చోట్ల ఓట్లు ఉన్నట్లు క్షేత్రస్థాయి పరిశీలనలో తేలిందని ఉదహరించారు. ఇలాంటి అనుమానాస్పద, డూప్లికేట్ ఓట్ల జాబితాను ప్రత్యేకంగా తయారు చేసి పార్టీ నాయకులకు అందజేయాలన్నారు. కార్యకర్తల సౌకర్యార్థం పార్టీ తరపున ‘హ్యాండ్ బుక్’, ‘వర్క్ బుక్’ అందజేస్తామని, వీటి సహాయంతో ప్రతి ఒక్కరూ ఇంటింటికీ తిరిగి ఖచ్చితమైన వివరాలు సేకరించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రజలు , కార్యకర్తలతో పూర్తిస్థాయిలో మమేకమై పనిచేస్తేనే ఎన్నికల్లో భారీ విజయం సాధ్యమవుతుందని కేటీఆర్ పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!